logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చిత్తూరు జిల్లా కుప్పం గోకార్లపల్లి బిట్ - 2 గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గుడిపల్లి మండలానికి చెందిన ఈ గ్రామంలో సర్వే నంబర్ 6/4, 6/5 లోని వ్యవసాయ భూమికి సంబంధించిన వాగు, వంక జమీందారు కాలం నుండి ఉన్నాయని గ్రామస్థులు మురుగేష్, సునీత, సురేశ్ లు తెలిపారు. రాజువ కాలువకు చెందిన సుమారు 90 సెంట్ల ప్రభుత్వ భూమిని శిగలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నేత సోమశేఖర్ కబ్జా చేశారని వారు ఆరోపించారు. సోమశేఖర్ రాత్రికి రాత్రే ఈ భూమిలో చెట్లు నాటి, ఎవరూ అటువైపు వెళ్లకుండా అడ్డుకుని తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జాపై కడ పిడి, ఆర్డీఓ, జన నాయకుడు పోర్టల్ మరియు గుడిపల్లి తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. అయితే, ఆ భూమిని సర్వే చేయాలని ఆర్డీఓ ట్రూ కాపీ ఇచ్చినా గుడిపల్లి తహసీల్దార్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తహసీల్దార్ చుట్టూ తిరిగినా, తనకు సంబంధం లేదని, గ్రామంలో మీరే చూసుకోమని చెప్పారని గ్రామస్థులు వివరించారు. గత వైసీపీ హయాం నుండి గుడిపల్లి తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సీతారం, వైసీపీకి చెందిన సోమశేఖర్ కు సహకరిస్తున్నారని వారు తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ భూమిని పరిరక్షించి, ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన వైసీపీకి చెందిన సోమశేఖర్ పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

3 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

చిత్తూరు జిల్లా కుప్పం గోకార్లపల్లి బిట్ - 2 గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గుడిపల్లి మండలానికి చెందిన ఈ గ్రామంలో సర్వే నంబర్ 6/4, 6/5 లోని వ్యవసాయ భూమికి సంబంధించిన వాగు, వంక జమీందారు కాలం నుండి ఉన్నాయని గ్రామస్థులు మురుగేష్, సునీత, సురేశ్ లు తెలిపారు. రాజువ కాలువకు చెందిన సుమారు 90 సెంట్ల ప్రభుత్వ భూమిని శిగలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నేత సోమశేఖర్ కబ్జా చేశారని వారు ఆరోపించారు. సోమశేఖర్ రాత్రికి రాత్రే ఈ భూమిలో చెట్లు నాటి, ఎవరూ అటువైపు వెళ్లకుండా అడ్డుకుని తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జాపై కడ పిడి,

