logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట గువ్వలగూడంలో వారాంతపు సంత ప్రారంభమైంది. గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడంలో వారాంతపు సంత ప్రారంభమైంది. దీంతో రైతుల నుండి నేరుగా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ...ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడం గ్రామంలో వారాంతపు సంతను నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కూడా వారాంతపు సంత నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంత వల్ల రైతులు తమ పంటను మధ్య దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకోవచ్చు. ప్రజలకు కూడా తక్కువ ధరకు తాజా కూరగాయలు,నిత్యావసరాలు అందుతాయి. ఇది గ్రామ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది. సంతలో రైతులు తమ పంటలను, గృహిణులు ఇంట్లో తయారు చేసిన వస్తువులను అమ్ముకోవటానికి అవకాశం కల్పించారు.ఇలాంటి సంతలు ప్రతి గ్రామంలో ఉండాలి. దీని వల్ల మహిళలు, చిన్న వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది. ప్రజలకు ఒకే చోట అన్ని సరుకులు దొరుకుతాయి. అని అన్నారు.

13 hrs ago
user_ARUNKUMAR
ARUNKUMAR
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
13 hrs ago

గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట గువ్వలగూడంలో వారాంతపు సంత ప్రారంభమైంది. గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడంలో వారాంతపు సంత ప్రారంభమైంది. దీంతో రైతుల నుండి నేరుగా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ...ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడం గ్రామంలో వారాంతపు సంతను నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కూడా వారాంతపు సంత నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంత వల్ల రైతులు తమ పంటను మధ్య దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకోవచ్చు. ప్రజలకు కూడా తక్కువ ధరకు తాజా కూరగాయలు,నిత్యావసరాలు అందుతాయి. ఇది గ్రామ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది. సంతలో రైతులు తమ పంటలను, గృహిణులు ఇంట్లో తయారు చేసిన వస్తువులను అమ్ముకోవటానికి అవకాశం కల్పించారు.ఇలాంటి సంతలు ప్రతి గ్రామంలో ఉండాలి. దీని వల్ల మహిళలు, చిన్న వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది. ప్రజలకు ఒకే చోట అన్ని సరుకులు దొరుకుతాయి. అని అన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం ఏఎంసీ మార్కెట్‌లో సమస్యల కుప్పలు.. చెత్తతో కంపుకొడుతున్న కూరగాయల మార్కెట్ ఖమ్మం జిల్లా మొత్తానికి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ.. ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంతో వ్యాపారులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నాలుగు మంచినీటి పంపులు పనిచేయకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కూరగాయల వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వేలాది మంది ప్రజలు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్కెట్‌లో కనీస పారిశుధ్య, తాగునీటి వసతులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పనిచేయని మంచినీటి పంపులను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.
    4
    ఖమ్మం ఏఎంసీ మార్కెట్‌లో సమస్యల కుప్పలు.. చెత్తతో కంపుకొడుతున్న కూరగాయల మార్కెట్
ఖమ్మం జిల్లా మొత్తానికి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ.. ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంతో వ్యాపారులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు మార్కెట్‌లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నాలుగు మంచినీటి పంపులు పనిచేయకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కూరగాయల వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి.
వేలాది మంది ప్రజలు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్కెట్‌లో కనీస పారిశుధ్య, తాగునీటి వసతులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పనిచేయని మంచినీటి పంపులను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • 🎂 **జన్మదిన వేడుకలు** 🎂 📍 సత్తుపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్ 3వ వార్డులో గౌరవ సత్తుపల్లి ఎమ్మెల్యే **శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారి జన్మదినం** సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. 🔹 ఈ కార్యక్రమం **సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రవి గారి ఆధ్వర్యంలో** జరిగింది. 🔹 **బొంతు సుమలత గారు** – సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 🔹 **చల్లగుళ్ళ కృష్ణయ్య గారు** – సత్తుపల్లి సొసైటీ అధ్యక్షులు 🔹 ** నాగుల నాగేశ్వరరావు** – 3వ వార్డు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 🔹 **ఖమ్మంపాటి కాంతారావు** 🔹 **బీర అబ్బులు** 🔹 **మల్లెల అనిల్** 🔹 **కశిని శ్రీను** 🔹 **జొన్నలగడ్డ రాజు** 🔹 **సాయి శ్రీనివాస్** 🔹 **దాట్ల రాము** 🔹 3వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు 🔹 గ్రామ ప్రజలు 🔹 తదితరులు పాల్గొన్నారు. 🎉💐
    1
    🎂 **జన్మదిన వేడుకలు** 🎂
📍 సత్తుపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్ 3వ వార్డులో గౌరవ సత్తుపల్లి ఎమ్మెల్యే **శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారి జన్మదినం** సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది.
🔹 ఈ కార్యక్రమం **సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రవి గారి ఆధ్వర్యంలో** జరిగింది.
