జువ్విగూడెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. వాటర్ ప్లాంట్, సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. నకిరేకల్ నియోజకవర్గo:- నార్కెట్పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్తో పాటు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. మొదటగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే వేముల వీరేశం గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో మెరుగైన రహదారులు, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జువ్విగూడెం గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జువ్విగూడెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. వాటర్ ప్లాంట్, సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. నకిరేకల్ నియోజకవర్గo:- నార్కెట్పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో
భాగంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్తో పాటు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. మొదటగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే వేముల వీరేశం గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి
గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో మెరుగైన రహదారులు, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జువ్విగూడెం గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.1
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
- మాజీ మంత్రి హరీష్రావు పర్యటనతో ఖానాపూర్లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్1
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.1