ఆర్డీఓ, జన నాయకుడు పోర్టల్ మరియు గుడిపల్లి తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. అయితే, ఆ భూమిని సర్వే చేయాలని ఆర్డీఓ ట్రూ కాపీ ఇచ్చినా గుడిపల్లి తహసీల్దార్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తహసీల్దార్ చుట్టూ తిరిగినా, తనకు సంబంధం లేదని, గ్రామంలో మీరే చూసుకోమని చెప్పారని గ్రామస్థులు వివరించారు. గత వైసీపీ హయాం నుండి గుడిపల్లి తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సీతారం, వైసీపీకి చెందిన సోమశేఖర్ కు సహకరిస్తున్నారని వారు తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ భూమిని పరిరక్షించి, ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన వైసీపీకి చెందిన సోమశేఖర్ పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కుప్పం ప్రాంతాన్ని పరిశుభ్రమైన, పర్యావరణహిత నెట్ జీరో ప్రాంతంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు కీలక అడుగు వేసింది. కడ కార్యాలయ ప్రాంగణంలో కుప్పం రూరల్ మరియు గుడిపల్లి మండలాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపాక్టర్ వాహనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమళ్ల ప్రసాదరావు, కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మట్ (ఐఏఎస్), ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ శ్రీ పి.ఎస్. మునిరత్నం, PKM UDA ఛైర్మన్ డా. సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు రాజుతో పాటు కడ అడ్వైజరీ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మరియు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కుప్పం మున్సిపాలిటీ మరియు శాంతిపురం మండలంలో ఇప్పటికే కంపాక్టర్ వాహనాల ద్వారా ఘన వ్యర్థాల సేకరణ, రవాణా విజయవంతంగా అమలు అవుతుండగా, అదే నమూనాను ఇప్పుడు గుడిపల్లి మరియు కుప్పం రూరల్ మండలాలకు విస్తరించారు. ఈ కంపాక్టర్ వాహనాల ద్వారా గ్రామాల్లో సేకరించిన చెత్తను శాస్త్రీయ పద్ధతిలో వేరు చేసి, ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలిస్తారు. దీనివల్ల గ్రామాల్లో చెత్త పేరుకుపోవడం తగ్గడంతో పాటు పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం లేదా కాల్చడం వంటివి తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుంది. కుప్పం ప్రాంతాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నెట్ జీరో ప్రాంతంగా మార్చాలనే లక్ష్యంతో కడ ఆధ్వర్యంలో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ తగ్గింపు, హరిత కార్యక్రమాలు, ఈ-సైకిళ్ల ప్రోత్సాహం, పునరుత్పాదక శక్తి వినియోగం వంటి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కుప్పం ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు పర్యావరణహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ కంపాక్టర్ వాహనాలు గ్రామీణ పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మట్ (ఐఏఎస్) స్పష్టం చేశారు.
    3
    కుప్పం ప్రాంతాన్ని పరిశుభ్రమైన, పర్యావరణహిత నెట్ జీరో ప్రాంతంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు కీలక అడుగు వేసింది. కడ కార్యాలయ ప్రాంగణంలో కుప్పం రూరల్ మరియు గుడిపల్లి మండలాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపాక్టర్ వాహనాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమళ్ల ప్రసాదరావు, కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మట్ (ఐఏఎస్), ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ శ్రీ పి.ఎస్. మునిరత్నం, PKM UDA ఛైర్మన్ డా. సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు రాజుతో పాటు కడ అడ్వైజరీ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మరియు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కుప్పం మున్సిపాలిటీ మరియు శాంతిపురం మండలంలో ఇప్పటికే కంపాక్టర్ వాహనాల ద్వారా ఘన వ్యర్థాల సేకరణ, రవాణా విజయవంతంగా అమలు అవుతుండగా, అదే నమూనాను ఇప్పుడు గుడిపల్లి మరియు కుప్పం రూరల్ మండలాలకు విస్తరించారు.

ఈ కంపాక్టర్ వాహనాల ద్వారా గ్రామాల్లో సేకరించిన చెత్తను శాస్త్రీయ పద్ధతిలో వేరు చేసి, ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలిస్తారు. దీనివల్ల గ్రామాల్లో చెత్త పేరుకుపోవడం తగ్గడంతో పాటు పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం లేదా కాల్చడం వంటివి తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుంది. కుప్పం ప్రాంతాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నెట్ జీరో ప్రాంతంగా మార్చాలనే లక్ష్యంతో కడ ఆధ్వర్యంలో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ తగ్గింపు, హరిత కార్యక్రమాలు, ఈ-సైకిళ్ల ప్రోత్సాహం, పునరుత్పాదక శక్తి వినియోగం వంటి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

