Shuru
Apke Nagar Ki App…
నందిపేట్ ZPHSలో బాల గ్రామ సభ - విద్యార్థుల సమస్యలపై స్పందించిన సర్పంచ్ నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో సోమవారం బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాఠశాలలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు వివరించిన సమస్యలను సర్పంచ్ శ్రద్ధగా నోట్ చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉప సర్పంచ్ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు పాషా, పెట్ల శ్రీనివాస్, చింత శ్రీనివాస్, కంఠం చిన్నయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Shaikg journalist
నందిపేట్ ZPHSలో బాల గ్రామ సభ - విద్యార్థుల సమస్యలపై స్పందించిన సర్పంచ్ నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో సోమవారం బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాఠశాలలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు వివరించిన సమస్యలను సర్పంచ్ శ్రద్ధగా నోట్ చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉప సర్పంచ్ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు పాషా, పెట్ల శ్రీనివాస్, చింత శ్రీనివాస్, కంఠం చిన్నయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల వెడల్పులకు ఇంకా ఎన్నాళ్లు ఖానాపూర్ మున్సిపాలిటీ రహదారుల వెడల్పుకు ఇంకా ఎన్నాళ్ల. ఇరుకైన రోడ్డులో గుంతలు ఏర్పడడంతో సిమెంటుతో పైన పైన పూతల పూసీ చేతులు దులుపు కోవడం అధికార యంత్రాంగం పైన ఇదేనా అన్ని స్థానికులు ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రోడ్ల వెడల్పు డ్రైనేజీ పనులను పూర్తిచేయాలని ప్రజలు వానదరులు కోరుకుంటున్నారు1
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదని కోరుట్ల ఎమ్మెల్యే విమర్శించారు.1
- శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసు విరాళం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఓ భక్త కుటుంబం భక్తిశ్రద్ధలతో సుమారు రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును విరాళంగా అందజేసింది.దేవస్థానం రికార్డుల ప్రకారం, వేములవాడ బ్రహ్మంగారి వీధికి చెందిన బై విద్యాసాగర్, సురేఖ దంపతులు సోమవారం స్వామి వారికి ఈ రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. దేవస్థానం అధికారులు ఈ గొలుసు బరువు 37 గ్రాములు, విలువ సుమారు రూ.3,50,000గా నమోదు చేశారు.ఈ సందర్భంగా దాతలు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవికి బంగారు గొలుసును అందజేయగా, దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) నవీన్ కుమార్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు దాతల సేవాభావాన్ని అభినందిస్తూ, శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహంతో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. భక్తులు బంగారం, వెండి, నగదు రూపంలో అందించే విరాళాలు దేవస్థానం అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, అలాగే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించబడుతున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు.1
- అక్రమ వడ్డీ వ్యాపారి అరెస్ట్: టూ టౌన్ సీఐ నాగరాజు..... ADB: అధిక వడ్డీలకు అక్రమంగా రుణాలు ఇస్తున్న దినేష్ కుమార్ తో పాటు ఆయనకు సహకరిస్తున్న కిషోర్ను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, 6 ఆర్సీలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై మనీ లెండర్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.1
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి మరియు ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం నిరంతరం తోడ్పాటునందిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి ₹4,597 కోట్ల అదనపు పన్నుల వాటాను విడుదల చేసింది. సకాలంలో అందుతున్న ఈ కేంద్ర నిధులు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను మరియు వివిధ సంక్షేమ పథకాల అమలును మరింత వేగవంతం చేయనున్నాయి.1
- పార్టీ బలోపేతానికి ఐక్యత, క్రమశిక్షణ అవసరం: మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే 'సంఘటన్ శ్రీజన్ అభియాన్' కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్, మావల, తాంసి, భీంపూర్ మండలాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15లోగా మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని, నియామకాల్లో వర్గ విభేదాలకు తావు లేకుండా సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి మండల కమిటీలో అధ్యక్షుడితో కలిపి 22 మంది సభ్యులు ఉండేలా, ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మహిళా నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, పార్టీ బలోపేతానికి ఐక్యత, క్రమశిక్షణ, సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. సమావేశాల్లో డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్,మాజీ ఎంపీ సోయం బాపూరావు,కంది శ్రీనివాస్ రెడ్డి,ఆడే గజేందర్,మల్లెపూల సత్యనారాయణ,సాజీద్ ఖాన్,అల్లూరి సంజీవ్ రెడ్డి,అడ్డి భోజారెడ్డి,గీమ్మ సంతోష్తో పాటు ప్రజాప్రతినిధులు,మండల అధ్యక్షులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- సోమవారం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్శనం ముగించుకుని వస్తున్న ఓ దివ్యాంగ భక్తిని పలకరించి, దర్శనం సక్రమంగా జరిగిందా, ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.