Shuru
Apke Nagar Ki App…
ముధోల్ పదవ సెంటర్ అంగన్వాడి లో పాము కలకలం... పట్టుకుని అటవీ ప్రాంతం లో వదిలేసిన స్థానికులు... నిర్మల్ జిల్లా // ముధోల్ BREAKING NEWS ముధోల్ మండల కేంద్రంలోని పదవ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో విషపూరిత పాము కలకలం... ఉదయం అంగన్వాడిని శుభ్రం చేయడానికి వచ్చి బాత్రూంలో ఉన్న పామును చూసి ఉలిక్కిపడ్డ అంగన్వాడి కేంద్రం సహాయకురాలు (ఆయమ్మ)... ఆయమ్మ కేకలు వేయడంతో అప్రమత్తమై పామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు... అదే సమయంలో అంగన్వాడి కేంద్రం లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం...
RP
ముధోల్ పదవ సెంటర్ అంగన్వాడి లో పాము కలకలం... పట్టుకుని అటవీ ప్రాంతం లో వదిలేసిన స్థానికులు... నిర్మల్ జిల్లా // ముధోల్ BREAKING NEWS ముధోల్ మండల కేంద్రంలోని పదవ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో విషపూరిత పాము కలకలం... ఉదయం అంగన్వాడిని శుభ్రం చేయడానికి వచ్చి బాత్రూంలో ఉన్న పామును చూసి ఉలిక్కిపడ్డ అంగన్వాడి కేంద్రం సహాయకురాలు (ఆయమ్మ)... ఆయమ్మ కేకలు వేయడంతో అప్రమత్తమై పామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు... అదే సమయంలో అంగన్వాడి కేంద్రం లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం...
More news from తెలంగాణ and nearby areas
- ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుంది... పట్టాలెక్కనున్న ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మల్ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కుమార్ ను కోరారు.రైల్వే లైన్ ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.త్వరలో పనుల అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తనను కలిసిన బీజేపీ బృందానికి కేంద్రమంత్రి చెప్పారు.1
- సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్, ఎస్సైలు గోపి, శ్రావణి హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1
- తడ్కల్ పెద్ద, చిన్న చెరువులలోకి భారీగా వరద SRD: కంగ్టి మండల తడ్కల్ శివారులోని పెద్ద, చిన్న చెరువులలోకి భారీగా వరద నీరు చేరింది.4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరడంతో ఒక్కరోజులోనే చెరువు సగానికి పైగా నిండిందని రైతులు తెలిపారు. వర్షాలు కొనసాగితే అలుగు పారే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెరువు వద్దకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు.1
- ఎన్నికల సమరానికి టీఆర్పీ సై.. తొలి బీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన! రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జనగామ నియోజకవర్గానికి పార్టీ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్ను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో తొలి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్ను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బిక్షపతి ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. జనగామ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ రాజ్యాధికార సాధన కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.1
- రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం సేవలను కొనియాడిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భీమేశ్వర సదన్లో టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ యజుర్వేద పారాయణదార్ సువర్ణ రాధాకృష్ణ శర్మ, సేవాదార్ వేముల లక్ష్మీనారాయణలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈవో రమాదేవి వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సేవకు ఎన్నో సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సేవకు ముగింపు కాదని, రాజన్న–భీమన్నల సేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఎప్పుడైనా ఆలయానికి వచ్చి సేవలందించవచ్చని తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారికి రావలసిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలను (రిటైర్మెంట్ బెనిఫిట్స్) నిబంధనల ప్రకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ, దేవస్థానంలో పనిచేసిన కాలాన్ని తమ జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టంగా అభివర్ణించారు. సహోద్యోగులు, అధికారులు అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పనిచేశారని, అందరి సహకారం ఎప్పటికీ మరువలేమని భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంశీమోహన్ అధ్యక్షత వహించి సమన్వయం చేశారు.1
- ఎర్రపహాడ్ గ్రామంలో ఇంటి ముందున్న గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి* తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో తవ్విన పిల్లర్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలు: తల్లి పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో, చిన్నారి ఆమెకు తెలియకుండా వెనుకనే బయటకు వచ్చింది. ఈ క్రమంలో సమీపంలోనే ఉన్న పిల్లర్ గుంతలో పడిపోయింది. కొంతసేపటికి పాప కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్ను పరిశీలించారు. పాప తల్లి వెనకాలే వచ్చి గుంతలో పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో వెంటనే గుంత నుంచి చిన్నారిని బయటకు తీశారు. కానీ, అప్పటికే పాప మృతి చెందింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసిపాప కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.1