కుప్పం ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు పర్యావరణహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ కంపాక్టర్ వాహనాలు గ్రామీణ పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మట్ (ఐఏఎస్) స్పష్టం చేశారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • చిత్తూరు రైల్వేస్టేషన్‌లో ఒక ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేసిన ఘటనలో గుంతకల్లు రైల్వే డివిజన్‌లో కమర్షియల్ విభాగం RS-2/CTO హోదాలో పనిచేస్తున్న కె. జ్యోతిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, సమాచారం అందిన వెంటనే ఆమెపై చర్యలకు ఉపక్రమించారు. దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోలర్ జూన్ 14న ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు విధులు, వేతనం నుంచి ఆమె సస్పెన్షన్ కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
    1
    చిత్తూరు రైల్వేస్టేషన్‌లో ఒక ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేసిన ఘటనలో గుంతకల్లు రైల్వే డివిజన్‌లో కమర్షియల్ విభాగం RS-2/CTO హోదాలో పనిచేస్తున్న కె. జ్యోతిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, సమాచారం అందిన వెంటనే ఆమెపై చర్యలకు ఉపక్రమించారు. దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోలర్ జూన్ 14న ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు విధులు, వేతనం నుంచి ఆమె సస్పెన్షన్ కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    1 hr ago
  • రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబుతో సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని వైయస్ఆర్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ గారు విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌నలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా ఇంకా పూర్తిగా కోలుకోలేదని, మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరమని మార్గాని భరత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
    1
    రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబుతో సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని వైయస్ఆర్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ గారు విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌నలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా ఇంకా పూర్తిగా కోలుకోలేదని, మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరమని మార్గాని భరత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం ఆకులేడు గ్రామ శివారులో రాత్రి దొంగలు ఒక ఏటీఎంను పగులగొట్టి, అందులోని నగదును దోచుకున్నారు. ఆ తర్వాత వారు ఆ ఏటీఎంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాగా, ఇదే శింగనమల మండలంలో దుండగులు మరో ఏటీఎంను పూర్తిగా ఎత్తుకెళ్లారు.
    1
    అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం ఆకులేడు గ్రామ శివారులో రాత్రి దొంగలు ఒక ఏటీఎంను పగులగొట్టి, అందులోని నగదును దోచుకున్నారు. ఆ తర్వాత వారు ఆ ఏటీఎంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాగా, ఇదే శింగనమల మండలంలో దుండగులు మరో ఏటీఎంను పూర్తిగా ఎత్తుకెళ్లారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బద్వేలు పట్టణంలోని రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండపంలో జూన్ 16, మంగళవారం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వక్తలు తమ ప్రసంగాలలో గత రెండేళ్లలో ప్రజలకు ప్రభుత్వం కల్పించిన నమ్మకం, చేపట్టిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ ఫలాలను విస్తృతంగా వివరించారు. ఈ విజయోత్సవ సంబరాలకు మంచూరు సూర్యనారాయణ రెడ్డితో పాటు బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ, టీడీపీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతిబింబించేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయగా, సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ వాటిని పరిశీలించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రదర్శించిన ఈ స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆర్డీవో చంద్రమోహన్ ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలుగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రతీకగా ఈ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్, బి. కోడూరు మండలం టీడీపీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, బీజేపీ జిల్లా కార్యదర్శి కేవీ రమణ, ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వేణుగోపాల్, సీమాంక్ హాస్పిటల్ డైరెక్టర్ జహంగీర్ భాష, బద్వేలు నియోజకవర్గ నాయకులు చెరుకూరి రవికుమార్, పామూరి బాలిరెడ్డి, కర్నాటి వెంకట రెడ్డి, బాదిరెడ్డి వీరారెడ్డి, ఇమామ్ హుస్సేన్, కొంకుల రాంబాబు, మాచుపల్లి లక్ష్మి దేవి, చెరుకూరి చెండ్రాయుడు, ఓ. రమణారెడ్డి, జనసేన నాయకులు ఈశ్వర్ రెడ్డి, సింగం శెట్టి వెంకట సుబ్బయ్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విజయోత్సవ సభ బద్వేలులో విజయవంతంగా జరిగింది.
    2
    బద్వేలు పట్టణంలోని రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండపంలో జూన్ 16, మంగళవారం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వక్తలు తమ ప్రసంగాలలో గత రెండేళ్లలో ప్రజలకు ప్రభుత్వం కల్పించిన నమ్మకం, చేపట్టిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ ఫలాలను విస్తృతంగా వివరించారు.

