Shuru
Apke Nagar Ki App…
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవిపై కాంగ్రెస్లో విభేదాలు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్కు దక్కకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ నిర్లక్ష్యమే పదవి చేజారడానికి కారణమని స్థానిక నాయకులు ఆరోపించారు. చైర్మన్ పదవి కోల్పోవడంతో మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పరిణామానికి నైతిక బాధ్యత వహిస్తూ సుగుణ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Krishna
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవిపై కాంగ్రెస్లో విభేదాలు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్కు దక్కకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ నిర్లక్ష్యమే పదవి చేజారడానికి కారణమని స్థానిక నాయకులు ఆరోపించారు. చైర్మన్ పదవి కోల్పోవడంతో మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పరిణామానికి నైతిక బాధ్యత వహిస్తూ సుగుణ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Bharath Newz1
- ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు మంచిర్యాల జిల్లా లోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం దేనికి సంకేతం? మీరు గెలిచింది ప్రజల కోసమా లేక ప్రతిపక్షాలను అణచివేయడానికా? క్యాతనపల్లి ఇంచార్జ్ గా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా, కాంగ్రెస్ తొత్తుల్లా మారిన పోలీసులు ఆమెను అడ్డుకోవడం, గొడవకు దిగడం తెలంగాణ సంస్కృతికే విరుద్ధం. బాల్క సుమన్ గారు మరియు కోవ లక్ష్మి గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోలీసులను ప్రయోగించడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం. మంత్రి వర్గానికి లోపల రెడ్ కార్పెట్.. గెలిచిన కౌన్సిలర్లకు బయట లాఠీలా? పోలీసులారా.. మీరు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాదు, ప్రభుత్వంలో! ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పోలీసులను అడ్డం పెట్టుకుని పాలిస్తున్న ఈ "కంచె ల" సర్కార్ను గద్దె దించే వరకు మా పోరాటం ఆగదు. రోడ్డుపై బైఠాయించిన మా నాయకులకు, కౌన్సిలర్లకు క్యాతనపల్లి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అన్నారు1
- కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1
- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- అస్తాం విజయ గర్జన ర్యాలీ ఆదిలాబాద్ మున్సిపల్ చెర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్బంగా డీసీసీ కార్యాలయం నుండి పట్టణం విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు మీద బీజేపీ కార్యకర్తల దాడి పారిపోయిన బీజేపీ అధ్యక్షుడు..! మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా 10 స్థానాలు దక్కినా చైర్మన్ పీఠం దక్కలేదని బీజేపీ కౌన్సిలర్ల ఆగ్రహం..! బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేసిన ఆ పార్టీ కౌన్సిలర్లు..! మెట్పల్లి చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్కు ఓటేసిన బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా..! బీజేపీ విప్ జారీ చేయకపోవడంతో చైర్మన్ పీఠం చేజారిందని కౌన్సిలర్ల ఆగ్రహం..!1