Shuru
Apke Nagar Ki App…
హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలోని మన్ననూర్ ఘాట్ సెక్షన్ పరిధిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ఇరుకు రోడ్లు, భారీ గుంతల కారణంగా రోడ్డు పక్కకు వాహనాలను దింపాలన్నా వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ దారిలో ప్రయాణిస్తూ మరింతగా అవస్థలు పడుతున్నారు. ఈ దుస్థితిపై ఆర్అండ్ బీ అధికారులు తక్షణమే స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను వెంటనే మరమ్మతు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులు ఇంతలా ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Uday
హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలోని మన్ననూర్ ఘాట్ సెక్షన్ పరిధిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ఇరుకు రోడ్లు, భారీ గుంతల కారణంగా రోడ్డు పక్కకు వాహనాలను దింపాలన్నా వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ దారిలో ప్రయాణిస్తూ మరింతగా అవస్థలు పడుతున్నారు. ఈ దుస్థితిపై ఆర్అండ్ బీ అధికారులు తక్షణమే స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను వెంటనే మరమ్మతు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులు ఇంతలా ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
More news from Nagarkurnool and nearby areas
- హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలోని మన్ననూర్ ఘాట్ సెక్షన్ పరిధిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ఇరుకు రోడ్లు, భారీ గుంతల కారణంగా రోడ్డు పక్కకు వాహనాలను దింపాలన్నా వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ దారిలో ప్రయాణిస్తూ మరింతగా అవస్థలు పడుతున్నారు. ఈ దుస్థితిపై ఆర్అండ్ బీ అధికారులు తక్షణమే స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను వెంటనే మరమ్మతు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులు ఇంతలా ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గౌరారం గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవాలు అత్యంత కన్నులపండువగా, ఘనంగా సాగాయి. ఈ వేడుకల సందర్భంగా ఉదయం నుంచే గ్రామ దేవతకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలతో మహిళలు బొడ్రాయి చుట్టూ తిరుగుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఊరు, వాడ అంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలతో పాటు యువకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక చొరవతో ఉచిత క్యాన్సర్ పరీక్షల మెగా వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రముఖ బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రాయలసీమ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఒక్కో పరీక్షకు రూ. 15 వేల విలువైన పరీక్షలను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించారు. నంద్యాల జిల్లా ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరించిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు నంద్యాల ఎంపీ, లోక్సభ టీడీపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభ సభలో ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, ఇటీవల తాను విజయవాడలో ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసినప్పుడు నంద్యాల జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన బాలకృష్ణ, నంద్యాల ప్రజల కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని, అత్యాధునిక పరీక్షల యంత్రాలను ఏర్పాటు చేశారని వివరించారు. నెహ్రూ నగర్ మాజీ సర్పంచ్, టీడీపి సీనియర్ నాయకుడు, బాలకృష్ణ వీరాభిమాని అయిన కట్టుబడి శ్రీనివాస నాయుడు చొరవతోనే నెహ్రూ నగర్లో ఈ మొదటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు, అలాగే హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రి వైద్య బృందం, స్థానిక వైద్యులు, వాలంటీర్లు, టీడీపి శ్రేణులకు ఎంపీ శబరి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నందికొట్కూరు బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, బీఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యుడు కురువ రమేష్, టీడీపీ నాయకులు వెంకటేశ్వరశర్మ, బంగారు వెంకటేశ్వర్లు, గుణశేఖర్ రెడ్డి, రఘురామిరెడ్డి, పారుమంచాల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.3
- జానకి అమ్మ చివరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జానకి అమ్మ, సింగర్ సునీత ఇద్దరూ కలిసి పాటలు పాడుతూ, ఎంతో సరదాగా గడిపారు. వీరిద్దరికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.1
- అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని గంగవరం గ్రామంలో ఒక బావిలో చిక్కుకున్న భారీ రాజనాగును (కింగ్ కోబ్రా) అటవీ శాఖకు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ (RRR) బృందం విజయవంతంగా రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ను వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన "హనుమాన్" (HANUMAN) కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. గంగవరం గ్రామానికి చెందిన గ్రామస్తుడు శ్రీ రమేష్ తమ ఊరి బావిలో పెద్ద పాము పడి ఉండటాన్ని గమనించి వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించడంతో ఈ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే జీనబాడు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్, RRR బృంద నాయకుడు శ్రీ ఆర్. రాజబాబు ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ పి. శివకుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పి. సాయి ప్రణీత్, ప్రొటెక్షన్ వాచర్లు సత్యనారాయణ, అచ్చిబాబు పాల్గొన్నారు. అటవీ శాఖతో పాటు శ్రీ మూర్తి కంటిమహంతి నేతృత్వంలోని ఈజీడబ్ల్యూఎస్ (EGWS) స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృష్ణ, ప్రసాద్ సాంకేతిక సహకారం అందించారు. మొదట పొడవైన వెదురు కర్రకు హుక్ కట్టి పామును రంధ్రం నుండి బయటకు లాగి, ఆపై హ్యాండ్ హెల్డ్ హుక్, పొడవైన సరుగుడు కర్ర సహాయంతో బావి నుండి సురక్షితంగా పైకి తీశారు. ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తగా పామును పైప్-బ్యాగ్లోకి ప్రవేశపెట్టి భద్రపరిచారు. అనంతరం ఈ రాజనాగును జీనాబాడు బీట్ పరిధిలోని సంకరం రిజర్వ్ ఫారెస్ట్ (RL) లో అడవిలోకి వదిలిపెట్టారు. ఈ విజయవంతమైన ఆపరేషన్పై రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ ఆర్. రాజబాబు మాట్లాడుతూ, హనుమాన్ కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల రక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్తుడు శ్రీ రమేష్ చూపిన అప్రమత్తత, ఆర్ఆర్ఆర్ బృందం నైపుణ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారం వల్లే ఈ అరుదైన జీవి ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. ప్రజలు, అటవీ శాఖ, ఎన్జీవోలు కలిసి పనిచేస్తే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుందని ఈ సంఘటన నిరూపించింది.4
- నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని మారుతీనగర్ (12వ వార్డు)లో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైరవిహారం చేస్తున్నాయి. కుక్కల భయం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే తీవ్రంగా జంకుతున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే స్పందించి, కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు గట్టిగా కోరుతున్నారు.1
- హైదరాబాద్లో కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత బైఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడాన్ని డ్యాన్సర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికలకు ఫెడరేషన్ అనుమతి లేదని ఆరోపిస్తూ 10 మంది డ్యాన్సర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. డ్యాన్స్ అసోసియేషన్లో తలెత్తిన ఈ వివాదానికి ఎన్నికలు, సభ్యత్వాల అంశాలే ప్రధాన కారణమైనట్లు తెలుస్తోంది.1