🔹 **బొంతు సుమలత గారు** – సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్
🔹 **చల్లగుళ్ళ కృష్ణయ్య గారు** – సత్తుపల్లి సొసైటీ అధ్యక్షులు
🔹 ** నాగుల నాగేశ్వరరావు** – 3వ వార్డు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
🔹 **ఖమ్మంపాటి కాంతారావు**
🔹 **బీర అబ్బులు**
🔹 **మల్లెల అనిల్**
🔹 **కశిని శ్రీను**
🔹 **జొన్నలగడ్డ రాజు**
🔹 **సాయి శ్రీనివాస్**
🔹 **దాట్ల రాము**
🔹 3వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు
🔹 గ్రామ ప్రజలు
🔹 తదితరులు పాల్గొన్నారు. 🎉💐
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    13 min ago
  • ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టిన రోజు సందర్భంగా విద్యార్ధులకు,బుక్స్ యూనిఫాం పంపిణీ..! ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్.. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదవ తరగతి నుండి డిగ్రీ చదివే విద్యార్థినీ విద్యార్థులకు బ్యాగ్స్, పుస్తకాలు, ఫ్యాడ్స్ యూనిఫామ్స్ పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్
    1
    ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టిన రోజు సందర్భంగా విద్యార్ధులకు,బుక్స్ యూనిఫాం పంపిణీ..!
ఖమ్మం జిల్లా 
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్..
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదవ తరగతి నుండి డిగ్రీ చదివే విద్యార్థినీ విద్యార్థులకు బ్యాగ్స్, పుస్తకాలు, ఫ్యాడ్స్  యూనిఫామ్స్ పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లపై వరంగల్ సిపి శ్వేతతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ హనుమకొండ జిల్లా పరకాలలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం పరకాలలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ప్రతిపాదిత హెలిప్యాడ్ కోసం లలితా కన్వెన్షన్ హాల్ సమీపంలోని స్థలాన్ని, సభా వేదిక, వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాలను పరిశీలించారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, సీఎం పర్యటనలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, ఆసుపత్రి ప్రారంభోత్సవం, సభా వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హెలిప్యాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్రణాళిక అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్రణాళికపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్ బాబు, ఈఈ దేవిక, టీడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ క్రాంతి కుమార్, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లపై వరంగల్ సిపి శ్వేతతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ జిల్లా పరకాలలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
మంగళవారం పరకాలలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ప్రతిపాదిత హెలిప్యాడ్ కోసం లలితా కన్వెన్షన్ హాల్ సమీపంలోని స్థలాన్ని, సభా వేదిక, వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాలను పరిశీలించారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, సీఎం పర్యటనలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, ఆసుపత్రి ప్రారంభోత్సవం, సభా వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హెలిప్యాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్రణాళిక అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్రణాళికపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి,  ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్ బాబు, ఈఈ దేవిక, టీడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ క్రాంతి కుమార్, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    9 min ago
  • మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన పనులు.. మధ్యలోనే మాయం! ఖమ్మం బైపాస్‌పై ప్రజల అవస్థలు ఖమ్మం బైపాస్‌ రోడ్డుపై అసంపూర్తి కాలువ పనులతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు ప్రధాన రహదారిగా ఉన్న బైపాస్‌ రోడ్డు పక్కన కాలువ మరమ్మతు పనులను ప్రారంభించి.. అధికారులు, పాలకులు మధ్యలోనే వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి నోచుకోని స్థితిలోనే పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం పనులు పూర్తయిన తర్వాత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో.. రోడ్డు పక్కన మట్టి, నిర్మాణ సామగ్రి పేరుకుపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాపర్తి నగర్‌ వైపు వెళ్లే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఈ అసంపూర్తి కాలువ పనులను వెంటనే పూర్తి చేసి.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన పనులు.. మధ్యలోనే మాయం! ఖమ్మం బైపాస్‌పై ప్రజల అవస్థలు
ఖమ్మం బైపాస్‌ రోడ్డుపై అసంపూర్తి కాలువ పనులతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఖమ్మం జిల్లాకు ప్రధాన రహదారిగా ఉన్న బైపాస్‌ రోడ్డు పక్కన కాలువ మరమ్మతు పనులను ప్రారంభించి.. అధికారులు, పాలకులు మధ్యలోనే వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి నోచుకోని స్థితిలోనే పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగం పనులు పూర్తయిన తర్వాత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో.. రోడ్డు పక్కన మట్టి, నిర్మాణ సామగ్రి పేరుకుపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాపర్తి నగర్‌ వైపు వెళ్లే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఈ అసంపూర్తి కాలువ పనులను వెంటనే పూర్తి చేసి.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • *ఖబర్దార్ పిడమర్తి రవి* - *సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్.*
    1
    *ఖబర్దార్ పిడమర్తి రవి* - *సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్.*
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    14 min ago
  • ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మోటార్లు, స్టార్టర్ బాక్సులతో పాటు ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ను చోరీ చేస్తున్నారు.రూరల్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి పది మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
    1
    ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం
ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మోటార్లు, స్టార్టర్ బాక్సులతో పాటు ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ను చోరీ చేస్తున్నారు.రూరల్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి పది మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.