దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు గారిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు..... ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకొని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న దళిత మహాసభ వ్యవస్థాపకులు, కవి,రచయిత డా. కత్తి పద్మారావు గారిని MRPS అధినేత ' పద్మశ్రీ ' మందకృష్ణ మాదిగ గారు కలిసి పరామర్శించారు... వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ కాలంగా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేసినటువంటి నాయకుడి ఆరోగ్యం ఇబ్బంది కావడం బాధాకరం.అయినప్పటికీ సంకల్పంతో పద్మారావు కోలుకోవడం సంతోషకరమని అన్నారు. త్వరగా కోలుకుని తిరిగి మళ్ళీ ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు గారు మంద కృష్ణ మాదిగ గారికి భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు కత్తి పద్మారావు గారి కుమారుడు కత్తి చేతన్ గారు మంద కృష్ణ మాదిగ గారికి స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా.గోవిందు నరేష్ మాదిగ, MEF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ బిక్షాలు మాదిగ, టివి నరసింహా మాదిగ, ఇటుక శ్రీకిషన్ మాదిగ , ప్రకాశం జిల్లా ఉద్యమ నాయకులు పాల్గొన్నారు
దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు గారిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు..... ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకొని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న దళిత మహాసభ వ్యవస్థాపకులు, కవి,రచయిత డా. కత్తి పద్మారావు గారిని MRPS అధినేత ' పద్మశ్రీ ' మందకృష్ణ మాదిగ గారు కలిసి పరామర్శించారు... వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ కాలంగా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేసినటువంటి నాయకుడి ఆరోగ్యం ఇబ్బంది కావడం బాధాకరం.అయినప్పటికీ సంకల్పంతో పద్మారావు కోలుకోవడం సంతోషకరమని అన్నారు. త్వరగా కోలుకుని తిరిగి మళ్ళీ ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు గారు మంద కృష్ణ మాదిగ గారికి భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు కత్తి పద్మారావు గారి కుమారుడు కత్తి చేతన్ గారు మంద కృష్ణ మాదిగ గారికి స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా.గోవిందు నరేష్ మాదిగ, MEF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ బిక్షాలు మాదిగ, టివి నరసింహా మాదిగ, ఇటుక శ్రీకిషన్ మాదిగ , ప్రకాశం జిల్లా ఉద్యమ నాయకులు పాల్గొన్నారు
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- Post by కొప్పుల విజయ బాబు10
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.1