అనంతరం ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాలు వెలిగించే కౌంటర్లు, రెండు చెక్పోస్టులు తదితర ప్రాంతాలను పరిశీలించారు. కోడె టికెట్ల జారీ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులు కొబ్బరి కాయలు కొట్టిన అనంతరం వాటి పెంకులు, చిన్న ముక్కలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ఇతర భక్తుల కాళ్లకు గుచ్చుకుని గాయాలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. కొబ్బరి వ్యర్థాలను తప్పనిసరిగా డస్ట్బిన్లలో వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.మొత్తం ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఈవో రమాదేవి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.2
- *వైద్యరోగ్య సౌకర్యాలను మెరుగుపరచాలి. రిమ్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి*. ప్రకటన *బండారు రవికుమార్ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు*. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నెలకొని ఉన్న సమస్యల పైన అధ్యాయం చేయడానికి సిపిఎం పార్టీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సభ్యులు బండారు రవికుమార్ రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ లో ప్రొఫెసర్ పోస్టులు 5 అసోసియేట్ 44 ట్యూటర్ 25 అసిస్టెంట్ ప్రొఫెసర్ 13 సీనియర్ రెసిడెన్సి 21 సీఎంఓ 6 సి ఏ ఎస్ ఆర్ ఎం ఓ 4 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 115 ఖాళీలుగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలను అందించవచ్చు అని అన్నారు. ఎనిమిది లిఫ్టులలో రెండు మాత్రమే పని చేస్తున్నా యని పేషెంట్లకు డాక్టర్లకు వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇబ్బందిగా మారిందన్నారు. పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడం 125 కేవీఏ జనరేటర్ పనిచేయకపోవడం రెండు అంబులెన్సులు పనిలో లేకపోవడం సరి కాదని అన్నారు. కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ప్రారంభించిన క్రిటికల్ కేర్ లో సిబ్బందిని నియమించకపోవడంతో క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం కాలేదని వెంటనే సిబ్బందిని నియమించి సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీలో నెఫ్రాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను వెంటనే ప్రారంభించాలని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు పెరిగిన ఎంబిబిఎస్ 50 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీని నియమించాలని విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రిమ్స్ ను సందర్శించాలని నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కార్యచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు వేతనాలు పెంచాలని అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రకటన *వైద్యరోగ్య సౌకర్యాలను మెరుగుపరచాలి. రిమ్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి*. *బండారు రవికుమార్ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు*. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నెలకొని ఉన్న సమస్యల పైన అధ్యాయం చేయడానికి సిపిఎం పార్టీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సభ్యులు బండారు రవికుమార్ రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ లో ప్రొఫెసర్ పోస్టులు 5 అసోసియేట్ 44 ట్యూటర్ 25 అసిస్టెంట్ ప్రొఫెసర్ 13 సీనియర్ రెసిడెన్సి 21 సీఎంఓ 6 సి ఏ ఎస్ ఆర్ ఎం ఓ 4 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 115 ఖాళీలుగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలను అందించవచ్చు అని అన్నారు. ఎనిమిది లిఫ్టులలో రెండు మాత్రమే పని చేస్తున్నా యని పేషెంట్లకు డాక్టర్లకు వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇబ్బందిగా మారిందన్నారు. పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడం 125 కేవీఏ జనరేటర్ పనిచేయకపోవడం రెండు అంబులెన్సులు పనిలో లేకపోవడం సరి కాదని అన్నారు. కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ప్రారంభించిన క్రిటికల్ కేర్ లో సిబ్బందిని నియమించకపోవడంతో క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం కాలేదని వెంటనే సిబ్బందిని నియమించి సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీలో నెఫ్రాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను వెంటనే ప్రారంభించాలని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు పెరిగిన ఎంబిబిఎస్ 50 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీని నియమించాలని విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రిమ్స్ ను సందర్శించాలని నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కార్యచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు వేతనాలు పెంచాలని అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్ జిల్లా కమిటీ సభ్యులు R మంజుల,బొజ్జ ఆశన్న నాయకులు ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్ జిల్లా కమిటీ సభ్యులు R మంజుల,బొజ్జ ఆశన్న నాయకులు ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.2
- జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో కుక్కల సంచారం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది1