*ఎన్నికైన మహిళా సర్పంచ్ పై కొందరు బెదిరింపులు జాతీయ మహిళా కమిషన్ ను పిర్యాదు చేయనున్న గజ్య నాయక్ తాండ సర్పంచ్ రావుల వినోద కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యనాయక తాండ గ్రామంలో ఎన్నికైన మహిళ సర్పంచ్ రావుల వినోద పై బెదిరింపులు, అవమానకర అసభ్యకరమైన మాటల ప్రవర్తన జరిగిందన్న ఆరోపణలు విలేకరుల సమావేశంలో శుక్రవారం తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయంకు జిల్లా ఆఫీసర్ డిఎల్పిఓ శ్రీనివాస్ ఎంపీడీవో , ఎంపీ ఓ అధికారుల మధ్య విచారణ జరుగుతుండగా 8వ వార్డు సభ్యులు తోకల కిషన్ తనపై దురుసుగా, అసభ్యమైన పదజాలము బూతులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రవర్తించారని తనకు మరో మిగతా 2,4,5,6,7,9,10,ల వార్డు సభ్యులు కూడా వత్తాసు పలకారని సర్పంచ్ రావుల వినోద ఆరోపించారు. ఈ ఘటనతో తన వ్యక్తిగత గౌరవం దెబ్బతిందని, ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా విధులు నిర్వర్తించడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని , లేనిపోని ఆరోపణలు చేశారని ఆమె తెలిపారు. ఈ విషయమై కామారెడ్డి జిల్లా ఎస్పీ కి లిఖిత పూర్వక ఫిర్యాదు సమర్పిస్తానని తెలిపారు. తనను ఓర్వలేక ఇలా కక్ష సాధింపు చర్యలతో మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా తనకు రాజ్యాంగ పరిరక్షణలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ ను ఆశ్రయిస్తానట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు నమోదు కాగా, సంబంధిత అధికారుల నుండి నివేదికలు కోరే అవకాశముందని సమాచారం. జిల్లా అధికారుల ఉండగా అలా దురుసుగా ప్రవర్తించడం అసభ్య పదజాలం ఉపయోగించడం పట్ల గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరుగుతుందన్నారు.స్థానిక ప్రజల్లో ఇలాంటి అవినీతి లేకుండా పాలన సాగిస్తేన్ , ఏదో అవినీతి జరిగినట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. మహిళలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాలలో సర్పంచ్ నుండి చట్టసభల వరకు మహిళలకు పెద్దపీట వేస్తుంటే, కాంగ్రెస్ పార్టీలోని కొందరు, టిఆర్ఎస్ వారితో జతకట్టి అయోమయం,ఆందోళన , మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పందించి పారదర్శక విచారణ చేపట్టాలని గ్రామ ప్రజలకు నిజాలు వెల్లడించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించే విధంగా గ్రామ ప్రజలకు తమ వంతు కృషి ఉంటుందని ఆమె అన్నారు. ఇలాంటి భార్గవి పోయేకాలం లేకుండా స్వచ్ఛమైన గ్రామ పాలన అందించేందుకు కృషి చేస్తుంటే, ఎలాంటి అవినీతి లేకున్న , ఈరోజు జరిగినట్లు కొందరు సృష్టిస్తున్నారని అన్నారు. మహిళా సర్పంచ్ అని దుర్భాషలవడం సరికాదు అన్నాడు. బూర్గుసలాడినటువంటి వారిపై సర్పంచ్ రావుల వినోద జాతీయ మహిళా కమిషన్ కు , ఉప సర్పంచ్ లకావత్ బిక్షపతి ఎస్టీ కమిషన్ కు బాధ్యులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
*ఎన్నికైన మహిళా సర్పంచ్ పై కొందరు బెదిరింపులు జాతీయ మహిళా కమిషన్ ను పిర్యాదు చేయనున్న గజ్య నాయక్ తాండ సర్పంచ్ రావుల వినోద కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యనాయక తాండ గ్రామంలో ఎన్నికైన మహిళ సర్పంచ్ రావుల వినోద పై బెదిరింపులు, అవమానకర అసభ్యకరమైన మాటల ప్రవర్తన జరిగిందన్న ఆరోపణలు విలేకరుల సమావేశంలో శుక్రవారం తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయంకు జిల్లా ఆఫీసర్ డిఎల్పిఓ శ్రీనివాస్ ఎంపీడీవో , ఎంపీ ఓ అధికారుల మధ్య విచారణ జరుగుతుండగా 8వ వార్డు సభ్యులు తోకల కిషన్ తనపై దురుసుగా, అసభ్యమైన పదజాలము బూతులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రవర్తించారని తనకు మరో మిగతా 2,4,5,6,7,9,10,ల వార్డు సభ్యులు కూడా వత్తాసు పలకారని సర్పంచ్ రావుల వినోద ఆరోపించారు. ఈ ఘటనతో తన వ్యక్తిగత గౌరవం దెబ్బతిందని, ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా విధులు నిర్వర్తించడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని , లేనిపోని ఆరోపణలు చేశారని ఆమె తెలిపారు. ఈ విషయమై కామారెడ్డి జిల్లా ఎస్పీ కి లిఖిత పూర్వక ఫిర్యాదు సమర్పిస్తానని తెలిపారు. తనను ఓర్వలేక ఇలా కక్ష సాధింపు చర్యలతో మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా తనకు రాజ్యాంగ పరిరక్షణలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ ను ఆశ్రయిస్తానట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు నమోదు కాగా, సంబంధిత అధికారుల నుండి నివేదికలు కోరే అవకాశముందని సమాచారం. జిల్లా అధికారుల ఉండగా అలా దురుసుగా ప్రవర్తించడం అసభ్య పదజాలం ఉపయోగించడం పట్ల గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరుగుతుందన్నారు.