Shuru
Apke Nagar Ki App…
51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది* UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది *51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది* UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఇటీవల ఇద్దరూ కలిసుండగా మందులకు భర్త డబ్బివ్వకపోవడంతో ఆ భార్య కుమిలిపోయింది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని భార్యకు నెలకు రూ.5వేలు ఇవ్వాలని ఒప్పించి ఆ బంధాన్ని నిలబెట్టారు..
SIRIPATI ARUNKUMAR
51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది* UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది *51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది* UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఇటీవల ఇద్దరూ కలిసుండగా మందులకు భర్త డబ్బివ్వకపోవడంతో ఆ భార్య కుమిలిపోయింది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని భార్యకు నెలకు రూ.5వేలు ఇవ్వాలని ఒప్పించి ఆ బంధాన్ని నిలబెట్టారు..
More news from తెలంగాణ and nearby areas
- వీధి కుక్కల బెడద: అధికారుల టేబుల్పై సంచుల్లో కుక్కలు! అధికారులపై ఆగ్రహం మహారాష్ట్రలోని నిఫద్నగర్లో వీధి కుక్కల సమస్య తీవ్రం కావడంతో కాలనీ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. సమస్యపై స్పందించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంచుల్లో కుక్కలను తీసుకొచ్చి పంచాయతీ రాజ్ శాఖ అధికారి టేబుల్పై వేశారు. అంతేకాకుండా విడదీయరాని నిర్లక్ష్యానికి నిరసనగా ఆ అధికారి మెడలో నోట్ల దండ వేసేందుకు యత్నించడం స్థానికంగా సంచలనం రేపింది.1
- *తండాలకు గ్రామపంచాయతీ హోదా – కేసీఆర్కు కృతజ్ఞతగా పాలాభిషేకం* *“మా తండాలో మా పాలన – మా గూడెంలో మా పాలన”* తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల స్థానిక పాలనకు మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని నూతన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం గంటలకు చిల్పూర్ మండలంలో మాజీ AMC వైస్ చైర్మన్ మాలోతు రమేష్ నాయకు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గార్లగడ్డ తండా, లింగంపల్లి దేవోజీ తండా, తీగల తండా* గ్రామాల్లో పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా లంబాడీ మహిళలు కేసీఆర్ ని స్మరించుకుంటూ నృత్యాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, భూక్యా గోపాల్ నాయక్, లింగంపల్లి సర్పంచ్ భూక్యా సునీత లాలు, కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ రాజు రాధిక, రమేష్, రాజేందర్, వార్డు మెంబర్లు, లింగంపల్లి మాజీ అధ్యక్షులు రచ్చ రవి, ఎల్లయ్య, శంకర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ బాలరాజు, మాటూరి శ్రీను, కొండ కనకయ్య, లకావత్ బాగ్న, సంపత్, తిరుపతి, పతేపూర్ గ్రామ మాజీ అధ్యక్షులు ఉమ్లా, వెంకన్న, లింగన్న, మాజీ సర్పంచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ నాయక్, మాజీ తీగల తండా అధ్యక్షులు వెంకటేష్, వార్డు మెంబర్ రవి, యూత్ నాయకులు సుధాకర్, రాజు తదితరులు, మహిళలు పాల్గొన్నారు.1
- మోదీ జన్మదినం సందర్భంగా పాలడుగులో సేవా కార్యక్రమాలు పురాతన శివాలయాన్ని శుభ్రం చేసిన బీజేపీ నాయకులు – ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు మోత్కూర్,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మోత్కూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాలడుగు గ్రామంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పురాతన శివాలయ పరిసరాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, పరిశుభ్రతతో పాటు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించాలనే సందేశాన్ని చాటారు.అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, దేశానికి మరింతకాలం సేవ చేసే శక్తిని అందించాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవ, పరిశుభ్రత, ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తితో గ్రామాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.దేశ సేవను ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు సమాజ సేవకు నిరంతరం కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుదే మధుసూదన్ యాదవ్, బీజేపీ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ బూత్ అధ్యక్షులు ఆళ్ల శివప్రసాద్, ముక్కామల గణేష్, బీజేపీ నాయకులు బరిగల శేఖర్, కందికట్ల అజయ్, ఎడ్ల సునీల్, ముక్కాముల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.4
- రివెంజ్ హత్య...యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణహత్య జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26) గురువారం నిజామాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. కారులో వచ్చిన వ్యక్తులు హరిబాబుపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారైనట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. హరిబాబు భార్య వైష్ణవి ని సరిగ్గా ఆరు మాసాల క్రితం మార్చి 17న హత్యకు గురయ్యారు. వైష్ణవిని భర్తనే హత్య చేయడంతో ప్రతికారంగా వైష్ణవి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు సమాచారం. వైష్ణవి హత్య జరిగిన సమయంలో ఎప్పటికైనా వాన్ని వదలమని శపథం చేశారు. అన్నంత పని చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి హత్య కేసులో హరిబాబు ఆయన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్ పై విడుదల అయి నిజామాబాద్ లో ఉంటున్నాడు. హరిబాబు అక్కడ ఉంటున్నాడనే విషయం తెలుసుకొని వైష్ణవి కుటుంబ సభ్యులు కాపు కాసి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.2
- ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు, ఎస్ఐలు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాల మధ్య ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళా పోలీసుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తిభావంతో గణనాథుడిని సాగనంపారు.4
- నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగాలు చిరస్మరణీయం బచ్చన్నపేట కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగాలు చిరస్మరణీయం బచ్చన్నపేట కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు బచ్చన్నపేట: ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ మసూద్ మాట్లాడుతూ.. తెలంగాణ విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన, రజాకార్లు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా రైతులు, పేదలు, సామాన్య ప్రజలు చేసిన పోరాటాన్ని చరిత్ర ఎన్నటికీ మరచిపోదన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్ మొహియుద్దీన్, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, భీంరెడ్డి నరసింహారెడ్డి, రాజ్ బహదూర్ గౌర్, చన్నమనేని రాజేశ్వరరావు తదితరులు తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా చాకలి ఐలమ్మ తన సాగు భూమి, పంటను కాపాడుకోవడానికి విసునూరు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా నిలిచి ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారని, దొడ్డి కొమురయ్య 1946 జూలై 4న కడవెండిలో జరిగిన ఘటనలో ప్రాణత్యాగం చేయడం తెలంగాణ సాయుధ పోరాటానికి కీలక మలుపుగా నిలిచిందని తెలిపారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడానికి, ప్రజాస్వామ్య హక్కుల సాధనకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని మసూద్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన ప్రతి అమరవీరుడికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు2
- యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు1
- యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు1