బస్తీల్లో నకిలీ వైద్యుల దందా.. ఆరుగురు అరెస్ట్..అర్హతలు లేకుండానే వైద్యుల అవతారం అర్హతలు లేకుండానే వైద్యులుగా చలామణి అవుతూ అమాయక ప్రజలకు వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, రామ్గోపాల్పేట్, చిలకలగూడ, ఓయూ సిటీ, దోమలగూడ పోలీసులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరీ నగర్కు చెందిన ఇద్దరు నకిలీ వైద్యులు ఉన్నారు. *బీఏ, ఇంటర్ చదివి వైద్యం.. ఏళ్లుగా ప్రజలకు చికిత్స..* మాణికేశ్వరీ నగర్లో సరోజినీ పాలీక్లినిక్ నిర్వహిస్తున్న చింతలూరి రమేష్ కేవలం బీఏ చదివి గత మూడేళ్లుగా జనరల్, ఫ్యామిలీ ఫిజీషియన్గా వైద్యం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదే ప్రాంతంలో సూర్య క్లినిక్ నిర్వహిస్తున్న శివరాత్రి లింగయ్య బీఏ చదువు మధ్యలోనే నిలిపివేసి, గతంలో పలు ఆసుపత్రుల్లో కాంపౌండర్గా పనిచేసిన అనుభవంతో సుమారు 15 ఏళ్లుగా వైద్యం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇద్దరికీ చెల్లుబాటు అయ్యే వైద్య అర్హతలు లేవని పోలీసులు తెలిపారు. *సెలైన్లు, ఇంజెక్షన్లతో చికిత్స.. భారీగా మందులు స్వాధీనం..* నకిలీ వైద్యులు రోగులకు సెలైన్లు, గ్లూకోజ్, ఇంజెక్షన్లు, ప్రిస్క్రిప్షన్ మందులు అందిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. దాడుల్లో మొత్తం ఆరుగురు నిందితుల నుంచి 277 ఇంజెక్షన్లు, 933 మాత్రలు, 12 గ్లూకోజ్ బాటిళ్లు, 70 సిరంజీలు, 16 ఆయింట్మెంట్లు, 57 సిరప్లు, 5 స్టెతస్కోప్లు, 5 బీపీ యంత్రాలు, 5 పల్స్ ఆక్సీమీటర్లు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడి వద్ద నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్, ఇతర నకిలీ విద్యార్హత పత్రాలు కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అనధికార వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు. వైద్య అర్హతలు లేకుండా చికిత్స అందించే వ్యక్తుల గురించి సమీప పోలీస్స్టేషన్ లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
బస్తీల్లో నకిలీ వైద్యుల దందా.. ఆరుగురు అరెస్ట్..అర్హతలు లేకుండానే వైద్యుల అవతారం అర్హతలు లేకుండానే వైద్యులుగా చలామణి అవుతూ అమాయక ప్రజలకు వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, రామ్గోపాల్పేట్, చిలకలగూడ, ఓయూ సిటీ, దోమలగూడ పోలీసులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరీ నగర్కు చెందిన ఇద్దరు నకిలీ వైద్యులు ఉన్నారు. *బీఏ, ఇంటర్ చదివి వైద్యం.. ఏళ్లుగా ప్రజలకు చికిత్స..* మాణికేశ్వరీ నగర్లో సరోజినీ పాలీక్లినిక్ నిర్వహిస్తున్న చింతలూరి రమేష్ కేవలం బీఏ చదివి గత మూడేళ్లుగా జనరల్, ఫ్యామిలీ ఫిజీషియన్గా వైద్యం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదే ప్రాంతంలో సూర్య క్లినిక్ నిర్వహిస్తున్న శివరాత్రి లింగయ్య బీఏ చదువు మధ్యలోనే నిలిపివేసి, గతంలో పలు ఆసుపత్రుల్లో కాంపౌండర్గా పనిచేసిన అనుభవంతో సుమారు 15 ఏళ్లుగా వైద్యం చేస్తున్నట్లు
వెల్లడించారు. ఇద్దరికీ చెల్లుబాటు అయ్యే వైద్య అర్హతలు లేవని పోలీసులు తెలిపారు. *సెలైన్లు, ఇంజెక్షన్లతో చికిత్స.. భారీగా మందులు స్వాధీనం..* నకిలీ వైద్యులు రోగులకు సెలైన్లు, గ్లూకోజ్, ఇంజెక్షన్లు, ప్రిస్క్రిప్షన్ మందులు అందిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. దాడుల్లో మొత్తం ఆరుగురు నిందితుల నుంచి 277 ఇంజెక్షన్లు, 933 మాత్రలు, 12 గ్లూకోజ్ బాటిళ్లు, 70 సిరంజీలు, 16 ఆయింట్మెంట్లు, 57 సిరప్లు, 5 స్టెతస్కోప్లు, 5 బీపీ యంత్రాలు, 5 పల్స్ ఆక్సీమీటర్లు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడి వద్ద నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్, ఇతర నకిలీ విద్యార్హత పత్రాలు కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అనధికార వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు. వైద్య అర్హతలు లేకుండా చికిత్స అందించే వ్యక్తుల గురించి సమీప పోలీస్స్టేషన్ లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
- నేరేడ్మెట్–కాప్రా–కుషాయిగూడలో సాయంత్రం భారీ వర్షం వాహనదారులకు ఇబ్బందులు నేరేడ్మెట్, కాప్రా, కుషాయిగూడ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వర్షం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు కాలనీల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా రోడ్లు నీటితో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా కొంతమేర ట్రాఫిక్కు అంతరాయం కలిగినప్పటికీ, చల్లబడిన వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందారు.1
- రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులు రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాస్కర్ తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగకు రెండు రోజుల ముందుగానే, బుధవారం నుంచి అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని ఆర్ఎం స్పష్టం చేశారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా1
- ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని తెలిసి.. రైతుల పరుగులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా చేరిందన్న సమాచారంతో రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల కోసం ఎదురుచూశారు. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు కీలక సమయంలో ఎరువు కోసం ఇలా రోజుల తరబడి తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. తమ అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.1
- అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్లతో సమావేశం నిర్వహించ1
- భువనగిరి: ఫీజు బకాయిలపై బీజేపీ పార్టీ నాయకుల నిరసన.... విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుతో భువనగిరిలో నాయకులు నిరసన చేపట్టారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్తోపాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.1
- మేడ్చల్లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1