logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సూర్యాపేటలో వాసవి మాత డైరీ ఆవిష్కరణ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవిభవన్లో వాసవి మాత డైరీలను వాసవి క్లబ్ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

1 day ago
user_Journalist Prem
Journalist Prem
Journalist Nalgonda, Telangana•
1 day ago

సూర్యాపేటలో వాసవి మాత డైరీ ఆవిష్కరణ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవిభవన్లో వాసవి మాత డైరీలను వాసవి క్లబ్ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

More news from Telangana and nearby areas
  • నల్గొండ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి మూడు ఇండ్లలో చొరబడ్డ దొంగలు విలువైన వస్తువులు నగదును అపహరించారు. దీనిపై సీసీ ఫుటేజ్ లో పోలీసులు విడుదల చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
    1
    నల్గొండ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి మూడు ఇండ్లలో చొరబడ్డ దొంగలు విలువైన వస్తువులు నగదును అపహరించారు. దీనిపై సీసీ ఫుటేజ్ లో పోలీసులు విడుదల చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    1 hr ago
  • RRR అలైన్మెంట్ మార్చాలని రైతుల ఆవేదన 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్/
    1
    RRR అలైన్మెంట్ మార్చాలని రైతుల ఆవేదన 
👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్/
    user_Gousuddin Md
    Gousuddin Md
    Reporter Amberpet, Hyderabad•
    14 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం
    2
    భారత్ మాత కి జై 🇮🇳 
జై హొ సనాతన ధర్మం
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    17 hrs ago
  • కేసీఆర్ ఇంటి ముందు కాంగ్రెస్ ధర్నా డ్రామా – గజ్వేల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ ఘాటు విమర్శలు గజ్వేల్, సిద్దిపేట జిల్లా: జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గజ్వేల్ కేంద్రంగా వాగ్వాదం తారాస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ధర్నా పూర్తిగా రాజకీయ నాటకమేనని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రయత్నమని మాజీ ఎంపిటిసిల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి రవీందర్ మాట్లాడుతూ, “కేసీఆర్ గజ్వేల్‌కు ఏం చేశారు అనే విషయంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమా?” అని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి 50 ఏళ్లకు సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన కొట్టిపారేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల పేరుతో రాజకీయాలు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే కాదా? అని దేవి రవీందర్ ప్రశ్నించారు. “ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను అడ్డుకుని, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు” అని మండిపడ్డారు. గజ్వేల్‌లో కనుమరుగవుతున్న కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ తెలుసని, కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్ముతారని భావించడం భ్రమ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూనే జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని గుర్తు చేశారు. 180 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ? మూడవసారి ఎన్నికల సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 180 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులకు నిధులు కేటాయించలేదని దేవి రవీందర్ ఆరోపించారు. అంతేకాకుండా, “ఆ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి తరలించలేదా?” అని ఘాటుగా ప్రశ్నించారు. ధర్నాలు కాదు – అభివృద్ధి చూపించాలి కాంగ్రెస్ నేతలు ధర్నాలు, ఆరోపణల రాజకీయాలు మానేసి గజ్వేల్‌కు ఏం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.“కేసీఆర్ ఇంటి ముందు ధర్నాలు చేస్తే కాదు, ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు చూపిస్తేనే రాజకీయ విశ్వసనీయత నిలబడుతుంది” అని దేవి రవీందర్ స్పష్టం చేశారు.
    1
    కేసీఆర్ ఇంటి ముందు కాంగ్రెస్ ధర్నా డ్రామా – గజ్వేల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ ఘాటు విమర్శలు
గజ్వేల్, సిద్దిపేట జిల్లా: జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గజ్వేల్ కేంద్రంగా వాగ్వాదం తారాస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ధర్నా పూర్తిగా రాజకీయ నాటకమేనని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రయత్నమని మాజీ ఎంపిటిసిల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి రవీందర్ మాట్లాడుతూ,
“కేసీఆర్ గజ్వేల్‌కు ఏం చేశారు అనే విషయంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమా?” అని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి 50 ఏళ్లకు సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన కొట్టిపారేశారు.
