Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో కుక్కల సంచారం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది
MD. YOUSUF ALI KHAN
జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో కుక్కల సంచారం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది
More news from తెలంగాణ and nearby areas
- కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు1
- శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసు విరాళం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఓ భక్త కుటుంబం భక్తిశ్రద్ధలతో సుమారు రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును విరాళంగా అందజేసింది.దేవస్థానం రికార్డుల ప్రకారం, వేములవాడ బ్రహ్మంగారి వీధికి చెందిన బై విద్యాసాగర్, సురేఖ దంపతులు సోమవారం స్వామి వారికి ఈ రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. దేవస్థానం అధికారులు ఈ గొలుసు బరువు 37 గ్రాములు, విలువ సుమారు రూ.3,50,000గా నమోదు చేశారు.ఈ సందర్భంగా దాతలు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవికి బంగారు గొలుసును అందజేయగా, దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) నవీన్ కుమార్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు దాతల సేవాభావాన్ని అభినందిస్తూ, శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహంతో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. భక్తులు బంగారం, వెండి, నగదు రూపంలో అందించే విరాళాలు దేవస్థానం అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, అలాగే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించబడుతున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు.1
- వార్తకు స్పందించిన అటవీశాఖ.. కవ్వాల్ టైగర్ జోన్లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో బారికేడ్లు రాత్రివేళ కనిపించక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందంటూ ఇటీవల ప్రచురితమైన వార్తకు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్ల వద్ద అవసరమైన సూచికలను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు. గతంలో బారికేడ్ల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చీకటిలో బారికేడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై వార్త వెలువడిన వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ప్రధాన రహదారి వెంట "GO SLOW", "అడవి జంతువుల కోసం నెమ్మదిగా వెళ్లండి" వంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే బారికేడ్లు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ సూచికలు ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని సమాచారం. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా టైగర్ జోన్ పరిధిలోని అన్ని బారికేడ్ల వద్ద భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.1
- ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడు కలుగును ఖానాపూర్ మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలి టీ రోడ్ల విస్తరణ పనులు చేయకపోగా వాహనదారులకు ఇబ్బందిగా మారిన ఇరుకైన రోడ్లు గుంత గుంతలు ఇప్పుడు అ గుంతలో సిమెంట్తో పూతలు పూసి చేతులు అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు1
- BJP Ke Qile Mein Prashant Kishor Ki Shandaar Jeet! pk baninge ab naye ak Bihar ke Bankepur Assembly halqe mein Prashant Kishor (PK) ne badi siyasi kamyabi hasil ki. Jan Suraaj party ki taraf se ladte hue unhon ne BJP candidate Neeraj Kumar Sinha ko shikast di. Yeh halqa kai dashkon se BJP ka mazboot qila mana jata tha. PK ki is jeet ko Bihar ki siyasat mein ek aham siyasi tabdeeli ke taur par dekha ja raha hai. Aakhir BJP ke mazboot qile mein PK ki jeet kaise mumkin hui?1
- కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ను శుద్ధి చేసిన కాంగ్రెస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ను కాంగ్రెస్ శ్రేణులు నీళ్లతో కడిగి శుద్ధి చేశాయి. నిన్నటి బిఆర్ఎస్ నాయకుల పర్యటనతో పంప్హౌస్ అపవిత్రమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయ గౌడ్ మండిపడ్డారు. ఇక్కడికి వస్తున్నది ఎల్లంపల్లి నీళ్లేనని, కాళేశ్వరం నీళ్లంటూ బిఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బిఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇకపైనా డ్రామాలు ఆడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు.1
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదని కోరుట్ల ఎమ్మెల్యే విమర్శించారు.1
- నడుచుకుంటూ వెళ్తూ. వేములవాడలో గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు కుప్పకూలి మృతి చెందిన ఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన కోరేపు దుర్గప్రసాద్ (31) అనే యువకుడు ఈరోజు సోమవారం మధ్యాహ్నం తన ద్విచక్రవాహనాన్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు దుర్గప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వృత్తిరీత్యా పెయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న దుర్గప్రసాద్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న యువకుడు హఠాత్తుగా మృతి చెందడంతో వేములవాడలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.1