వర్సిటీ నుంచి విమానాశ్రయం వరకు..ఆదిలాబాద్ కాంగ్రెస్ పీఏసీ ఫోకస్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో శనివారం నిర్వహించిన జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) తొలి సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు జిల్లా అభివృద్ధి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నూతన డీసీసీ కార్యాలయ నిర్మాణం, మండల కమిటీల ఏర్పాటు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు,పార్టీ విస్తరణపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర,జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు సంక్షేమ పథకాల అమలులో పార్టీ నాయకులు, కార్యకర్తలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ శివారులోని 800 ఎకరాల ప్రభుత్వ భూమిలో విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేయాలని పీఏసీ తీర్మానించింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బోథ్ నియోజకవర్గానికి కీలకమైన కుప్టి ప్రాజెక్టు జీవో నంబర్లు 18,34లను సవరించి నీటి నిల్వ సామర్థ్యాన్ని 6.5 టీఎంసీలకు పెంచాలని సమావేశంలో తీర్మానించారు. సాగు,తాగునీటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. జైనథ్–బేలా సంయుక్త మార్కెట్ కమిటీని విభజించి బేలాకు ప్రత్యేక మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వమే మంజూరు చేస్తోందని, వాటిపై ఇతరులు ప్రచారం చేసుకోవడం తగదని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే మార్గం నిర్మాణానికి కూడా సహకారం అందిస్తోందని డా. నరేష్ జాదవ్ తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావు,కంది శ్రీనివాస్ రెడ్డి,ఆడే గజేందర్,బోరంచు శ్రీకాంత్ రెడ్డి,సాజిద్ ఖాన్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
వర్సిటీ నుంచి విమానాశ్రయం వరకు..ఆదిలాబాద్ కాంగ్రెస్ పీఏసీ ఫోకస్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో శనివారం నిర్వహించిన జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) తొలి సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు జిల్లా అభివృద్ధి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నూతన డీసీసీ కార్యాలయ నిర్మాణం, మండల కమిటీల ఏర్పాటు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు,పార్టీ విస్తరణపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర,జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు సంక్షేమ పథకాల అమలులో పార్టీ నాయకులు, కార్యకర్తలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ శివారులోని 800 ఎకరాల ప్రభుత్వ భూమిలో విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేయాలని పీఏసీ తీర్మానించింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బోథ్ నియోజకవర్గానికి కీలకమైన కుప్టి ప్రాజెక్టు జీవో నంబర్లు 18,34లను సవరించి నీటి నిల్వ సామర్థ్యాన్ని 6.5 టీఎంసీలకు పెంచాలని సమావేశంలో తీర్మానించారు. సాగు,తాగునీటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. జైనథ్–బేలా సంయుక్త మార్కెట్ కమిటీని విభజించి బేలాకు ప్రత్యేక మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వమే మంజూరు చేస్తోందని, వాటిపై ఇతరులు ప్రచారం చేసుకోవడం తగదని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే మార్గం నిర్మాణానికి కూడా సహకారం అందిస్తోందని డా. నరేష్ జాదవ్ తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావు,కంది శ్రీనివాస్ రెడ్డి,ఆడే గజేందర్,బోరంచు శ్రీకాంత్ రెడ్డి,సాజిద్ ఖాన్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి.. ఏఎంసీ చైర్మన్ మావల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ మిల్కా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారు. మండల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్య సేవలు, ప్రాథమిక విద్య, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కృష్ణవేణి, మావల ప్రిన్సిపాల్ సరోజ, విద్యుత్ శాఖ ఏఈ జనార్దన్ రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, బట్టిసవర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వాఘాపూర్ సర్పంచ్ దినేష్, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో మళ్లీ కురుస్తున్న వర్షం తాంసి మండల కేంద్రంలో శనివారం రాత్రి మళ్లీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. కప్పర్ల, బండల నాగపూర్, జామిడితో పాటు తదితర గ్రామాల్లోనూ వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటలకు అనుకూలిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.1
- మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- కాగజ్నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.2
- పట్నం సోదరులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ ఇటీవల పరమపదించిన నేపథ్యంలో, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి షాబాద్లోని వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత రుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత రుక్కమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించారు. అనంతరం పట్నం మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మనుమడు పట్నం అవినాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికీ మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.1
- బోధన్ ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) 675వ ఉర్సు మహోత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పాల్గొన్నారు. దర్గా వద్ద చాదర్ సమర్పించి, గులాబీ పూలతో నివాళులర్పించిన కమిషనర్... రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్కు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్హెచ్వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదారు, మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- ట్యాంక్ బండ్పై అన్న భావు సాఠే విగ్రహాన్ని ప్రతిష్టించాలి: ఆరెల్లి మల్లేష్ ADB: ఆదిలాబాద్ పట్టణంలో MRPS ఆధ్వర్యంలో అన్న భావు సాఠే 106వ జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. తన సాహిత్యంతో సమాజాన్ని చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి అన్న భావు సాఠే అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని కోరారు.1