రైతుల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 5563 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఆదివారం కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో సోమవారం జరగనున్న రైతు భరోసా నిధుల విడుదల బహిరంగ సభను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి భారత దేశంలో లక్షా 10 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర మని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిధులు, నీళ్లు, నియామకాల మీద ఏర్పడిన గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విధ్వసం నుండి వికాసం వైపు తరతరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి నివేదికల ఆధారంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇచ్చిన మాటలకు అనుగుణంగా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రెండు దఫాలుగా 12,000 వేల రూపాయలు రైతు భరోసా విడుదల చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తదుపరి 73 లక్షల మంది రైతులకు కోటి 15 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
రైతుల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 5563 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఆదివారం కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో సోమవారం జరగనున్న రైతు భరోసా నిధుల విడుదల బహిరంగ సభను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి భారత దేశంలో లక్షా 10 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర మని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిధులు, నీళ్లు, నియామకాల మీద ఏర్పడిన గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విధ్వసం నుండి వికాసం వైపు తరతరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి నివేదికల ఆధారంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇచ్చిన మాటలకు అనుగుణంగా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రెండు దఫాలుగా 12,000 వేల రూపాయలు రైతు భరోసా విడుదల చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తదుపరి 73 లక్షల మంది రైతులకు కోటి 15 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
- Post by Syyed taher1
- వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో కలిసి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- 🙏😭1
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- cm revanth reddy nasthurpally ki ravas daniki erpatlu2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగులు వర్షం కురిసింది. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు తాటి చెట్టు దగ్ధమైంది. ఉరుములు మెరుపులతో అకాల వర్షం, వడగళ్ల వాన ప్రజల్ని ఉక్కిరి బిక్కిరికి గురిచేసింది. జోరుగా కురిసిన వర్షం, పిడుగులతో ప్రజలు భయాందోళన చెందారు.1
- ఆరోగ్య ఆంధ్ర కోసం మనమందరం పనిచేద్దాం డాక్టర్ సమరం అమరావతి:భారతదేశంలో అంటే మిగతా దేశాలలో ఆరోగ్యం పై ఖర్చు ఎక్కువగా ఉందని భారత దేశంలో ఆరోగ్యం పై తక్కువ ఖర్చు ఉందని అందుకే ఇతర దేశాల వారు భారతదేశానికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని డాక్టర్ సమరం తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం డాక్టర్లకు మంచి సౌకర్యాలను కల్పిస్తే ఇంకా మీరు బాగా పని చేస్తారని ఆయన తెలియజేశారు1
- Post by Syyed taher1
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రసిద్ధ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. పనుల పురోగతి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.1