సంతకవిటి మండలం లో జోరుగా ఇంటింటికి అభివృద్ధి ప్రచార కార్యక్రమం... సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో నిర్వహించిన ''ఇంటింటి కూటమి'' ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లే ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించిన టిడిపి రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన రెండేళ్ల పాలన నివేదిక కరపత్రాలను ప్రజలకు అందజేసి ప్రతి కుటుంబానికి చేరువైన సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొల్ల అప్పల నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలుగా అందిస్తున్న ముఖ్యమైన పథకాలు అయినా తల్లి కి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్లు, మెగా డీఎస్సీ, జల జీవన్ మిషన్, మీ భూమి మీ హక్కు, వంటి కార్యక్రమాలు ప్రతి కుటుంబ జీవితంలో సానుకుల మార్పులు తీసుకొస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దురదృష్ట నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రజా సంక్షేమం పారదర్శక పాలన అభివృద్దె ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కొండ్రు మురళి మోహన్ తో కలిసి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బె వర అచ్యుత రావు, ముగ్గు చంద్ర రావు, బొడ్డేపల్లి చిన్నా రావు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సంతకవిటి మండలం లో జోరుగా ఇంటింటికి అభివృద్ధి ప్రచార కార్యక్రమం... సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో నిర్వహించిన ''ఇంటింటి కూటమి'' ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లే ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించిన టిడిపి రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన రెండేళ్ల పాలన నివేదిక కరపత్రాలను ప్రజలకు అందజేసి ప్రతి కుటుంబానికి చేరువైన సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొల్ల అప్పల నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలుగా అందిస్తున్న ముఖ్యమైన పథకాలు అయినా తల్లి కి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్లు, మెగా డీఎస్సీ, జల జీవన్ మిషన్, మీ భూమి మీ హక్కు, వంటి కార్యక్రమాలు ప్రతి కుటుంబ జీవితంలో సానుకుల మార్పులు తీసుకొస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దురదృష్ట నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రజా సంక్షేమం పారదర్శక పాలన అభివృద్దె ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కొండ్రు మురళి మోహన్ తో కలిసి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బె వర అచ్యుత రావు, ముగ్గు చంద్ర రావు, బొడ్డేపల్లి చిన్నా రావు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్ రాజాం /సంతకవిటి, షురూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.1
- పాలకొండ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.1
- శ్రీకాకుళం చిన్మయ్ మిషన్ స్వామి పరాత్మనంద్ సరస్వతీ వారిచే బాల విహార్, ఉచితంగా భగవద్గీత, రామాయణం నేర్పిస్తున్న దృశ్యాలు2
- శ్రీకాకుళం జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు మూడు కేంద్రాలు : కలెక్టర్ ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.1
- నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.1
- పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్ఇన్స్పెక్టర్ జి. భాస్కర్రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రక్తదానం చేసిన సబ్ఇన్స్పెక్టర్ జి. భాస్కర్రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్క్రాస్ సూపర్వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- అన్నదానం మహాదానం అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు1
- ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తునివాడ గ్రామ సమీపంలో తప్పిన ప్రమాదం రేగిడి మండలం తునివాడ గ్రామ సమీపంలో తప్పిన పెను ప్రమాదం.అదుపుతప్పి పొలాల్లోకి దూసుకు పోయిన పాలకొండ తమ్మినాయుడు కళాశాలకు చెందిన బస్సు. బస్సులో ఉన్న ఏడు మంది విద్యార్థులు ఏడు మందిలో పల్లి మిధున 9వ తరగతి విద్యార్థినికి గాయాలు మిగతా పిల్లలుసురక్షితం బస్సు కండిషన్ సరిగా లేదని గతంలోని యాజమాన్యానికి చెప్పానన్న బస్సు డ్రైవర్.ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు.1