Shuru
Apke Nagar Ki App…
మహిళా సంఘాలకు రూ.22.50 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు.... ములుగు జిల్లాలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా 265 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.22.50 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను మంత్రి దనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యమని, వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని మంత్రి తెలిపారు.
Karunya
మహిళా సంఘాలకు రూ.22.50 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు.... ములుగు జిల్లాలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా 265 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.22.50 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను మంత్రి దనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యమని, వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని మంత్రి తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క ములుగు జిల్లా, సెప్టెంబర్ 17 : ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కాలేదు. నిరంకుశ పాలనతోపాటు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడారు. ఎన్నో త్యాగాల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైంది. నాటి పోరాట యోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి నిజమైన నివాళి అని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ములుగు అభివృద్ధి: మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్ ములుగు జిల్లాలో మొదటి విడతలో 5,201 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, 4,979 మార్కింగ్ పూర్తి, 1,850 నిర్మాణాలు పూర్తి. రెండో విడతలో మరో 2 వేలు మంజూరు మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 2 కోట్ల 33 లక్షల 89 వేల 601 మంది మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత ప్రయాణం - రూ.172 కోట్ల 6 లక్షలు ఆదా ఘట్టమ్మ వద్ద పైలాన్ ప్రాజెక్ట్ ములుగు అభివృద్ధిలో కలికితురాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ, ఆర్డిఓ, డిఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.2
- ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు' పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని ఘట్టమ్మ సమీపంలో గల కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ స్వాగతం పలికారు. మంత్రి సీతక్క ముందుగా మహనీయులకు పూలమాలలు వేసి తెలంగాణ గీతం ఆలాపన అనంతరం పోలీసు గౌరవనీయులు స్వీకరించారు.జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతక్క ప్రసంగం అనంతరం 265 స్వయం సహాయక సంఘాలకు 22 కోట్ల 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. *ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...* తెలుగు ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము నూతన ములుగు జిల్లా కార్యాలయంలో ఘనంగా, సగర్వంగా మన జాతీయ జెండాను ఎగరవేసుకున్నామని,నిజాం పాలనలో విడిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఆనాడు మన ప్రథమ ప్రధాని నెహ్రూ గారి ఆదేశాల అనుసారం, ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి హోంశాఖ మంత్రిగా ఆనాడు తెలంగాణ భారతదేశంలో భాగమైందని,విముక్తి కోసం, విమోచనం కోసం, విలీనం కోసం అనేక పోరాటాలు, 'భూమి, భుక్తి, విముక్తి' అని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో పెద్ద ఎత్తున జరిగాయని, ఆ పోరాటంలో వేలాది మంది బిడ్డలు కులమత రహితంగా తమ ప్రాంత విముక్తి కోసం, విలీనం కోసం, విమోచనం కోసం పోరాటం చేసి, ఈ పీడన అంతం కావాలి, మనం కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని ఆరోజు పెద్ద ఎత్తున పోరాటం జరిగిందని,ఆ పోరాటాన్ని చూసినటువంటి ఆనాటి ప్రధాని నెహ్రూ గారు భారతదేశంలో తెలంగాణను విలీనం చేసి, నేటికి 78 సంవత్సరాలు పూర్తయి, 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రాంతం సాధించడం జరిగిందని,ఆ తర్వాత ఆంధ్ర-తెలంగాణ ఉద్యమాలు, వాటి పోరాటాల ఫలితంగా మళ్లీ సోనియమ్మ నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో తెలంగాణకు సంపూర్ణమైన ప్రాంతీయ సమస్యలను కూడా తొలగించి, ప్రత్యేక రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మంత్రి సీతక్క అన్నారు.1
- వచ్చే సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తాయి: తుమ్మల నాగేశ్వరరావు ములుగు జిల్లాలోని ఇంచెర్ల, భూపాలపల్లి జిల్లాలోని చైన్పాక ప్రాంతాల్లో ఆయిల్ పామ్ మిల్లుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నాటికి మిల్లులు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంట సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.1
- హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security1
- fabo laundry and dry cleaning pickup and delivery fre wash&steam iron per 120 kg wash&fold 100 s team iron 100 shirt 👔 100 rs T. shart👕100 rs paint👖100 rs saree 200 rs lahanga 350 rs jacket 200 rs kurta 100 rs suaes 450 rs blanket (single )350 (double )450 rs bleizer.. 300₹ sairwani. 300₹4
- -టేకులగూడెం లో ఘణ నాధుని దగ్గర అన్నదాన కార్యక్రమం. -దాతలు కుర్సం మధుసుదన్ వి.ఆర్.ఓ -అనసూర్య కుటుంబం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక గణనాథుడు కొలువు తిరడం జరిగింది.గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయకుడు ప్రతిష్టకోవడం ఎంతో సంతోషంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఇలా ప్రతిష్టించుకుని ఐదు రోజుల వరకు పూజలు నిర్వహిస్తామని ఎంతో భక్తి శ్రద్దలతో, భజనలతో నిర్వహిస్తామని ఆలయ కమిటీ వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఏటా ఒక కుటుంబం అన్నదానం చేస్తున్నారని వారు అన్నారు. ఈ సంవత్సరం గ్రామం లో నివసిస్తున్న వి.ఆ.ర్.ఓ గా పనిచేస్తున్న కుర్సం మధుసూదన్ రావు -అనసూర్య దంపతులు ఈ సారి అన్నదానం కార్యక్రమనికి సహకరించడం జరిగిందిని సహకరించిన వారి కుటుంబం వరసిద్ధి గణనాధుని ఆశీస్సులు వారి కుటుంబంపై మెండుగ ఉండాలని వేడుకున్నారు.ఎంతో సంతోషంగా నిర్వహించిన ఈ అన్నదాన సంతర్పణం లో గ్రామంలోని భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో పూజారి వాసం లక్ష్మణ్ రావు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ వాసం ఆనందరావు,గ్రామ సర్పంచ్ చిడెం బాలకృష్ణ, కోడె రవి,ఆలయ యూత్ కమిటీ వాసం పవన్,పూనెం సందీప్,వాసం శ్రీకాంత్, కుర్సం వంశీ, వాసం తరుణ్ కుమార్, కోడె రవి, పాయం సర్వేష్, అన్నదానం చేసిన దాతలు కుర్సం మధుసూదన్ రావు - అనసూర్య,గ్రామస్థులు పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.4
- గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* *కురవి:* గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో *మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో* భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి సత్యవతి రాథోడ్ గారు పాలాభిషేకం నిర్వహించారు* అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...* *“గిరిజనుల ఆరాధ్య దైవం మాజీ సీఎం కేసీఆర్ గారు* గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది *విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు* గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ గారి పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. *కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి *దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది* కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు1
- fabo dry cleaning rising sun school kotha wada warangal 1.dry cleaning 2 wash&steam iron for kg(120)only 3.wash&flod 4. 1ps shirt 👕 100/- 5. 1ps pant 👖 100/- 6.only iran 30/- callme : 8523042635 haryana maa adrass rising sun high school offizet1