కీర్తిశేషులు బాలశంకర్ చి. వరుణ్ రాజ్ కు ఘనంగా నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు యువత జిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ చిరు తనయుడు 20 సంవత్సరాలు అకాల మరణం అనంతరం వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన నెల మాసిక పెద్దకర్మ ఏర్పాటు కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ గౌరవ పాయల శంకర్ మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ వారి దంపతులు శ్రీమతి బండారి అనూష సతీష్ డిసిసి మాజీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సుహాసిన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్ జిల్లా అధ్యక్షులు పరమేశ్వర గిమ్మ సంతోష్ యూనిస్ అర్బానీ సాజిద్ ఖాన్ వరుణ్ రాజ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరుణ్ రాజు మరణం వారి కుటుంబానికి తీరనిలోటని విషాద సమయంలో సభ్యులకు మనోధైర్యాన్ని కలగాలని వరుణ్ రాజ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో కుల సంఘాలు యువజన సంఘాలు, ఉద్యమకారులు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు కాలనీవాసులు అల్లూరి భూమన్న నిమ్మల ప్రశాంత్ ప్రజ్ఞకుమార్ సోగాల సుదర్శన్ రామచంద్ర మహాత్మా ఊరే గణేష్ నక్కరామదాసు షకీల్ నారాయణ యాదవ్ డాక్టర్ వీరాంజనేయులు నరేందర్ ఇజ్జగిరి నవీన్ సవిన్ రెడ్డి తదితరులు పాల్గొని వరుణ్ రాజ్ ఘనంగా నివాళులర్పించారు.... మీ బాల శంకర్ కృష్ణ🙏
కీర్తిశేషులు బాలశంకర్ చి. వరుణ్ రాజ్ కు ఘనంగా నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు యువత జిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ చిరు తనయుడు 20 సంవత్సరాలు అకాల మరణం అనంతరం వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన నెల మాసిక పెద్దకర్మ ఏర్పాటు కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ గౌరవ పాయల శంకర్ మాజీ
మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ వారి దంపతులు శ్రీమతి బండారి అనూష సతీష్ డిసిసి మాజీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సుహాసిన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్ జిల్లా అధ్యక్షులు పరమేశ్వర
గిమ్మ సంతోష్ యూనిస్ అర్బానీ సాజిద్ ఖాన్ వరుణ్ రాజ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరుణ్ రాజు మరణం వారి కుటుంబానికి తీరనిలోటని విషాద సమయంలో సభ్యులకు మనోధైర్యాన్ని కలగాలని వరుణ్ రాజ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో కుల సంఘాలు యువజన సంఘాలు, ఉద్యమకారులు
రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు కాలనీవాసులు అల్లూరి భూమన్న నిమ్మల ప్రశాంత్ ప్రజ్ఞకుమార్ సోగాల సుదర్శన్ రామచంద్ర మహాత్మా ఊరే గణేష్ నక్కరామదాసు షకీల్ నారాయణ యాదవ్ డాక్టర్ వీరాంజనేయులు నరేందర్ ఇజ్జగిరి నవీన్ సవిన్ రెడ్డి తదితరులు పాల్గొని వరుణ్ రాజ్ ఘనంగా నివాళులర్పించారు.... మీ బాల శంకర్ కృష్ణ🙏
- *ఎయిర్పోర్ట్ భూసేకరణపై రైతులకు జోగు రామన్న భరోసా* ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల రైతులు, గ్రామస్తుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలపై స్పష్టత కల్పించేందుకు మాజీ మంత్రి జోగు రామన్న చొరవ తీసుకున్నారు. మంగళవారం గ్రామస్తులు, రైతులు మాజీ మంత్రి జోగు రామన్నను కలిసి తమ సమస్యలను వివరించగా, ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి గారితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, భూముల ధరలు, గ్రామాలపై ప్రభావం తదితర అంశాలపై రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సందేహాలను జిల్లా కలెక్టర్ దృష్టికి జోగు రామన్న తీసుకెళ్లారు. పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని అందించి, రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా భూములకు తక్కువ ధర వస్తుందంటూ ప్రకటనలు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడిందన్నారు. రైతులు, గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని సూచించారు. భూముల ధరల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ సమక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలు, రైతులతో సమీక్షలు నిర్వహించి, గ్రామసభలు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక సర్వేలు నిర్వహించిన అనంతరం భూసేకరణ, పరిహారం ధరల నిర్ణయ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రైతులు, గ్రామస్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరుతున్నామని, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని జోగు రామన్న భరోసా ఇచ్చారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ అధైర్యపడవద్దని, వారి వెంట బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రే, కడదరపు అశోక్, రావుల సోమన్న, రమేష్, ఇస్తారి, జీవన్, బండి సాగర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు,2
- pocharam, bhaskar, raddy,,strike (dharna)against murder1
- CCI పరిశ్రమను పునరుద్ధరించి స్థానికులకు ఉపాధి కల్పించాలి ఆదిలాబాద్ లోని CCI పరిశ్రమను పునరుద్ధరించాలని CCI సాధన కమిటీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు జండాపూర్ గ్రామస్తులు మంగళవారం సంఘీభావం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపు పరిశ్రమను తెరిపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.1
- పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.1
- దౌడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం మనిషి భవిష్యత్తుకు ఆధారం మొక్కలేనని, వాటిని కాపాడుకోవాలని లక్షెట్టిపేట అటవీశాఖ డిఆర్ఓ సునీత అన్నారు. మంగళవారం మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ అల్తాఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.1
- పర్యావరణ పరిరక్షణ బాధ్యత భావి తరాలదే కంపా సీసీఎఫ్ క్షితిజ సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన "వనమహోత్సవం" కార్యక్రమంలో కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పాల్గొన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించి గొప్ప స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎఫ్డీపీటీ శాంతారాం ఐ.ఎఫ్.ఎస్, ఎఫ్డివో భార్గవ్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్, డా. అప్పయ్య ఏసీఎఫ్, వేణుబాబు ఏసీఎఫ్, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిర్పూర్(టి) సర్పంచ్ నాగమణి నానయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు4
- బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.4
- varni mtagde pally v lo ex sarpanch Death under suspicious1