RIPOTER:-P. VEERANNA *మహాత్మ గాంధీ పేరు తొలగించి, ఉపాధి కూలీల కడుపు కొట్టాలని బిజెపి కుట్ర నూతన డిసిసి అధ్యక్షులు బి క్రాంతి నాయుడు* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించి ఉపాధి కూలీల కడుపు కొట్టాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు న్యాయవాది బి క్రాంతి నాయుడు అభిప్రాయపడ్డారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు సోమవారం ధర్నా చౌక్ నందు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు దీక్ష ప్రతిజ్ఞ నాయకుకందరితో చేయించారు, అనంతరం దీక్ష ప్రారంభించారు, దీక్ష ను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయుడు బోయ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రియతమ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో గత 20 సంవత్సరముల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నాటి యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజల జీవనోపాధి, వలసలు అరికట్టుట కొరకు అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుండి పనికి ఆహార పథకం పేరుతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారని కానీ నేటి బిజెపి ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో పథకాన్ని విబి జి రాంజీ అను పేరుతో మార్పు చేయడం జరిగిందని ఈ విధానంతో దేశ ప్రజలు ఏకంగా మహాత్మా గాంధీ గారిని మర్చిపోవాలనే ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందని కర్నూలు జిల్లాలోని ఏడు నియోజక వర్గాల్లో కరువు మండలాలలో 150 నుండి 200 పని దినాలు పెంచాలని అడుగుతుంటే కనీసం 100 పని దినాలు కూడా లేకుండా చేయాలని నేటి ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వర్షాలు పడక పంటలు పండగ పోతే కనీసం ఉపాధి హామీ పథకం ద్వారా కుటుంబాలను పోషించుకునే వారని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొత్త చట్టంలో కేంద్రం 60 శాతం రాష్ట్రాలు 40 శాతం ఆర్థిక భారాన్ని భరాయించాలని చట్టాన్ని తయారు చేశారని గతంలో రైతులను ఈ ప్రభుత్వము మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసిందని ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిజ్ఞ చేశామని ఈ పథకాన్ని యధావిధిగా కొనసాగించేంతవరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడుతామని ప్రజల్లోనికి తీసుకెళ్తామని గ్రామ గ్రామాన పంచాయతీ లెవెల్లో తీసుకొని వెళ్లి ఈ పథకాన్ని అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడుతుందని ఈ పోరాటంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారు మాతోపాటు నడుస్తారని నాయకుల మందరం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నామని ఫిబ్రవరి వరకు గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలను చైతన్యపరిచి కొత్త పథకాన్ని రద్దు చేసేంతవరకు పోరాడుతామని క్రాంతి నాయుడు గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి బర్త్ డే సందర్భంగా డిసిసి అధ్యక్షులు నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ధర్నా చౌక్ లో జరిగే నిరాహార దీక్షలో మహాత్మా గాంధీ గారి చిత్రపటమునకు పూలమాలలు వేసి డిసిసి అధ్యక్షులు క్రాంతి నాయుడు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సాయంకాలం ఐదు గంటలకు సిపిఎం నాయకులు వెంకటనారాయణ, శేఖర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, ఐఎన్టియుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ పీర్ ఖాద్రి బాషా, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్సి బజారన్న, ఓబీసీ సెల్ చైర్మన్ డివి సాంబశివుడు, మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బి మహేంద్ర నాయుడు, ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్ కాంగ్రెస్ నాయకులు, పోతుల శేఖర్, రాఘవేంద్ర రెడ్డి, షేక్ రియాజుద్దీన్, జాన్ సదానందం, షబ్బీర్ హుస్సేన్ మొదలగు వారు పాల్గొన్నారు.
RIPOTER:-P. VEERANNA *మహాత్మ గాంధీ పేరు తొలగించి, ఉపాధి కూలీల కడుపు కొట్టాలని బిజెపి కుట్ర నూతన డిసిసి అధ్యక్షులు బి క్రాంతి నాయుడు* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించి ఉపాధి కూలీల కడుపు కొట్టాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు న్యాయవాది బి క్రాంతి నాయుడు అభిప్రాయపడ్డారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు సోమవారం ధర్నా చౌక్ నందు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు దీక్ష ప్రతిజ్ఞ నాయకుకందరితో చేయించారు, అనంతరం దీక్ష ప్రారంభించారు, దీక్ష ను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయుడు బోయ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రియతమ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో గత 20 సంవత్సరముల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నాటి యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజల జీవనోపాధి, వలసలు అరికట్టుట కొరకు అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుండి పనికి ఆహార పథకం పేరుతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారని కానీ నేటి బిజెపి ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో పథకాన్ని విబి జి రాంజీ అను పేరుతో మార్పు చేయడం జరిగిందని ఈ విధానంతో దేశ ప్రజలు ఏకంగా మహాత్మా గాంధీ గారిని మర్చిపోవాలనే ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందని కర్నూలు జిల్లాలోని ఏడు నియోజక వర్గాల్లో కరువు మండలాలలో 150 నుండి 200 పని దినాలు పెంచాలని అడుగుతుంటే కనీసం 100 పని దినాలు కూడా లేకుండా చేయాలని నేటి ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వర్షాలు పడక పంటలు పండగ పోతే కనీసం ఉపాధి హామీ పథకం ద్వారా కుటుంబాలను పోషించుకునే వారని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొత్త చట్టంలో కేంద్రం 60 శాతం రాష్ట్రాలు 40 శాతం ఆర్థిక భారాన్ని భరాయించాలని చట్టాన్ని తయారు చేశారని గతంలో రైతులను ఈ ప్రభుత్వము మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసిందని ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిజ్ఞ చేశామని ఈ పథకాన్ని యధావిధిగా కొనసాగించేంతవరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడుతామని ప్రజల్లోనికి తీసుకెళ్తామని గ్రామ గ్రామాన పంచాయతీ లెవెల్లో తీసుకొని వెళ్లి ఈ పథకాన్ని అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడుతుందని ఈ పోరాటంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారు మాతోపాటు నడుస్తారని నాయకుల మందరం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నామని ఫిబ్రవరి వరకు గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలను చైతన్యపరిచి కొత్త పథకాన్ని రద్దు చేసేంతవరకు పోరాడుతామని క్రాంతి నాయుడు గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి బర్త్ డే సందర్భంగా డిసిసి అధ్యక్షులు నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ధర్నా చౌక్ లో జరిగే నిరాహార దీక్షలో మహాత్మా గాంధీ గారి చిత్రపటమునకు పూలమాలలు వేసి డిసిసి అధ్యక్షులు క్రాంతి నాయుడు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సాయంకాలం ఐదు గంటలకు సిపిఎం నాయకులు వెంకటనారాయణ, శేఖర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, ఐఎన్టియుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ పీర్ ఖాద్రి బాషా, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్సి బజారన్న, ఓబీసీ సెల్ చైర్మన్ డివి సాంబశివుడు, మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బి మహేంద్ర నాయుడు, ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్ కాంగ్రెస్ నాయకులు, పోతుల శేఖర్, రాఘవేంద్ర రెడ్డి, షేక్ రియాజుద్దీన్, జాన్ సదానందం, షబ్బీర్ హుస్సేన్ మొదలగు వారు పాల్గొన్నారు.
- ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదనీ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి అన్నారు. ప్రజావాణి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ పారితోష్ పంకజ్1
- MSR CULT లో వచ్చిన పాటను నా సొంత లిరిక్ ద్వారా రాసి రావణాసుర అనే చిత్రానికి ఈ పాట చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి🙏1
- *బడంగ్పేట్ సర్కిల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం* రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం సఫిల్గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.4
- గజ్వేల్లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ .. 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/ మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు4
- Post by Dama Chanti1
- గాండ్లపెంట జనవరి 19వ తేదీ రాష్ట్ర పండుగల నిర్వహిస్తున్న యోగివేమన జయంతి వేడుక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎమ్మెస్ పార్థసారథి పరిశీలించారు. వేమన ఆలయ పీఠాధిపతులు గ్రామ పెద్దలు కూటమి నాయకులతో ఆయన చర్చించారు. వేమన రాసిన పద్యాలు నేటి యువతకు ఎంతో ఉపయోగమన్నారు. జయంతి విజయవంతం చేయడానికి అందరూ వారి వారి బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు కేశవరెడ్డి, పాల్గొన్నారు.1
- ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ వదలపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1