*భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో *భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
*భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో *భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
- భువనగిరి: ఫీజు బకాయిలపై బీజేపీ పార్టీ నాయకుల నిరసన.... విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుతో భువనగిరిలో నాయకులు నిరసన చేపట్టారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్తోపాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.1
- చాగల్లో ఘనంగా పోచమ్మ బోనాల పండుగ, గుడి చుట్టూ తిరిగిన ఎడ్ల బండ్లు జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీలోని చాగల్లో శ్రావణమాసంలో పోచమ్మ తల్లికి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా పోచమ్మ గుడి చుట్టూ ఎడ్ల బండ్లు తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, పిల్లలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో వాతావరణం మార్మోగింది. ఎడ్ల బండ్లతో జరిగిన ఊరేగింపు పండుగకు మరింత శోభను తీసుకొచ్చింది. గ్రామస్థులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. బోనాల సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ బోనాల పండుగతో చాగల్ లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ జరిగిన ఈ వేడుకలు స్థానికుల మనసులను ఆకట్టుకున్నాయి.1
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- ఉనికి కోసమే బిజేపి ఫీజు లడాయి చేస్తుంది...బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది- మంత్రి పొన్నం ప్రభాకర్ ఫీజులు, స్కాలర్ షిప్ లు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంటే బిజెపి తన ఉనికిని చాటు కోవడానికి లడాయి పేరుతో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన ఏడో రోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట, పెరుకపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్ల పల్లి ఘనపూర్ గ్రామాల్లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వనమహోత్సవంలో మొక్కలు నాటారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనే అంశాలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్థులకు సూచించారు. మొక్క నాటడం సులభం కానీ, దానిని పెంచి పెద్ద చెట్టుగా మార్చడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు జీవితంలో కనీసం ఒక మొక్క నాటి, కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. నవంబర్ 14లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను మంత్రి సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి జీరో డెత్ లక్ష్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పల్లెపల్లెలో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం అధికారులు, ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ రెండు కలల ముందుకు తీసుకు వెళ్తుంటే బిజెపి తమ ఉనికిని చాటుకోవడానికి ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు.1
- కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.1
- *భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో *భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.1
- భువనగిరి మండల కేంద్రములో యూత్ కాంగ్రెస్ నాయకుల ధర్నా.. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కాంగ్రెస్ అధినేత, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు భువనగిరి పట్టణంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రె జహంగీర్, ఆవేస్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన...రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపర్సులు ప్రదర్శించిన విద్యార్థులు... విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక విద్యారంగ సమస్యలపై కరీంనగర్ లో స్టూడెంట్స్ ఆందోళన ఉదృతం అవుతుంది. విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ పై బిజెపి లడాయి పేరుతో దీక్షలు చేపట్టగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నిరసన ఆందోళన కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి విద్యార్థులకు స్క్రూటిలు, లాఫ్ టాప్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపరుసులు, స్క్రూటీలు లాప్టాప్ ప్రదర్శిస్తు తెలంగాణ చౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో మంత్రుల ఇళ్ళతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి హెచ్చరించారు.2