Shuru
Apke Nagar Ki App…
నల్గొండలో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం.. హాజరైన మేయర్ కలెక్టర్ *20/02/2026* *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేకల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు* *అనంతరం క్రీడల పతాకాన్ని ఎగరవేశారు* *ఈ సందర్భంగా క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు* *కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఖలీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు*
Journalist pk
నల్గొండలో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం.. హాజరైన మేయర్ కలెక్టర్ *20/02/2026* *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేకల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు* *అనంతరం క్రీడల పతాకాన్ని ఎగరవేశారు* *ఈ సందర్భంగా క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు* *కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఖలీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు*
More news from Telangana and nearby areas
- అరుణోదయ సాంస్కృతిక సమైక్య 9వ మహాసభ సందర్భంగా అర్వపల్లి లో అరుణోదయ కళాకారుల కళారూపాలతో ర్యాలీ ప్రారంభమైంది. సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మహాసభలను అర్వపల్లిలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు.2
- ఎల్బినగర్ లోని చెట్నీస్ హోటల్ లో ఇడ్లి స్టిమర్ ఒక్కసారిగా పేలుడు ... పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్స్ ... పేలుడు దాటికి హోటల్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు... గాయలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలింపు విషయాన్ని గొప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం ... ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బినగర్ పోలీసులు...4
- వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆకేరు వాగుపై రూ.65 లక్షల వ్యయంతో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చెక్ డ్యామ్ ద్వారా భూగర్భ జలమట్టం పెరిగి, వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 20 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గార్లను సన్మానించిన మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ మతీన్, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయిని యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, నక్క రాములు ఉన్నారు, వారితో పాటు మైనారిటీ సోదరులు పాల్గొన్నారు1
- రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై మహనీయులు, చరిత్రకారులు, పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకుల ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుటకొరకు, దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కోరకు డిమాండ్ చేసేందుకు ఈ ర్యాలీ అన్నారు.విగ్రహాల ఏర్పాటు వలన సేవాభావం, దేశభక్తి, స్ఫూర్తిదాయకం పెరుగుతాయి.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు రాకపోవడం వలన, ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఊరేగింపు చేపట్టారు.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తే సరే సరేసరి, లేకపోతే రామంతాపూర్ హబ్సిగూడ ప్రజానీకం ఏకతాటిపై ఉన్నట్లు బంధును కూడా చేపడతాం, ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తాం అన్నారు.1
- మల్కాజిగిరి, ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉప్పల్ పరిధిలోని సైనిక్పూరి, మల్కాజిగిరి ఆర్కే పురం, ఆల్వాల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలలో పాల్గొన్నారు.ముందుగా ఉప్పల్ సైనిక్పూరిలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ఆర్.కె. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, రజినీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ప్రసన్న, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మల్కాజిగిరి ఆర్కే పురంలో నిర్వహించిన ర్యాలీలో కూడా ఎంపీ పాల్గొని శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆదిత్య, గోపు రమణ రెడ్డి, ప్రసన్న, అంజలి, సాయి తదితరులు హాజరయ్యారు.ఆల్వాల్లో జరిగిన శివాజీ జయంతి ర్యాలీలో కూడా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యువత శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చ బొల్లారం డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, భర్తపూడి శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, అవినాష్, మల్లికార్జున్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన శివాజీ జయంతి ర్యాలీలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగాయి.4
- రైతు కష్టానికి ఫలితం దక్కలేదు. చెమటోడ్చి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఒక రైతు ఆవేదన చెందారు. టమాటా ధరలు పాతాళానికి పడిపోవడంతో, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం ఇష్టం లేక.. తన పంటను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మార్కెట్కు తీసుకెళ్తే రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవని గూడూర్ మండలం భూపతిపేట కు చెందిన రైతులు పోగుల కొండ సారయ్య, మోహన్,గుజ్జ సురేందర్ మూడు ఎకరాలలో టమాట పంట వేయగా మూడు లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను రోడ్డు పాలు చేయడం కంటే, తోటి ప్రజలకు పంచిపెడితే వారి ఆకలి తీరుతుందని భావించిన సదరు రైతులు.. దాదాపు 50 పెట్టెల నిండా టమాటాలను తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేశారు.1
- 20-02-2026 హైదరాబాద్ హైదరాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి అగ్రిషో -2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి , తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి , ఆదర్శ రైతులు తుమ్మల యుగేందర్ , పాశం రాం రెడ్డి , రైతుబడి రాజేందర్ , మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి , తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ " వ్యవసాయం అనే పేరులోనే సాయం అనేది ఉంది. రైతు అనే వ్యక్తి నలుగురికి అన్నం పెట్టాలనే తపనతో వ్యవసాయం చేస్తారు. తాను బ్రతకాలి , తనతో చుట్టూ ఉన్న వాళ్ళు బ్రతకాలి అనే మంచి మనసు రైతన్నకు ఉంటుంది . వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయి అనేది తప్పు . సరైయినా పద్దతిలో చేస్తే లాభాలు వస్తాయి. వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్ ఉంది. యువత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది . రైతుబడి రాజేందర్ రెడ్డి ఎంతో కాలంగా నాకు ఆత్మీయులు. ఆయన రైతుల కోసం నిరంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త విషయాలను ప్రచారం చేస్తున్నారు. నేను కూడా రైతుబడి ఛానల్ లో అగ్రికల్చర్ వీడియోలను చూస్తుంటాను .2