ఈ విజయోత్సవ సంబరాలకు మంచూరు సూర్యనారాయణ రెడ్డితో పాటు బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ, టీడీపీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతిబింబించేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయగా, సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ వాటిని పరిశీలించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రదర్శించిన ఈ స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆర్డీవో చంద్రమోహన్ ప్రజాప్రతినిధులకు వివరించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలుగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రతీకగా ఈ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్, బి. కోడూరు మండలం టీడీపీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, బీజేపీ జిల్లా కార్యదర్శి కేవీ రమణ, ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వేణుగోపాల్, సీమాంక్ హాస్పిటల్ డైరెక్టర్ జహంగీర్ భాష, బద్వేలు నియోజకవర్గ నాయకులు చెరుకూరి రవికుమార్, పామూరి బాలిరెడ్డి, కర్నాటి వెంకట రెడ్డి, బాదిరెడ్డి వీరారెడ్డి, ఇమామ్ హుస్సేన్, కొంకుల రాంబాబు, మాచుపల్లి లక్ష్మి దేవి, చెరుకూరి చెండ్రాయుడు, ఓ. రమణారెడ్డి, జనసేన నాయకులు ఈశ్వర్ రెడ్డి, సింగం శెట్టి వెంకట సుబ్బయ్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విజయోత్సవ సభ బద్వేలులో విజయవంతంగా జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు గారి స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టుచీరను శ్రీ కనకదుర్గఅమ్మవారికి అలంకరణ చేయవలసినదిగా ఆలయ ఈవో వికె శీనా నాయక్ కు ఆయన అందజేశారు. ‘అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర’గా చేనేత రంగానికే మచ్చుతునకగా నిలిచిన ఈ కళాఖండాన్ని విజయ్ కుమార్ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి మగ్గంపై అద్భుతంగా మలిచారు. ఈ పట్టుచీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు ఉంటుంది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం. సాంప్రదాయ, ఆకర్షణీయమైన ‘ఇక్కత్ డిజైన్’ వచ్చేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించిన ఈ చీరను మడతపెడితే సులభంగా ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో తాను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. ఎల్లప్పుడూ దుర్గమ్మ తల్లి దీవెనలు తమపై ఉండాలని కోరుకుంటూ ఈ సరికొత్త పట్టుచీరను సమర్పించి, అమ్మవారి కృపకు పాత్రులం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ‘ఆపరేషన్ సింధు’ పేరిట అద్భుతమైన శాలువను తయారు చేసి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అందించి, వారి చేతుల మీదుగా ఘనమైన ప్రశంసలు పొందిన స్ఫూర్తితోనే, చేనేత కళా నైపుణ్యాన్ని చాటుతూ ఈ చీరను రూపొందించినట్లు వివరించారు. అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయ ఈవో శీనానాయక్ పరిశీలించి, అసాధారణ ప్రతిభ చూపిన చేనేత కళాకారుణ్ణి ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న రీతిగా మన సంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని శీనానాయక్ ఈ సందర్భంగా కోరారు.
    1
    తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు గారి స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టుచీరను శ్రీ కనకదుర్గఅమ్మవారికి అలంకరణ చేయవలసినదిగా ఆలయ ఈవో వికె శీనా నాయక్ కు ఆయన అందజేశారు.

‘అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర’గా చేనేత రంగానికే మచ్చుతునకగా నిలిచిన ఈ కళాఖండాన్ని విజయ్ కుమార్ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి మగ్గంపై అద్భుతంగా మలిచారు. ఈ పట్టుచీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు ఉంటుంది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం. సాంప్రదాయ, ఆకర్షణీయమైన ‘ఇక్కత్ డిజైన్’ వచ్చేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించిన ఈ చీరను మడతపెడితే సులభంగా ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది.

ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో తాను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. ఎల్లప్పుడూ దుర్గమ్మ తల్లి దీవెనలు తమపై ఉండాలని కోరుకుంటూ ఈ సరికొత్త పట్టుచీరను సమర్పించి, అమ్మవారి కృపకు పాత్రులం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ‘ఆపరేషన్ సింధు’ పేరిట అద్భుతమైన శాలువను తయారు చేసి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అందించి, వారి చేతుల మీదుగా ఘనమైన ప్రశంసలు పొందిన స్ఫూర్తితోనే, చేనేత కళా నైపుణ్యాన్ని చాటుతూ ఈ చీరను రూపొందించినట్లు వివరించారు.

అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయ ఈవో శీనానాయక్ పరిశీలించి, అసాధారణ ప్రతిభ చూపిన చేనేత కళాకారుణ్ణి ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న రీతిగా మన సంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని శీనానాయక్ ఈ సందర్భంగా కోరారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • నంద్యాల జిల్లాలోని మహానంది ఈశ్వర్ నగర్ ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలో రాత్రి వేళల్లో చిమ్మ చీకటి అలుముకోవడంతో, పిల్లలు, పెద్దలు ఎవరూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అడవి జంతువులు జనావాసంలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలను అధికారులు గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు త్వరగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    నంద్యాల జిల్లాలోని మహానంది ఈశ్వర్ నగర్ ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలో రాత్రి వేళల్లో చిమ్మ చీకటి అలుముకోవడంతో, పిల్లలు, పెద్దలు ఎవరూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అడవి జంతువులు జనావాసంలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలను అధికారులు గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు త్వరగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం గోకార్లపల్లి బిట్ - 2 గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గుడిపల్లి మండలానికి చెందిన ఈ గ్రామంలో సర్వే నంబర్ 6/4, 6/5 లోని వ్యవసాయ భూమికి సంబంధించిన వాగు, వంక జమీందారు కాలం నుండి ఉన్నాయని గ్రామస్థులు మురుగేష్, సునీత, సురేశ్ లు తెలిపారు. రాజువ కాలువకు చెందిన సుమారు 90 సెంట్ల ప్రభుత్వ భూమిని శిగలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నేత సోమశేఖర్ కబ్జా చేశారని వారు ఆరోపించారు. సోమశేఖర్ రాత్రికి రాత్రే ఈ భూమిలో చెట్లు నాటి, ఎవరూ అటువైపు వెళ్లకుండా అడ్డుకుని తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జాపై కడ పిడి, ఆర్డీఓ, జన నాయకుడు పోర్టల్ మరియు గుడిపల్లి తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. అయితే, ఆ భూమిని సర్వే చేయాలని ఆర్డీఓ ట్రూ కాపీ ఇచ్చినా గుడిపల్లి తహసీల్దార్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తహసీల్దార్ చుట్టూ తిరిగినా, తనకు సంబంధం లేదని, గ్రామంలో మీరే చూసుకోమని చెప్పారని గ్రామస్థులు వివరించారు. గత వైసీపీ హయాం నుండి గుడిపల్లి తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సీతారం, వైసీపీకి చెందిన సోమశేఖర్ కు సహకరిస్తున్నారని వారు తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ భూమిని పరిరక్షించి, ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన వైసీపీకి చెందిన సోమశేఖర్ పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
    2
    చిత్తూరు జిల్లా కుప్పం గోకార్లపల్లి బిట్ - 2 గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గుడిపల్లి మండలానికి చెందిన ఈ గ్రామంలో సర్వే నంబర్ 6/4, 6/5 లోని వ్యవసాయ భూమికి సంబంధించిన వాగు, వంక జమీందారు కాలం నుండి ఉన్నాయని గ్రామస్థులు మురుగేష్, సునీత, సురేశ్ లు తెలిపారు. రాజువ కాలువకు చెందిన సుమారు 90 సెంట్ల ప్రభుత్వ భూమిని శిగలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నేత సోమశేఖర్ కబ్జా చేశారని వారు ఆరోపించారు.

సోమశేఖర్ రాత్రికి రాత్రే ఈ భూమిలో చెట్లు నాటి, ఎవరూ అటువైపు వెళ్లకుండా అడ్డుకుని తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జాపై కడ పిడి, ఆర్డీఓ, జన నాయకుడు పోర్టల్ మరియు గుడిపల్లి తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. అయితే, ఆ భూమిని సర్వే చేయాలని ఆర్డీఓ ట్రూ కాపీ ఇచ్చినా గుడిపల్లి తహసీల్దార్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తహసీల్దార్ చుట్టూ తిరిగినా, తనకు సంబంధం లేదని, గ్రామంలో మీరే చూసుకోమని చెప్పారని గ్రామస్థులు వివరించారు. గత వైసీపీ హయాం నుండి గుడిపల్లి తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సీతారం, వైసీపీకి చెందిన సోమశేఖర్ కు సహకరిస్తున్నారని వారు తెలిపారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ భూమిని పరిరక్షించి, ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన వైసీపీకి చెందిన సోమశేఖర్ పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.