మల్లన్నసాగర్ నిర్వాసితుల పేరుతో రాజకీయాలు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే కాదా? అని దేవి రవీందర్ ప్రశ్నించారు.
“ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను అడ్డుకుని, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు” అని మండిపడ్డారు.
గజ్వేల్‌లో కనుమరుగవుతున్న కాంగ్రెస్
గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ తెలుసని, కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్ముతారని భావించడం భ్రమ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూనే జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని గుర్తు చేశారు.
180 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ?
మూడవసారి ఎన్నికల సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 180 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులకు నిధులు కేటాయించలేదని దేవి రవీందర్ ఆరోపించారు.
అంతేకాకుండా,
“ఆ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి తరలించలేదా?” అని ఘాటుగా ప్రశ్నించారు.
ధర్నాలు కాదు – అభివృద్ధి చూపించాలి
కాంగ్రెస్ నేతలు ధర్నాలు, ఆరోపణల రాజకీయాలు మానేసి గజ్వేల్‌కు ఏం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.“కేసీఆర్ ఇంటి ముందు ధర్నాలు చేస్తే కాదు, ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు చూపిస్తేనే రాజకీయ విశ్వసనీయత నిలబడుతుంది” అని దేవి రవీందర్ స్పష్టం చేశారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    16 hrs ago
  • నందిగామ టీవీ న్యూస్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.
    1
    నందిగామ టీవీ న్యూస్ : 
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ఈ నెంబరు బైక్ కలిగిన వ్యక్తి నరసరావుపేట నుండి రావిపాడు లో గల పాలపాడు లేదా నల్ల గార్లపాడు వెళ్లే దారిలో ఓ వ్యక్తి ఉన్నారు. గోదా రమేష్ కు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనపై స్పందించిన గోదా రమేష్ అతనిని సురక్షితమైన ప్రదేశంలో ఆయనను పడుకోబెట్టి ఆయన బండి తాళం జేబులో ఉంచారు.వీరి సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వీరిని సురక్షితంగా ఇంటికి తీసుకొని వెళ్లాలని డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ లో ఉన్నాయని రమేష్ కుమార్ తెలిపారు*
    1
    ఈ నెంబరు బైక్ కలిగిన వ్యక్తి నరసరావుపేట నుండి రావిపాడు లో గల పాలపాడు లేదా నల్ల గార్లపాడు వెళ్లే దారిలో  ఓ  వ్యక్తి ఉన్నారు. గోదా రమేష్ కు  స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనపై స్పందించిన గోదా రమేష్ అతనిని సురక్షితమైన ప్రదేశంలో ఆయనను  పడుకోబెట్టి ఆయన బండి తాళం జేబులో ఉంచారు.వీరి సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వీరిని  సురక్షితంగా ఇంటికి తీసుకొని వెళ్లాలని డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ లో ఉన్నాయని రమేష్ కుమార్ తెలిపారు*
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    11 hrs ago
  • ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర జనవరి 28 నుండి 31 తేదీ వరకు నిర్వహించబడును. కావున దేశ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు.
    1
    ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర జనవరి 28 నుండి 31 తేదీ వరకు నిర్వహించబడును. కావున దేశ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు.
    user_Swathi
    Swathi
    Graphic designer ములుగు, ములుగు, తెలంగాణ•
    22 hrs ago
  • గడియారం సెంటర్ సమీపంలోని ఆర్పి రోడ్డు పెట్రోల్ బంక్ పై పలు ఆరోపణలు... వాహనానికి పోసిన పెట్రోల్ లో సగం నీరు సగం పెట్రోల్ అంటూ వినియోగదారుడి ఫిర్యాదు... పెట్రోల్ పోసుకున్న కొద్దిదూరంలోనే వాహనం ఆగిపోవడంతో అనుమానం... తిరిగి బాటిల్ లో లీటర్ పెట్రోల్ తీసుకోగా పెట్రోల్ లో వాటర్ కల్తీ... ప్రశ్నించిన వినియోగదారుడికి బంక్ సిబ్బంది దురుసు ప్రవర్తన.. చేసేదేమీ లేక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు.. ప్రజలను మోసగిస్తున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేయాలంటూ వినియోగదారుడు డిమాండ్.. ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు...
    1
    గడియారం సెంటర్ సమీపంలోని ఆర్పి రోడ్డు పెట్రోల్ బంక్ పై పలు ఆరోపణలు...
వాహనానికి పోసిన పెట్రోల్ లో సగం నీరు సగం పెట్రోల్ అంటూ వినియోగదారుడి ఫిర్యాదు...
పెట్రోల్ పోసుకున్న కొద్దిదూరంలోనే వాహనం ఆగిపోవడంతో అనుమానం...
తిరిగి బాటిల్ లో లీటర్ పెట్రోల్ తీసుకోగా పెట్రోల్ లో వాటర్ కల్తీ...
ప్రశ్నించిన వినియోగదారుడికి బంక్ సిబ్బంది దురుసు ప్రవర్తన..
చేసేదేమీ లేక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు..
ప్రజలను మోసగిస్తున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేయాలంటూ వినియోగదారుడు డిమాండ్..
ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.