Shuru
Apke Nagar Ki App…
తుని గొల్ల అప్పారావు సెంటర్లలో వేంచేసి యున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి వారికి ఈ రోజు రాత్రి 408 కలసాతో పంచామృతములుతో అభిషేకం జరుగుతున్నదని ఆలయ కమిటీ వారు తెలియజేసారు. తుని కొత్తపేట రామాలయం నుండి మహిళామణులు 108 పంచామృత కళాసాలతో శోభాయాత్రగా బయలుదేరి గొల్ల అప్పారావు సెంటర్లో అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం చేయుట జరుగుతుందని నిర్వాహుకులు తెలియజేసారు.
Baddi Narayana Rao
తుని గొల్ల అప్పారావు సెంటర్లలో వేంచేసి యున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి వారికి ఈ రోజు రాత్రి 408 కలసాతో పంచామృతములుతో అభిషేకం జరుగుతున్నదని ఆలయ కమిటీ వారు తెలియజేసారు. తుని కొత్తపేట రామాలయం నుండి మహిళామణులు 108 పంచామృత కళాసాలతో శోభాయాత్రగా బయలుదేరి గొల్ల అప్పారావు సెంటర్లో అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం చేయుట జరుగుతుందని నిర్వాహుకులు తెలియజేసారు.
More news from Andhra Pradesh and nearby areas
- విద్యార్ధులతో కలిసి నేలపైనే కూర్చొని భోజనం చేయడం ద్వారా తన నిరాడంబరతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చాటుకున్నారు. వారితో మమేకమై ఉత్సాహాన్ని నింపారు.జామి మండలం లొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా మమేకమై, వారి చదువుల పురోగతి గురించి ఆరా తీశారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. కష్టపడే వారికి విజయం తప్పక సిద్ధిస్తుందని అన్నారు. బాగా చదువుకోవడం ద్వారానే జీవితంలో గొప్ప అభివృద్ధిని సాధించగలరని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రి, స్వయంగా విద్యార్థులకు వడ్డన చేశారు. తన హోదాను పక్కనపెట్టి, సామాన్యుడిలా విద్యార్థులతో కలిసి నేలపైనే కూర్చుని భోజనం చేయడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. భోజనం తర్వాత కాసేపు విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఒక మంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థులతో ఇంత నిరాడంబరంగా గడపడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.1
- Post by V Ramarao1
- శ్రీకాకుళం జిల్లా టెక్కెర నియోజకవర్గం దడియాల పేట గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ఆలయ వార్షికోత్సవ పూజలు వేడుకగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్దశ్రద్ధలతో సామూహిక కుంకుమ అర్చనలు చేసి అమ్మవారిని మొక్కులు తీర్చ్చుకున్నారు.3
- గ్రామ సర్పంచులకు ఘన సత్కారం మంగళవారం హిరమండలం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవీ కాల ముగింపు సభకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సర్పంచుల పరిపాలన విధానం,గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి, వారి కృషిని ప్రశంసించారు.గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూలుగు మేనక, ఎంపీడీవో కాళీ ప్రసాద్, మండల అధ్యక్షులు దారపు డిల్లేశ్వరరావు ,ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతి రావు , జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు , హిరమండలం పట్టణ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్,ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచులు,సర్పంచు ప్రతినిధులు , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.4
- Post by Syyed taher1
- అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.1
- ,🙏😭1
- Post by V Ramarao1
- వల్లే వలస జిల్లా స్థాయి బలప్రదర్శన పోటీల విజేతలు. శ్రీరామనవమి నవమి సందర్భంగా సంతబొమ్మాలి మండలం వల్లే వలస శ్రీ చిన్మనయానంద స్వామి ఆలయము వద్ద బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్ పురుషులు,మహిళలు, తీతసంగిడి, ఈడుపుసంగిడి లో హోరా హోరీగా తలబడి క్రీడా వాతావరణాన్ని కల్పించారు పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు, పరిసర గ్రామ ప్రజలు తరలివచ్చి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వెళ్లే వలసశ్రీ చిన్మణానంద ఆశ్రమ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంత గ్రామ పెద్దలు సహాయ, సహకారాలతో నిర్వహించబడ్డాయి.పోటీలకు మాజీ జాతీయ వెయిట్ లిఫ్టర్ శ్రీ పిలక ధనుంజయ కుమార్ మాస్టర్ వ్యవహరించారు.. గెలుపొందిన విజేతలు వెయిట్ లిఫ్టింగ్(పురుషులు) లో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు (నిమ్మడ), ద్వితీయ బహుమతి బొంగు నాగరాజ్(నరసన్నపేట), తృతీయ బహుమతి భిన్నాల యోగేశ్వరరావు (శ్యామ్ పాలెం ) గెలుపొందారు. వెయిట్ లిఫ్టింగ్ (మహిళా ) విభాగం నుండి ప్రథమ బహుమతి దుబ హేమశ్రీ (బోరవెల్లి), ద్వితీయ బహుమతి శనగల ఝాన్సీ (టెక్కలి ), తృతీయ బహుమతి తాలాడ కావ్య( గార మండలం ) విజేతలు గా నిలిచారు. తీత సంగిడి లో ప్రథమ బహుమతి గేదెల సత్యనారాయణ(ఒప్పంగి), ద్వితీయ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) తృతీయ బహుమతి పాలిన రాజారావు (వానవిష్ణుపురం) గెలుపొందారు. ఈడుపు సంగిడిలో ప్రథమ బహుమతి ఆవాల గోవిందరావు(నిమ్మడ) ద్వితీయ బహుమతి ఆవాల వసంతరావు(చింతవానిపేట) తృతీయ బహుమతి గేదెల సత్యనారాయణ (ఒప్పంగి) కైవసం చేసుకున్నారు.వీరికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి అప్పన్న ,గూట్ల మల్లేశ్వరరావు సర్పంచ్ వడ్డీ వాడ, సూరిబాబు మాస్టర్, శ్రీ సచ్చిదానంద స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కటారి పురుషోత్తం కుటుంబ సభ్యులు, ప్రజలు, పరిసర ప్రాంతా గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో బహుమతి ప్రధానము జరిగింది.4