Shuru
Apke Nagar Ki App…
ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుంది... పట్టాలెక్కనున్న ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మల్ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కుమార్ ను కోరారు.రైల్వే లైన్ ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.త్వరలో పనుల అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తనను కలిసిన బీజేపీ బృందానికి కేంద్రమంత్రి చెప్పారు.
Murali
ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుంది... పట్టాలెక్కనున్న ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మల్ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కుమార్ ను కోరారు.రైల్వే లైన్ ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.త్వరలో పనుల అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తనను కలిసిన బీజేపీ బృందానికి కేంద్రమంత్రి చెప్పారు.
More news from తెలంగాణ and nearby areas
- గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా గోరింటాకు సంబరాలు నిర్మల్ జిల్లా భైంసాలోని గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆషాడమాసం సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోరింటాకు విశిష్టత,ఆరోగ్యం, సంస్కృతి సంప్రదాయం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు,అధ్యాపకులు సంప్రదాయబద్ధంగా గోరింటాకును తయారు చేసుకుని ఒకరికొకరు పెట్టుకుంటూ ఉత్సాహంగా గడిపారు.గోరింటాకు కేవలం అలంకరణకే కాదు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు.1
- ముధోల్ పదవ సెంటర్ అంగన్వాడి లో పాము కలకలం... పట్టుకుని అటవీ ప్రాంతం లో వదిలేసిన స్థానికులు... నిర్మల్ జిల్లా // ముధోల్ BREAKING NEWS ముధోల్ మండల కేంద్రంలోని పదవ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో విషపూరిత పాము కలకలం... ఉదయం అంగన్వాడిని శుభ్రం చేయడానికి వచ్చి బాత్రూంలో ఉన్న పామును చూసి ఉలిక్కిపడ్డ అంగన్వాడి కేంద్రం సహాయకురాలు (ఆయమ్మ)... ఆయమ్మ కేకలు వేయడంతో అప్రమత్తమై పామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు... అదే సమయంలో అంగన్వాడి కేంద్రం లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం...1
- మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు. * ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ. మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- ఆర్మూర్లో SIR అవగాహనా సదస్సు - 100% ఓటర్ల ఎన్రోల్మెంట్ పూర్తి ఆర్మూర్లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహనా సదస్సు నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, తెలంగాణ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఓటర్ల ఎన్రోల్మెంట్ 100% పూర్తి చేశామని, 25,800 డబుల్ ఓట్లను తొలగించామని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఎల్ఏలు, సూపర్వైజర్లకు ధన్యవాదాలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుక కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశ వేణు, మండల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.1
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం, క్రమేసి పెరుగుతున్న నీటి మట్టం ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 74950 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091. అడుగులు,80 టీఎంసీలు ప్రస్తుతం 1068.8అడుగులు, 21.369టీఎంసీలు1
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన శ్రావణ్కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్కుమార్ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుంది... పట్టాలెక్కనున్న ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మల్ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కుమార్ ను కోరారు.రైల్వే లైన్ ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.త్వరలో పనుల అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తనను కలిసిన బీజేపీ బృందానికి కేంద్రమంత్రి చెప్పారు.1
- *ఇంటి పనివాడే దొంగతనానికి సూత్రధారి..* *వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా జులై 31 :- *మొత్తం 1.4 కేజీల తులాల వెండి ఆభరణాలు,15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.* *బోథ్ సిఐ డి గురుస్వామి* బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ డి గురుస్వామి తెలిపారు. ఈ నెల 29న బోథ్ పోలీస్ స్టేషన్లో క్రైం నెం. 186/2026, సెక్షన్ 331(4), 305 BNS కింద కేసు నమోదైంది. కేసు వివరాల ప్రకారం, సోనాల మండలం సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఫరాస్గావ్ గ్రామానికి వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మరియు నగదును ట్రంకు పెట్టెలో భద్రపరచి ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఈ విషయాన్ని ఇంటి పనివాడైన *అర్జున్ ఆడే (A2) తనకు పరిచయం ఉన్న **రథోడ్ గణేష్ (A1)**కు తెలిపాడు. తమకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఇద్దరూ కలిసి దొంగతనానికి పథకం రచించారు. అదే రోజు రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రథోడ్ గణేష్ ఇనుప రాడ్తో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉన్న 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,000 నగదును అపహరించగా, అర్జున్ ఆడే ఇంటి బయట కాపలా కాశాడు. అనంతరం దొంగిలించిన సొత్తును తమ మధ్య పంచుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన బోథ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించారు. కేసు నమోదైన విషయం తెలుసుకుని చోరీ సొత్తుతో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని బోథ్ పోలీస్ స్టేషన్ సీఐ డి గురుస్వామి సూచించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వి పురుషోత్తం, పోలీసు సిబ్బంది మదన్, హఫీజ్, రాహుల్, సంతోష్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1