Shuru
Apke Nagar Ki App…
తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ రానున్న 12 గంటలు అత్యంత కీలకం
MD. YOUSUF ALI KHAN
తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ రానున్న 12 గంటలు అత్యంత కీలకం
More news from తెలంగాణ and nearby areas
- భారీ వర్షాలతో కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమిషనర్ రాఘవేంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు."1
- రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో పౌర హక్కుల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహశీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా అంటరానితనం నిర్ములనకై ప్రజలందరు సోదరభావముతో కలిసి మెలిసి ఉండాలని అన్నారు.అంటరాని తనం గురించి అవగాహన కలిపించారు.ప్రతి ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని సూచించారు. చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టకూడదని సూచించారు.వర్షాల కారణంగా ఏవైనా సమస్యలు ఎదురావుతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈకార్యక్రమంలో, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,ఆర్ఐ శ్యామ్,వార్డు మెంబర్లు గుగ్గిళ్ల వెంకటేష్,పుదరి మహిపాల్,నాయకులు గడ్డం శ్రీనివాస్,దాసరి గంగరాజం,లింగంపెళ్లి నిఖిల్,కార్యదర్శి స్వామి, జిపిఓ సంతోష్,కరోబర్ రాజేశం,పాల్గొన్నారు....1
- నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు... ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు1
- జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డులో శ్రీనివాస టాకీస్ ఎదుట ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లలో కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించిందని ఓ వ్యక్తి ఆరోపించారు. బుధవారం రాత్రి పిల్లల కోసం ఇడ్లీ, వడ పార్సిల్ తీసుకెళ్లి ఇంట్లో విప్పి చూడగా వడలో బొద్దింక ఉన్నట్లు గుర్తించానన్నారు.1
- రగుడు కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధి సుందరీ కరణ పనుల మరియు బస్సు సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడి న మున్సిపల్ చైర్పర్సన్ రగుడు కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధి సుందరీ కరణ పనుల మరియు బస్ షెల్టర్ల ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమలలో భాగంగా నిర్వహించిన సభ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి సభ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , అడ్లరి లక్ష్మణ్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , శాసనసభ్యులు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ , రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ , ఎస్పీ మహేష్ గీతే , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సిరిసిల్ల అభివృద్ధిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తా అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దాదాపు 3 కోట్ల 22.50 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి పనులను ప్రారంభించగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సుందరంగా ఈ కలెక్టరేట్ చౌరస్తాను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల అంటే వస్త్ర పరిశ్రమ చేనేత రంగం ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిరిసిల్ల పట్టణంలో ప్రధాన చౌరస్తా అయినా కలెక్టరేట్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమకు చెందిన పద్మశాలి కులవృత్తులను తెలియజేసేలా వస్త్రం తయారీ యొక్క ప్రతి ఒక్క దశను వివరించేలా చక్కటి కళ ఆకృతులతో చౌరస్తాను తీర్చిదిద్దినందుకు ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఇంత చక్కటి విశాలమైన చౌరస్తా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిన శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావుకి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులకు, ప్రభుత్వ విప్ కి, శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్ కి ఎస్పీ కి ఇతర హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ , కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు ప్రజలు పాల్గొన్నారు.1
- రాత్రి 7.30 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ విభాగం తెలిపింది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేట, పశువుల మేపు, వ్యవసాయ పనుల కోసం ఎవరూ నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని కోరారు.1
- తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ రానున్న 12 గంటలు అత్యంత కీలకం1
- వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, తరలి వచ్చిన ప్రజలు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకల నుండి భారీగా వరదనీరు గోదావరి నదిలో చేరుతుంది. దీంతో గురువారం సాయంత్రం జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక, గూడెం ప్రాంతాలలో గోదావరి నది రెండు ఒడ్డులను తాకుతూ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది వైపు ప్రజలు, పశుకాపరులు వెళ్ళవద్దని జన్నారం దండేపల్లి మండలాల అధికారులు సూచించారు.1