Shuru
Apke Nagar Ki App…
సదర్మట్ బ్యారేజ్ కి భారీగా వరద నీరు: రెండు గేట్లు తెరిచిన అధికారులు. నిర్మల్ జిల్లా లో గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మామడ మండలం సదర్మట్ బ్యారేజ్ కి ఎగువ నుండి 8500 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టుకు ఉన్న 55 గేట్ల నుండి 9వ, 10వ గేట్లను తెరిచి 9330 క్యూసెక్కులన్నిటిని కిందికి వదిలారు. ప్రాజెక్టుకు దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
G.S.Kumar
సదర్మట్ బ్యారేజ్ కి భారీగా వరద నీరు: రెండు గేట్లు తెరిచిన అధికారులు. నిర్మల్ జిల్లా లో గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మామడ మండలం సదర్మట్ బ్యారేజ్ కి ఎగువ నుండి 8500 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టుకు ఉన్న 55 గేట్ల నుండి 9వ, 10వ గేట్లను తెరిచి 9330 క్యూసెక్కులన్నిటిని కిందికి వదిలారు. ప్రాజెక్టుకు దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.. రెండు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తుంది. గురువారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు(9, 10) ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పశువు కాపరులు, చేపల వేటకు వెళ్లే జార్లర్లు సైతం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి రావద్దని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.1
- తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ రానున్న 12 గంటలు అత్యంత కీలకం1
- నిజామాబాద్ జిల్లా శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 4,051 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టులో 1,065 అడుగుల నీటిమట్టంతో 16 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,075 అడుగుల నీటిమట్టంతో 32 టీఎంసీల నీటి నిల్వ ఉంది1
- భారీ వర్షాలకు నీట మునిగిన సోయాబీన్ పంట.. రైతుకు తీవ్ర నష్టం గుడిహత్నూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు హుల్గుండే జనార్ధన్కు చెందిన 5 ఎకరాల సోయాబీన్ పంట పూర్తిగా నీట మునిగింది. పొలంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన నేపథ్యంలో వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో కూడా భారీ వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.1
- కడం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. గేట్లు ఎత్తి కిందకు నీటిని వదిలిన అధికారులు నిర్మల్ జిల్లా లో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటివరకు 94137 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 11 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు మొదలుతున్నారు. ఇంట్లో ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉందని అధికారులు తెలుపుతున్నారు.1
- *కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద నీరు 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు1
- నిజామాబాదు జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామం లో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెక్ డ్యామ్ నిండి నీరు పైనుండి ప్రవహిస్తుంది1
- ఖానాపూర్ తర్లపాడు రోడ్డుపై వరద నీరు వాహనదారులకు ఇబ్బందులు ఖానాపూర్ తర్లపాడ్ వెళ్లే దగ్గర రోడ్డుపై వరద నీరు చేరడంతో ప్రయాణికులు స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు అటు ఇటు వెళ్లే వాహనదారులు చూసి జాగ్రత్తగా వెళ్లాలని అక్కడి స్థానికులు సూచించారు1