logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రెండ్లగూడలో రైతులకు టోకెన్లు అందజేసిన వ్యవసాయ అధికారులు, జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లి గ్రామంలో ఉన్న రైతులకు స్థానిక ఏఈఓ త్రి సంధ్య ధాన్యం టోకెన్లను అందజేశారు. సోమవారం ఆమె రెండ్లగూడ గ్రామ శివారులో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం రైతులకు సూచనలు చేశారు. ధాన్యం అమ్ముకోవాలంటే తప్పనిసరిగా టోకెన్లు ఉండాలని తెలిపారు. అనంతరం రైతులకు ఆమె టోకెన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు .

1 hr ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
1 hr ago
967e363b-319c-40e0-a079-25fb33f1aaa2

రెండ్లగూడలో రైతులకు టోకెన్లు అందజేసిన వ్యవసాయ అధికారులు, జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లి గ్రామంలో ఉన్న రైతులకు స్థానిక ఏఈఓ త్రి సంధ్య ధాన్యం టోకెన్లను అందజేశారు. సోమవారం ఆమె రెండ్లగూడ గ్రామ శివారులో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం రైతులకు సూచనలు చేశారు. ధాన్యం అమ్ముకోవాలంటే తప్పనిసరిగా టోకెన్లు ఉండాలని తెలిపారు. అనంతరం రైతులకు ఆమె టోకెన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు .

More news from తెలంగాణ and nearby areas
  • కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    2
    కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ దీక్ష చేపట్టారు. వారు కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    1
    మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ దీక్ష చేపట్టారు. వారు కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • కొండగట్టు ​అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
    1
    కొండగట్టు ​అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
    user_Srinivas Nerella
    Srinivas Nerella
    Yoga instructor మల్యాల, జగిత్యాల, తెలంగాణ•
    18 min ago
  • ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
    1
    ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    14 hrs ago
  • కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్‌కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    1
    కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్‌కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని నిన్న రాత్రి డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన
    1
    మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన 

ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్
మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన 
ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్
మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని నిన్న రాత్రి  డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు 
తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • *ఘనంగా జనగణన-2027 'సెన్సస్ వాక్' : ప్రారంభించి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రికా ప్రకటన మే 11, 2026_ఆదిలాబాద్: వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న జనగణన-2027 ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సస్ వాక్/మారథాన్', అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ముగిసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 12,000 కుటుంబాలు తమ వివరాలను తామే నమోదు చేసుకున్నాయని వెల్లడించారు. నేటి నుండి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ అత్యంత కీలకమని, జిల్లాలోని 1,293 బ్లాకుల్లో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చే సిబ్బందికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా సమాచారం అందించాలని సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఇది కేవలం ప్రభుత్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు అడిగే 34 ప్రశ్నలకు యదార్థమైన సమాధానాలు చెప్పాలని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ SE-ID ని చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాతీయ యజ్ఞంలో ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అధికారులను ప్రజలను కోరారు. ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్. ఎస్.చిత్రు, రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, డివైఎస్ఓ శ్రీనివాస్, ఈడి మనోహర్, మెప్మా పిడి రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, ప్రజలు, ఉద్యోగులు, యువత, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    3
    *ఘనంగా జనగణన-2027  'సెన్సస్ వాక్' : ప్రారంభించి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా*

పత్రికా ప్రకటన
మే 11, 2026_ఆదిలాబాద్:
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న జనగణన-2027  ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సస్ వాక్/మారథాన్', అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ముగిసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 12,000 కుటుంబాలు తమ వివరాలను తామే నమోదు చేసుకున్నాయని వెల్లడించారు. నేటి నుండి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ అత్యంత కీలకమని, జిల్లాలోని 1,293 బ్లాకుల్లో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చే సిబ్బందికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా సమాచారం అందించాలని సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఇది కేవలం ప్రభుత్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు అడిగే  34 ప్రశ్నలకు యదార్థమైన సమాధానాలు చెప్పాలని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ SE-ID ని చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాతీయ యజ్ఞంలో ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అధికారులను ప్రజలను కోరారు.
ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్. ఎస్.చిత్రు, రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, డివైఎస్ఓ శ్రీనివాస్, ఈడి మనోహర్, మెప్మా పిడి రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, ప్రజలు, ఉద్యోగులు, యువత, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    4 hrs ago
  • మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
    1
    మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.