logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు... ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు

6 hrs ago
user_Boss
Boss
భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
6 hrs ago

నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు... ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు

More news from తెలంగాణ and nearby areas
  • నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు... ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు
    1
    నిజామాబాద్ జిల్లా 

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి

ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు...

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు 

ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు 

గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు
    user_Boss
    Boss
    భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ రానున్న 12 గంటలు అత్యంత కీలకం
    1
    తెలంగాణలోకి డిప్రెషన్ ఎంట్రీ
రానున్న 12 గంటలు అత్యంత కీలకం
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో పౌర హక్కుల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహశీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా అంటరానితనం నిర్ములనకై ప్రజలందరు సోదరభావముతో కలిసి మెలిసి ఉండాలని అన్నారు.అంటరాని తనం గురించి అవగాహన కలిపించారు.ప్రతి ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని సూచించారు. చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టకూడదని సూచించారు.వర్షాల కారణంగా ఏవైనా సమస్యలు ఎదురావుతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈకార్యక్రమంలో, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,ఆర్ఐ శ్యామ్,వార్డు మెంబర్లు గుగ్గిళ్ల వెంకటేష్,పుదరి మహిపాల్,నాయకులు గడ్డం శ్రీనివాస్,దాసరి గంగరాజం,లింగంపెళ్లి నిఖిల్,కార్యదర్శి స్వామి, జిపిఓ సంతోష్,కరోబర్ రాజేశం,పాల్గొన్నారు....
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో పౌర హక్కుల దినోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహశీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో  పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా అంటరానితనం నిర్ములనకై ప్రజలందరు సోదరభావముతో కలిసి మెలిసి ఉండాలని అన్నారు.అంటరాని తనం గురించి అవగాహన కలిపించారు.ప్రతి ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ,
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని సూచించారు. చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టకూడదని సూచించారు.వర్షాల
కారణంగా ఏవైనా సమస్యలు ఎదురావుతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈకార్యక్రమంలో,
ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,ఆర్ఐ శ్యామ్,వార్డు మెంబర్లు గుగ్గిళ్ల వెంకటేష్,పుదరి మహిపాల్,నాయకులు గడ్డం శ్రీనివాస్,దాసరి గంగరాజం,లింగంపెళ్లి నిఖిల్,కార్యదర్శి స్వామి,
జిపిఓ సంతోష్,కరోబర్ రాజేశం,పాల్గొన్నారు....
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • నిజామాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. అప్రమత్తంగా మున్సిపల్ యంత్రాంగం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం కొంత అస్తవ్యస్తంగా మారినప్పటికీ, ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నిలిచే వర్షపు నీటిని మున్సిపల్ సిబ్బంది వెంటవెంటనే క్లియర్ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.
    1
    నిజామాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. అప్రమత్తంగా మున్సిపల్ యంత్రాంగం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం కొంత అస్తవ్యస్తంగా మారినప్పటికీ, ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నిలిచే వర్షపు నీటిని మున్సిపల్ సిబ్బంది వెంటవెంటనే క్లియర్ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి గత రెండు దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (నోడల్ అధికారి)కి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
    1
    కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన  జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి
కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన  జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి
అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి గత రెండు దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు.
చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (నోడల్ అధికారి)కి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • సదర్మట్ బ్యారేజ్ కి భారీగా వరద నీరు: రెండు గేట్లు తెరిచిన అధికారులు. నిర్మల్ జిల్లా లో గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మామడ మండలం సదర్మట్ బ్యారేజ్ కి ఎగువ నుండి 8500 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టుకు ఉన్న 55 గేట్ల నుండి 9వ, 10వ గేట్లను తెరిచి 9330 క్యూసెక్కులన్నిటిని కిందికి వదిలారు. ప్రాజెక్టుకు దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
    2
    సదర్మట్ బ్యారేజ్ కి భారీగా వరద నీరు: రెండు గేట్లు తెరిచిన అధికారులు.
నిర్మల్ జిల్లా లో గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 
మామడ మండలం సదర్మట్ బ్యారేజ్ కి ఎగువ నుండి 8500 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టుకు ఉన్న 55 గేట్ల నుండి  9వ, 10వ గేట్లను తెరిచి 9330 క్యూసెక్కులన్నిటిని కిందికి వదిలారు. ప్రాజెక్టుకు 
దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
    user_G.S.Kumar
    G.S.Kumar
    Nirmal U, Telangana•
    1 hr ago
  • *శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయ నూతన చైర్మన్‌గా కొట్టె శేఖర్ ప్రమాణ స్వీకారం* నిర్మల్ పట్టణంలోని శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయ నూతన చైర్మన్‌గా ఎన్నికైన కొట్టె శేఖర్ గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు నూతన చైర్మన్ కొట్టె శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఆలయ పరిపాలన పారదర్శకంగా కొనసాగుతూ, ప్రతి భక్తునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. ఇక్కడి ఆలయ అభివృద్ధికి సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేశారని, ఆయన సహకారాన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్లాలని నూతనంగా నియమితులైన శేఖర్ కు శ్రీహరి రావు ఈ సందర్భంగా సూచించారు. కాగా చైర్మన్ తో పాటు ఆలయ డైరెక్టర్లుగా ఉప్పుల నందు, నర్సయ్య లు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    *శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయ నూతన చైర్మన్‌గా కొట్టె శేఖర్ ప్రమాణ స్వీకారం*
నిర్మల్ పట్టణంలోని శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయ నూతన చైర్మన్‌గా ఎన్నికైన కొట్టె శేఖర్ గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు నూతన చైర్మన్ కొట్టె శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఆలయ పరిపాలన పారదర్శకంగా కొనసాగుతూ, ప్రతి భక్తునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. ఇక్కడి ఆలయ అభివృద్ధికి సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేశారని, ఆయన సహకారాన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్లాలని నూతనంగా నియమితులైన శేఖర్ కు శ్రీహరి రావు ఈ సందర్భంగా సూచించారు. కాగా చైర్మన్ తో పాటు ఆలయ డైరెక్టర్లుగా ఉప్పుల నందు, నర్సయ్య లు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_SIDDU.ASR
    SIDDU.ASR
    నిర్మల్, తెలంగాణ•
    2 hrs ago
  • నిజామాబాద్ జిల్లా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 4,051 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టులో 1,065 అడుగుల నీటిమట్టంతో 16 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,075 అడుగుల నీటిమట్టంతో 32 టీఎంసీల నీటి నిల్వ ఉంది
    1
    నిజామాబాద్ జిల్లా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 4,051 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టులో 1,065 అడుగుల నీటిమట్టంతో 16 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,075 అడుగుల నీటిమట్టంతో 32 టీఎంసీల నీటి నిల్వ ఉంది
    user_Boss
    Boss
    భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.