Shuru
Apke Nagar Ki App…
Manueli bimmaiah Manueli Bimmaiah
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్ గీతా నగర్ చౌరస్తాలో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు.1
- ఈరోజు వారి పంట పొతలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన అజీజ్ పటేల్లాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు పరిశీలించి ధైర్యం కల్పించడం జరిగింది. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం కచ్చితంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేయడం జరిగింది.1
- గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.1
- Post by Rajitha Antharpula9
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం, మండలాల్లో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో కార్యాలయాలకు, దుకాణాలకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు వెళ్ళకుంటే మంచిదని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను వెంట ఉంచుకోవాలని ప్రభుత్వ వైద్యులు కోరారు.1
- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన బీకాం రెండో సంవత్సరం విద్యార్థి సూరజ్ (22) మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్, తన నలుగురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని నియంత్రణ విధానాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అగ్నిని ఆర్పే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఓ మధన్, సునీల్ కుమార్, హరిసింగ్ పాల్గొన్నారు.1
- అగ్నిమాపక వారోత్సవాల్లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాన్స్టెస్టసన్ కార్యక్రమాన్ని నిర్వహించగా నీటితో పాలు రకాల విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.3
- పత్రికా ప్రకటన జన్మదినోత్సవం పురస్కరించుకొని అదిలాబాద్ కన్యకా పరమేశ్వరి దేవాలయం లో 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు కొనసాగును... అందులో భాగంగా నవరాత్రుల కార్యక్రమాలు.. వివిధ రూపాలలో అమ్మవారీ అలంకరణ జరుగుతుంది.... ప్రతి దినం ఉదయం 7 గంటల నుండి 11:00 వరకు సామూహిక అభిషేకం కార్యక్రమం జరుగును...... ప్రతిరోజు మధ్యాహ్నం మహా ప్రసాదం ఉంటుంది..... అదేవిధంగా 19వ తేదీ నాడు ఆదివారం ఉదయం పది గంటల కు నూతన ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం కలదు...... వార్డ్ నెంబర్ 27 బ్రాహ్మణవాడ.... ఈ నవరాత్రులలో భాగంగా 22వ తేదీ బుధవారం నాడు కన్యకా పరమేశ్వరి దేవి సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇచ్చును... ఇదే రోజునాడు ఉదయం 11 గంటలకు సామూహికంగా వేద పండితులచే అక్షరాభ్యాసం కార్యక్రమం ఉంటుంది.... ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఏ కులం ఆయనను.. హిందూమతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలరు.... ఈ అక్షరాభ్యాసం కార్యక్రమంలో అమ్మవారి సమక్షంలో పూజ చేసిన పలక బల్పము ఇవన్నీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా ఇవ్వబడును.... ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మరియు మన ఎమ్మెల్యే శ్రీ పాయల శంకర్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు.. కంది శ్రీనివాస్ రెడ్డి గారు.. సోయం బాబూరావు గారు.. మనీషా మేడం గారు....2