*మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ* *గారికి కూన రవికుమార్* *ఘన నివాళులు* మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ గారి ఆకస్మిక మరణం పట్ల ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని వారి స్వగృహంలో ఉంచిన గుండ అప్పల సూర్యనారాయణ గారి పార్దివ దేహానికి కూన రవికుమార్ గారు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుండ అప్పల సూర్యనారాయణ గారు ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా, మంత్రిగా ప్రజల మన్ననలు పొందారని, ఆయన సేవలు జిల్లా రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి మరణం రాజకీయ రంగానికి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు తీరని లోటని అన్నారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గుండ అప్పల సూర్యనారాయణ గారికి నివాళులు అర్పించారు.
*మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ* *గారికి కూన రవికుమార్* *ఘన నివాళులు* మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ గారి ఆకస్మిక మరణం పట్ల ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన
రవికుమార్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని వారి స్వగృహంలో ఉంచిన గుండ అప్పల సూర్యనారాయణ గారి పార్దివ దేహానికి కూన రవికుమార్ గారు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ, గుండ అప్పల సూర్యనారాయణ గారు ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా, మంత్రిగా ప్రజల మన్ననలు పొందారని, ఆయన సేవలు జిల్లా రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి మరణం రాజకీయ రంగానికి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు తీరని
లోటని అన్నారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గుండ అప్పల సూర్యనారాయణ గారికి నివాళులు అర్పించారు.
- 🙏🙏1
- 🙏🙏2
- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- 🙏🙏1