దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్షా సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్ జలసౌదలోని ఈఎన్ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)లతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకొని అవసరమైన నిధులు విడుదల చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవాదుల ఎత్తిపోతల పథకం లోని గండి రామారం ఎడమ కాలువ నిర్మాణానికి భూ సేకరణ పూర్తి అయినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదని తక్షణమే పనులు ప్రారంభించి ఆ ప్రాంత రైతులకు సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకొవాలని కోరారు. గండి రామారం ఎత్తిపోతల పథకంలో భాగంగా లిఫ్ట్ -1 లిఫ్ట్ -3 పనులను త్వరితగతిన పూర్తి చేసి రెండు పంటలకు సాగు నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి స్టేషన్ ఘణపూర్ రిజర్వాయర్ వరకు నిర్మించిన టన్నెల్ ను 15రోజులలో వినియోగంలోకి తీసుకువచ్చి స్టేషన్ ఘణపూర్ రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు సాగు నీరు అందించే విధంగా చూడాలన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబందించి ఫేస్- 1, ఫేస్ -2, ఫేస్ -3 లలోని 9మోటార్ల ద్వారా గోదావరి నీటిని లిఫ్ట్ చేసి ఇంజినీర్లు అందరూ సమన్వయంతో పని చేసి దేవాదుల కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు సాగు నీరు అందించే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే నెల్లూట్ల దగ్గర ఏశ్వంతపూర్ వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలోని పెండింగ్ పనులన్నింటిని వెంటవెంటనే పూర్తి అయ్యే విధంగా అధికారులకు, గుత్తేదార్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు సకాలంలో నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ సెక్రటరీ శ్రీధర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నీటి పారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్షా సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్ జలసౌదలోని ఈఎన్ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)లతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకొని అవసరమైన నిధులు విడుదల చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవాదుల ఎత్తిపోతల పథకం లోని గండి రామారం ఎడమ కాలువ నిర్మాణానికి భూ సేకరణ పూర్తి అయినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదని తక్షణమే పనులు ప్రారంభించి ఆ ప్రాంత రైతులకు సాగు నీరు
అందించే విధంగా చర్యలు తీసుకొవాలని కోరారు. గండి రామారం ఎత్తిపోతల పథకంలో భాగంగా లిఫ్ట్ -1 లిఫ్ట్ -3 పనులను త్వరితగతిన పూర్తి చేసి రెండు పంటలకు సాగు నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి స్టేషన్ ఘణపూర్ రిజర్వాయర్ వరకు నిర్మించిన టన్నెల్ ను 15రోజులలో వినియోగంలోకి తీసుకువచ్చి స్టేషన్ ఘణపూర్ రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు సాగు నీరు అందించే విధంగా చూడాలన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబందించి ఫేస్- 1, ఫేస్ -2, ఫేస్ -3 లలోని 9మోటార్ల ద్వారా గోదావరి నీటిని లిఫ్ట్ చేసి ఇంజినీర్లు అందరూ
సమన్వయంతో పని చేసి దేవాదుల కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు సాగు నీరు అందించే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే నెల్లూట్ల దగ్గర ఏశ్వంతపూర్ వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలోని పెండింగ్ పనులన్నింటిని వెంటవెంటనే పూర్తి అయ్యే విధంగా అధికారులకు, గుత్తేదార్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు సకాలంలో నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ సెక్రటరీ శ్రీధర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నీటి పారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.1
- నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా ఇవ్వని ఇవ్వకపోగా.. అన్నిటికీ మమ్మల్నే కారణంగా చూపి నర్సింగ్ సిబ్బందికి సూపరింటెండెంట్ మెమో జారీ చేస్తున్నారు అంటూ ఆవేదన ఆడ పిల్లలమైన తమపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కన్నీరు పెట్టుకున్న నర్సింగ్ సిబ్బంది1
- ఉనికి కోసమే బిజేపి ఫీజు లడాయి చేస్తుంది...బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది- మంత్రి పొన్నం ప్రభాకర్ ఫీజులు, స్కాలర్ షిప్ లు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంటే బిజెపి తన ఉనికిని చాటు కోవడానికి లడాయి పేరుతో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన ఏడో రోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట, పెరుకపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్ల పల్లి ఘనపూర్ గ్రామాల్లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వనమహోత్సవంలో మొక్కలు నాటారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనే అంశాలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్థులకు సూచించారు. మొక్క నాటడం సులభం కానీ, దానిని పెంచి పెద్ద చెట్టుగా మార్చడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు జీవితంలో కనీసం ఒక మొక్క నాటి, కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. నవంబర్ 14లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను మంత్రి సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి జీరో డెత్ లక్ష్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పల్లెపల్లెలో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం అధికారులు, ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ రెండు కలల ముందుకు తీసుకు వెళ్తుంటే బిజెపి తమ ఉనికిని చాటుకోవడానికి ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కలెక్టర్ హేమంత్ ములుగు జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు తెలిపారు, వన మహోత్సవం సందర్భంగా గట్టమ్మ దేవాలయం.సమీపంలోని పంచాయతీ రాజ్ పైలాన్ ఆవరణలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్.ఐటిడిఏ పివో. లెనిన్ టోప్పో డి ఎఫ్ ఓ. వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు1
- *భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో *భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.1
- కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన...రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపర్సులు ప్రదర్శించిన విద్యార్థులు... విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక విద్యారంగ సమస్యలపై కరీంనగర్ లో స్టూడెంట్స్ ఆందోళన ఉదృతం అవుతుంది. విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ పై బిజెపి లడాయి పేరుతో దీక్షలు చేపట్టగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నిరసన ఆందోళన కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి విద్యార్థులకు స్క్రూటిలు, లాఫ్ టాప్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపరుసులు, స్క్రూటీలు లాప్టాప్ ప్రదర్శిస్తు తెలంగాణ చౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో మంత్రుల ఇళ్ళతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి హెచ్చరించారు.2
- మేడ్చల్లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1