Shuru
Apke Nagar Ki App…
ఝరాసంగం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ స్వదేశానికి వచ్చి గోదానం ఝరాసంగం మండలం మాచ్నూర్ కు చెందిన కొoక వైజయంతిమాల రమేష్ దoపతులు అమెరికా నించి స్వదేశానికి వచ్చి బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం లో గోదానం చేశారు వేద విద్యార్థులకు అన్నదానం భక్తులకు వస్త్రదానం నిర్వహించారు పీఠాధిపతులు దoపతులను సన్మానిoచారు శ్రావణ సోమవారం సందర్బంగా ఆశ్రమం లో బిల్వర్చన రుద్రాభిషేకo ప్రత్యేక అలoకరణ మహామంగళహారతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
Reporter MD khaleel
ఝరాసంగం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ స్వదేశానికి వచ్చి గోదానం ఝరాసంగం మండలం మాచ్నూర్ కు చెందిన కొoక వైజయంతిమాల రమేష్ దoపతులు అమెరికా నించి స్వదేశానికి వచ్చి బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం లో గోదానం చేశారు వేద విద్యార్థులకు అన్నదానం భక్తులకు వస్త్రదానం నిర్వహించారు పీఠాధిపతులు దoపతులను సన్మానిoచారు శ్రావణ సోమవారం సందర్బంగా ఆశ్రమం లో బిల్వర్చన రుద్రాభిషేకo ప్రత్యేక అలoకరణ మహామంగళహారతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
More news from తెలంగాణ and nearby areas
- పటాన్చెరు: 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పటాన్చెరు: 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఆగస్టు 29న అమీన్పూర్లో భారీ నిరసన సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సభకు 15 వేల మంది తరలిరానున్నట్లు చెప్పారు. అర్హత ఉన్న భూములను 22A నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు* *రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు* 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తూ, ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పెండింగ్లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరహార దీక్షకు సంఘీభావంగా కామారెడ్డి పట్టణ బీజేపీ కౌన్సిలర్ లు, నాయకులు బయల్దేరటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 'ఫీజుల బకాయి - బిజెపి లడాయి' పేరుతో తెలంగాణ బిజెపి నేత ఎన్. రామచందర్ రావు చేపట్టిన 2 రోజుల నిరాహార దీక్షకు యువత నుండి వెల్లువెత్తుతున్న మద్దతు వస్తుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఇకనైనా ఆపాలనీ, ఫీజుల బకాయిలను కాంగ్రెస్ సర్కార్ తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు కి మద్దతుగా *కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ కామారెడ్డి పట్టణ కౌన్సిలర్ లు, మరియు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలినట్లు తెలిపారు.1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- నేరేడ్మెట్–కాప్రా–కుషాయిగూడలో సాయంత్రం భారీ వర్షం వాహనదారులకు ఇబ్బందులు నేరేడ్మెట్, కాప్రా, కుషాయిగూడ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు కాలనీల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా రోడ్లు నీటితో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా కొంతమేర ట్రాఫిక్కు అంతరాయం కలిగినప్పటికీ, చల్లబడిన వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందారు.1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి *రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది* *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి – పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా - 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్ నిజామాబాద్, ఆగస్టు 25,2026: రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు. అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారం అయ్యిందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్ అన్నారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు. సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రసాయన ఎరువులు, ఇతర ఇన్పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు. అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్ అన్నారు. మార్కెట్ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్ అన్నారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. “అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్లో భారత్ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్ ఆకాంక్షించారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటు తో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పి. రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీ శ్రీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య లు పాల్గొన్నా3
- వరి నాట్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవసరమైన యూరియా అందుబాటులోకి రావడం లేదని చిన్నశంకరంపేట మండల రైతుల ఆవేదన వరి నాట్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవసరమైన యూరియా అందుబాటులోకి రావడం లేదని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువును సకాలంలో వినియోగించకపోతే పంట ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మార్కెట్కు చేరిన యూరియా కొద్దిసేపటికే పూర్తిగా అయిపోతుండటంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని రైతుల డిమాండ్కు అనుగుణంగా యూరియాను సమృద్ధిగా సరఫరా చేయాలని కోరారు.1
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కామారెడ్డి జిల్లా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి: అదనపు కలెక్టర్ విక్టర్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామం లో డీఎఫ్ఓ నీరజ్, డీఆర్డీఓ దామోదర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ముకుంద రెడ్డి, అధికారులు, గీత కార్మికులతో కలిసి అదనపు కలెక్టర్ విక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాఘవపూర్లో 1,200 ఈత మొక్కలను నాటారు. అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వన మహోత్సవం కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా రాఘవపూర్లో 1,200 ఈత మొక్కలు నాటినట్లు తెలిపారు. జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ రవి తేజ, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, పీడీ మెప్మా శ్రీధర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, గీత కార్మికులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- సిరికొండ మండల కేంద్రంలో చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో మంగళవారం చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.1