రూ.180 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్లో భారీ గోల్మాల్ కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్.. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానం.. - కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ - ఎక్సెస్ టెండర్ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు ఎలా అప్పగించారు? - GO 745 ఎవరి ప్రయోజనం కోసం? టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి - కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ టెండర్ వ్యవహారంలో రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. అండర్గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రభుత్వం GO 745 ద్వారా రూ.180 కోట్ల నిధులు కేటాయించిందని, ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్సెస్ టెండర్ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు అప్పగించడంలో ఆంతర్యమేంటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎక్సెస్ టెండర్ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని, నిబంధనల ప్రకారం తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 5 శాతం ఎక్సెస్ పేరుతో టెండర్ ప్రక్రియను మార్చి, తిరిగి అదే కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. "రూ.50 లక్షల పనులకు ఒక నిబంధన.. రూ.180 కోట్ల పనులకు మరో నిబంధనా?" అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రూ.50 లక్షల విలువైన పనుల్లో ఎక్సెస్ కారణంగా జిల్లా కలెక్టర్ టెండర్ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిబంధన భారీ విలువైన అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్కు ఎందుకు వర్తించదని నిలదీశారు. *"కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా?"* అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. "నేను చేస్తున్నది ఆరోపణ. దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టెండర్లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి" అని అన్నారు. *స్మార్ట్ సిటీ పనుల పేరుతో నిలువు దోపిడీ* కరీంనగర్ నగరంలో గతంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులపై కూడా సర్ధార్ రవీందర్ సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. నగరంలో సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భవిష్యత్తులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇంటర్నల్ కనెక్షన్లు, ప్రధాన డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ ఛాంబర్లు లేవని, ప్రధాన అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సరైన లింకులు లేవని ఆరోపించారు. "రూ.180 కోట్లతో కొత్తగా డ్రైనేజీ పనులు చేపడుతున్నప్పుడు.. గతంలో చేసిన పనుల పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించారు? ఎన్ని ప్రాంతాలకు కనెక్షన్లు ఇచ్చారు?" అని ప్రశ్నించారు. ప్రతి డివిజన్లో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మిస్తున్నారు, ఎన్ని ఇళ్లకు ఇంటర్నల్ కనెక్షన్లు ఇస్తున్నారు, ప్రధాన డ్రైనేజీ లైన్కు ఎక్కడెక్కడ లింకులు కలుపుతున్నారనే పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. *"గతంలో చేసిన పనులపై విచారణ లేకుండానే మళ్లీ అదే సంస్థకు పనులా?"* గతంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులను పూర్తి స్థాయిలో పరిశీలించకుండా మళ్లీ అదే కాంట్రాక్టర్కు భారీ విలువైన పనులు అప్పగించడం ఏమిటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. గత పనుల నాణ్యత, పూర్తి స్థాయి, డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై ముందుగా సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో ఇదే సంస్థపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అదే సంస్థకు మళ్లీ భారీ విలువైన టెండర్ ఎలా దక్కిందని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. *"కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు"* కరీంనగర్ నగరంలో జరుగుతున్న టెండర్ వ్యవహారాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కలిసి కరీంనగర్ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. "కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిజంగా కరీంనగర్ ప్రజలపై ప్రేమ, గౌరవం ఉంటే.. ఈ టెండర్ ప్రక్రియను వెంటనే పారదర్శకంగా నిర్వహించాలి. గతంలో వచ్చిన ఎక్సెస్ టెండర్ ఎందుకు రద్దయింది? ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్టర్కు ఎలా పనులు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. *STPల పరిస్థితి ఏంటి? రూ.180 కోట్లతో ఏం చేయబోతున్నారు?* నగరంలో ఇప్పటికే ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సీతారాంపూర్లో 5 MLD, కిసాన్నగర్లో 6 MLD, అలుగునూరులో 2 MLD సామర్థ్యం కలిగిన STPల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సదాశివపల్లి ప్రాంతంలో పనుల పరిస్థితి, లెవెల్స్, డ్రైనేజీ అనుసంధానంపై కూడా అధికారులు వివరాలు వెల్లడించాలని కోరారు. "ఇప్పటికే ఉన్న STPలు, డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ పనులను పూర్తిగా పరిశీలించకుండా రూ.180 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? గతంలో చేసిన పనుల పరిస్థితిని చూడకుండా కొత్త పనులు చేపట్టడం ఎందుకు?" అని ప్రశ్నించారు. *మేము ప్రజా సేవకులం ఊరుకోం ...* ప్రజలకు ఉపయోగపడేలా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కేవలం టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించడం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. "ఇది ప్రజల సౌకర్యం కోసం చేస్తున్న టెండర్ కావాలి.. కమిషన్ల కోసం చేసే టెండర్ కాకూడదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దు. కరీంనగర్ నగరాన్ని కాంట్రాక్టర్ల ప్రయోగశాలగా మార్చకండి" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రూ.180 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్పై సమగ్ర విచారణ జరిపించాలని, ఎక్సెస్ టెండర్ రద్దు నుంచి మళ్లీ టెండర్ కేటాయింపు వరకు జరిగిన ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని భావిస్తే ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. "కరీంనగర్ ప్రజల సొమ్ము కరీంనగర్ అభివృద్ధికే ఖర్చు కావాలి. కమిషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు" అని ఆయన అన్నారు.
రూ.180 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్లో భారీ గోల్మాల్ కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్.. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానం.. - కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ - ఎక్సెస్ టెండర్ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు ఎలా అప్పగించారు? - GO 745 ఎవరి ప్రయోజనం కోసం? టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి - కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ టెండర్ వ్యవహారంలో రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. అండర్గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రభుత్వం GO 745 ద్వారా రూ.180 కోట్ల నిధులు కేటాయించిందని, ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్సెస్ టెండర్ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు అప్పగించడంలో ఆంతర్యమేంటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎక్సెస్ టెండర్ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని, నిబంధనల ప్రకారం తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 5 శాతం ఎక్సెస్ పేరుతో టెండర్ ప్రక్రియను మార్చి, తిరిగి అదే కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. "రూ.50 లక్షల పనులకు ఒక నిబంధన.. రూ.180 కోట్ల పనులకు మరో నిబంధనా?" అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రూ.50 లక్షల విలువైన పనుల్లో ఎక్సెస్ కారణంగా జిల్లా కలెక్టర్ టెండర్ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిబంధన భారీ విలువైన అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్కు ఎందుకు వర్తించదని నిలదీశారు. *"కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా?"* అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. "నేను చేస్తున్నది ఆరోపణ. దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టెండర్లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి" అని అన్నారు. *స్మార్ట్ సిటీ పనుల పేరుతో నిలువు దోపిడీ* కరీంనగర్ నగరంలో గతంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులపై కూడా సర్ధార్ రవీందర్ సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. నగరంలో సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భవిష్యత్తులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇంటర్నల్ కనెక్షన్లు, ప్రధాన డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ ఛాంబర్లు లేవని, ప్రధాన అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సరైన లింకులు లేవని ఆరోపించారు. "రూ.180 కోట్లతో కొత్తగా డ్రైనేజీ పనులు చేపడుతున్నప్పుడు.. గతంలో చేసిన పనుల పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించారు? ఎన్ని ప్రాంతాలకు
కనెక్షన్లు ఇచ్చారు?" అని ప్రశ్నించారు. ప్రతి డివిజన్లో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మిస్తున్నారు, ఎన్ని ఇళ్లకు ఇంటర్నల్ కనెక్షన్లు ఇస్తున్నారు, ప్రధాన డ్రైనేజీ లైన్కు ఎక్కడెక్కడ లింకులు కలుపుతున్నారనే పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. *"గతంలో చేసిన పనులపై విచారణ లేకుండానే మళ్లీ అదే సంస్థకు పనులా?"* గతంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులను పూర్తి స్థాయిలో పరిశీలించకుండా మళ్లీ అదే కాంట్రాక్టర్కు భారీ విలువైన పనులు అప్పగించడం ఏమిటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. గత పనుల నాణ్యత, పూర్తి స్థాయి, డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై ముందుగా సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో ఇదే సంస్థపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అదే సంస్థకు మళ్లీ భారీ విలువైన టెండర్ ఎలా దక్కిందని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. *"కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు"* కరీంనగర్ నగరంలో జరుగుతున్న టెండర్ వ్యవహారాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కలిసి కరీంనగర్ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. "కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిజంగా కరీంనగర్ ప్రజలపై ప్రేమ, గౌరవం ఉంటే.. ఈ టెండర్ ప్రక్రియను వెంటనే పారదర్శకంగా నిర్వహించాలి. గతంలో వచ్చిన ఎక్సెస్ టెండర్ ఎందుకు రద్దయింది? ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్టర్కు ఎలా పనులు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. *STPల పరిస్థితి ఏంటి? రూ.180 కోట్లతో ఏం చేయబోతున్నారు?* నగరంలో ఇప్పటికే ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సీతారాంపూర్లో 5 MLD, కిసాన్నగర్లో 6 MLD, అలుగునూరులో 2 MLD సామర్థ్యం కలిగిన STPల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సదాశివపల్లి ప్రాంతంలో పనుల పరిస్థితి, లెవెల్స్, డ్రైనేజీ అనుసంధానంపై కూడా అధికారులు వివరాలు వెల్లడించాలని కోరారు. "ఇప్పటికే ఉన్న STPలు, డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ పనులను పూర్తిగా పరిశీలించకుండా రూ.180 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? గతంలో చేసిన పనుల పరిస్థితిని చూడకుండా కొత్త పనులు చేపట్టడం ఎందుకు?" అని ప్రశ్నించారు. *మేము ప్రజా సేవకులం ఊరుకోం ...* ప్రజలకు ఉపయోగపడేలా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కేవలం టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించడం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. "ఇది ప్రజల సౌకర్యం కోసం చేస్తున్న టెండర్ కావాలి.. కమిషన్ల కోసం చేసే టెండర్ కాకూడదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దు. కరీంనగర్ నగరాన్ని కాంట్రాక్టర్ల ప్రయోగశాలగా మార్చకండి" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రూ.180 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్పై సమగ్ర విచారణ జరిపించాలని, ఎక్సెస్ టెండర్ రద్దు నుంచి మళ్లీ టెండర్ కేటాయింపు వరకు జరిగిన ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని భావిస్తే ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. "కరీంనగర్ ప్రజల సొమ్ము కరీంనగర్ అభివృద్ధికే ఖర్చు కావాలి. కమిషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు" అని ఆయన అన్నారు.
- ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్లైన్ ఆర్టీసీ.. కరీంనగర్లో సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులకు శ్రీకారం..మొదటి దశలో మూడు రూట్లలో సేవలు త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం.. సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్లో సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు. మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్ను నెరవేర్చామని తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.వికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి బావ్ రావు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్పల్లి)తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ పట్టణంలో సిటీ బస్సులను ప్రారంబించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి కరీంనగర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట , ఓద్యారం, కొత్తపల్లి ,విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , ముఖ్య నేతలు ,అధికారులు పాల్గొన్నారు.2
- ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీగా వరద...15 గేట్లు ఎత్తిన అధికారులు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తారు. 1 లక్షా 55 వేల 625 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలో విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 356254 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 171650 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 19.341 టిఎంసిలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 1 లక్షా 85 వేల క్యూసెక్కులు ఉంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది.1
- గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ..... కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన ప్రధాన అడ్డంకులు తొలగాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వివిధ న్యాయపరమైన వివాదాల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని కొందరు భూ నిర్వాసితులు సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), వనశక్తి సంస్థల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతతో ప్రస్తుతం సుమారు 95 శాతం పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశముంది. దీంతో హుస్నాబాద్ ప్రాంతంలోని రైతులకు శాశ్వత సాగునీటి వసతి కలిగి వ్యవసాయాభివృద్ధికి ఊతమివ్వనుంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగానే ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమైందని వారు పేర్కొన్నారు.2
- వేములవాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బండ్ పార్క్ ప్రారంభం – బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన – బాసరకు నూతన బస్సు ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద నిర్మించిన బండ్ పార్క్ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వేములవాడ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవాడ–బాసర మధ్య నూతన ఆర్టీసీ బస్సును మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం.స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్న మంత్రులు వరుణ యాగంలో పాల్గొన్న మంత్రులు రాష్ట్రంలో వర్షాలు కురువాలని కోరుతూ మూడు రోజులపాటు కొనసాగనున్న వరుణ యాగం.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో పౌర హక్కుల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహశీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి హాజరయ్యారు.ఈ సందర్భంగా అంటరానితనం నిర్ములనకై ప్రజలందరు సోదరభావముతో కలిసి మెలిసి ఉండాలని అన్నారు.అంటరాని తనం గురించి అవగాహన కలిపించారు.ప్రతి ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని సూచించారు. చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టకూడదని సూచించారు.వర్షాల కారణంగా ఏవైనా సమస్యలు ఎదురావుతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈకార్యక్రమంలో, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,ఆర్ఐ శ్యామ్,వార్డు మెంబర్లు గుగ్గిళ్ల వెంకటేష్,పుదరి మహిపాల్,నాయకులు గడ్డం శ్రీనివాస్,దాసరి గంగరాజం,లింగంపెళ్లి నిఖిల్,కార్యదర్శి స్వామి, జిపిఓ సంతోష్,కరోబర్ రాజేశం,పాల్గొన్నారు....1
- రూ.180 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్లో భారీ గోల్మాల్ కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్.. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానం.. - కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ - ఎక్సెస్ టెండర్ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు ఎలా అప్పగించారు? - GO 745 ఎవరి ప్రయోజనం కోసం? టెండర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి - కాంగ్రెస్–బీజేపీ పెద్దల కుమ్మక్కుపై అనుమానాలు.. కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి: సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ టెండర్ వ్యవహారంలో రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. అండర్గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రభుత్వం GO 745 ద్వారా రూ.180 కోట్ల నిధులు కేటాయించిందని, ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్సెస్ టెండర్ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు అప్పగించడంలో ఆంతర్యమేంటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎక్సెస్ టెండర్ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని, నిబంధనల ప్రకారం తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 5 శాతం ఎక్సెస్ పేరుతో టెండర్ ప్రక్రియను మార్చి, తిరిగి అదే కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. "రూ.50 లక్షల పనులకు ఒక నిబంధన.. రూ.180 కోట్ల పనులకు మరో నిబంధనా?" అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రూ.50 లక్షల విలువైన పనుల్లో ఎక్సెస్ కారణంగా జిల్లా కలెక్టర్ టెండర్ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిబంధన భారీ విలువైన అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్కు ఎందుకు వర్తించదని నిలదీశారు. *"కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా?"* అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. "నేను చేస్తున్నది ఆరోపణ. దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టెండర్లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి" అని అన్నారు. *స్మార్ట్ సిటీ పనుల పేరుతో నిలువు దోపిడీ* కరీంనగర్ నగరంలో గతంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులపై కూడా సర్ధార్ రవీందర్ సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. నగరంలో సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భవిష్యత్తులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇంటర్నల్ కనెక్షన్లు, ప్రధాన డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ ఛాంబర్లు లేవని, ప్రధాన అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సరైన లింకులు లేవని ఆరోపించారు. "రూ.180 కోట్లతో కొత్తగా డ్రైనేజీ పనులు చేపడుతున్నప్పుడు.. గతంలో చేసిన పనుల పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించారు? ఎన్ని ప్రాంతాలకు కనెక్షన్లు ఇచ్చారు?" అని ప్రశ్నించారు. ప్రతి డివిజన్లో ఎన్ని ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మిస్తున్నారు, ఎన్ని ఇళ్లకు ఇంటర్నల్ కనెక్షన్లు ఇస్తున్నారు, ప్రధాన డ్రైనేజీ లైన్కు ఎక్కడెక్కడ లింకులు కలుపుతున్నారనే పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. *"గతంలో చేసిన పనులపై విచారణ లేకుండానే మళ్లీ అదే సంస్థకు పనులా?"* గతంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులను పూర్తి స్థాయిలో పరిశీలించకుండా మళ్లీ అదే కాంట్రాక్టర్కు భారీ విలువైన పనులు అప్పగించడం ఏమిటని సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. గత పనుల నాణ్యత, పూర్తి స్థాయి, డ్రైనేజీ లింకులు, ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, ప్రజలకు అందిన ప్రయోజనాలపై ముందుగా సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో ఇదే సంస్థపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అదే సంస్థకు మళ్లీ భారీ విలువైన టెండర్ ఎలా దక్కిందని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. *"కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు"* కరీంనగర్ నగరంలో జరుగుతున్న టెండర్ వ్యవహారాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కలిసి కరీంనగర్ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయనే అనుమానం కలుగుతోందని అన్నారు. "కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిజంగా కరీంనగర్ ప్రజలపై ప్రేమ, గౌరవం ఉంటే.. ఈ టెండర్ ప్రక్రియను వెంటనే పారదర్శకంగా నిర్వహించాలి. గతంలో వచ్చిన ఎక్సెస్ టెండర్ ఎందుకు రద్దయింది? ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్టర్కు ఎలా పనులు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. *STPల పరిస్థితి ఏంటి? రూ.180 కోట్లతో ఏం చేయబోతున్నారు?* నగరంలో ఇప్పటికే ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సీతారాంపూర్లో 5 MLD, కిసాన్నగర్లో 6 MLD, అలుగునూరులో 2 MLD సామర్థ్యం కలిగిన STPల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సదాశివపల్లి ప్రాంతంలో పనుల పరిస్థితి, లెవెల్స్, డ్రైనేజీ అనుసంధానంపై కూడా అధికారులు వివరాలు వెల్లడించాలని కోరారు. "ఇప్పటికే ఉన్న STPలు, డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ పనులను పూర్తిగా పరిశీలించకుండా రూ.180 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? గతంలో చేసిన పనుల పరిస్థితిని చూడకుండా కొత్త పనులు చేపట్టడం ఎందుకు?" అని ప్రశ్నించారు. *మేము ప్రజా సేవకులం ఊరుకోం ...* ప్రజలకు ఉపయోగపడేలా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కేవలం టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించడం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. "ఇది ప్రజల సౌకర్యం కోసం చేస్తున్న టెండర్ కావాలి.. కమిషన్ల కోసం చేసే టెండర్ కాకూడదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేయొద్దు. కరీంనగర్ నగరాన్ని కాంట్రాక్టర్ల ప్రయోగశాలగా మార్చకండి" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రూ.180 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెండర్పై సమగ్ర విచారణ జరిపించాలని, ఎక్సెస్ టెండర్ రద్దు నుంచి మళ్లీ టెండర్ కేటాయింపు వరకు జరిగిన ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని భావిస్తే ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సర్ధార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. "కరీంనగర్ ప్రజల సొమ్ము కరీంనగర్ అభివృద్ధికే ఖర్చు కావాలి. కమిషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు" అని ఆయన అన్నారు.2