స్థానిక ప్రజల్లో ఇలాంటి అవినీతి లేకుండా పాలన సాగిస్తేన్ , ఏదో అవినీతి జరిగినట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. మహిళలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాలలో సర్పంచ్ నుండి చట్టసభల వరకు మహిళలకు పెద్దపీట వేస్తుంటే, కాంగ్రెస్ పార్టీలోని కొందరు, టిఆర్ఎస్ వారితో జతకట్టి అయోమయం,ఆందోళన , మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పందించి పారదర్శక విచారణ చేపట్టాలని గ్రామ ప్రజలకు నిజాలు వెల్లడించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించే విధంగా గ్రామ ప్రజలకు తమ వంతు కృషి ఉంటుందని ఆమె అన్నారు. ఇలాంటి భార్గవి పోయేకాలం లేకుండా స్వచ్ఛమైన గ్రామ పాలన అందించేందుకు కృషి చేస్తుంటే, ఎలాంటి అవినీతి లేకున్న , ఈరోజు జరిగినట్లు కొందరు సృష్టిస్తున్నారని అన్నారు. మహిళా సర్పంచ్ అని దుర్భాషలవడం సరికాదు అన్నాడు. బూర్గుసలాడినటువంటి వారిపై సర్పంచ్ రావుల వినోద జాతీయ మహిళా కమిషన్ కు , ఉప సర్పంచ్ లకావత్ బిక్షపతి ఎస్టీ కమిషన్ కు బాధ్యులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
- దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి* ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని తండాలు గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు1
- సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం, క్రమేసి పెరుగుతున్న నీటి మట్టం ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 74950 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091. అడుగులు,80 టీఎంసీలు ప్రస్తుతం 1068.8అడుగులు, 21.369టీఎంసీలు1
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన శ్రావణ్కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్కుమార్ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- ఆసుపత్రిలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ.. రోగులతో నేరుగా ముచ్చట తూప్రాన్ 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఆర్డీఓ బావయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగితో మానవీయంగా వ్యవహరించి వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యులు, సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.1
- ఆర్మూర్లో SIR అవగాహనా సదస్సు - 100% ఓటర్ల ఎన్రోల్మెంట్ పూర్తి ఆర్మూర్లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహనా సదస్సు నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, తెలంగాణ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఓటర్ల ఎన్రోల్మెంట్ 100% పూర్తి చేశామని, 25,800 డబుల్ ఓట్లను తొలగించామని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఎల్ఏలు, సూపర్వైజర్లకు ధన్యవాదాలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుక కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశ వేణు, మండల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.1
- korutla pattanam lo thrishakthimatha devalayam lo varahi navarathrulu varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam4
- ఎర్రపహాడ్ గ్రామంలో ఇంటి ముందున్న గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి* తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో తవ్విన పిల్లర్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలు: తల్లి పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో, చిన్నారి ఆమెకు తెలియకుండా వెనుకనే బయటకు వచ్చింది. ఈ క్రమంలో సమీపంలోనే ఉన్న పిల్లర్ గుంతలో పడిపోయింది. కొంతసేపటికి పాప కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్ను పరిశీలించారు. పాప తల్లి వెనకాలే వచ్చి గుంతలో పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో వెంటనే గుంత నుంచి చిన్నారిని బయటకు తీశారు. కానీ, అప్పటికే పాప మృతి చెందింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసిపాప కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.1