logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సదర్ మార్ట్ నీళ్ల కోసం రైతులు ఎదురుచూపులు ఇప్పటికే నాలుగు మడలు సిద్ధం చేసుకుని నీరు కోసం ఎదురుచూస్తున్న సదర్ మార్ట్ రైతంగం రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మేడమ్ పెళ్లి సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు వానకాలం ప్రారంభమై నెలకు పై కావడంతో వరి సాగు పంటకు ఆలస్యం అవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ఆయకట్టు కు నిరంతంచాలని కోరుతున్నారు ఆయకట్టుకు సుమారు 15 వేల ఎకరాలు ఉండటంతో ఇప్పటికే నారుమండలం సైతం సిద్ధం చేసుకున్నారు నీటిని విడుదల చేస్తే పంట సాగు చేసుకుంటామని రైతన్నలు వేడుకుంటున్నారు

14 hrs ago
user_Dasari krishna murthy
Dasari krishna murthy
ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
14 hrs ago

సదర్ మార్ట్ నీళ్ల కోసం రైతులు ఎదురుచూపులు ఇప్పటికే నాలుగు మడలు సిద్ధం చేసుకుని నీరు కోసం ఎదురుచూస్తున్న సదర్ మార్ట్ రైతంగం రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మేడమ్ పెళ్లి సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు వానకాలం ప్రారంభమై నెలకు పై కావడంతో వరి సాగు పంటకు ఆలస్యం అవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ఆయకట్టు కు నిరంతంచాలని కోరుతున్నారు ఆయకట్టుకు సుమారు 15 వేల ఎకరాలు ఉండటంతో ఇప్పటికే నారుమండలం సైతం సిద్ధం చేసుకున్నారు నీటిని విడుదల చేస్తే పంట సాగు చేసుకుంటామని రైతన్నలు వేడుకుంటున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు. వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్, తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని
బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు.
వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్,  తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
  • ఖానాపూర్ నారు మడిని సిద్ధం చేసుకుంటున్న మహిళా రైతు ఖానాపూర్ గత వానకాలం యాసంకగి కాలం పంటలు దిగుబడి రాలేక నష్టపోయామని మహిళ రైతు తెలియజేశారు ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా తొందరగా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని నీటిపారుదల శాఖ అధికారులను మహిళ రైతు పేర్కొన్నారు
    1
    ఖానాపూర్       
   నారు మడిని సిద్ధం చేసుకుంటున్న మహిళా రైతు 
ఖానాపూర్  గత వానకాలం యాసంకగి కాలం పంటలు దిగుబడి రాలేక నష్టపోయామని మహిళ రైతు  తెలియజేశారు ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా  తొందరగా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని నీటిపారుదల శాఖ అధికారులను మహిళ రైతు పేర్కొన్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • సదర్ మార్ట్ నీళ్ల కోసం రైతులు ఎదురుచూపులు ఇప్పటికే నాలుగు మడలు సిద్ధం చేసుకుని నీరు కోసం ఎదురుచూస్తున్న సదర్ మార్ట్ రైతంగం రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మేడమ్ పెళ్లి సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు వానకాలం ప్రారంభమై నెలకు పై కావడంతో వరి సాగు పంటకు ఆలస్యం అవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ఆయకట్టు కు నిరంతంచాలని కోరుతున్నారు ఆయకట్టుకు సుమారు 15 వేల ఎకరాలు ఉండటంతో ఇప్పటికే నారుమండలం సైతం సిద్ధం చేసుకున్నారు నీటిని విడుదల చేస్తే పంట సాగు చేసుకుంటామని రైతన్నలు వేడుకుంటున్నారు
    1
    సదర్ మార్ట్ నీళ్ల కోసం రైతులు ఎదురుచూపులు 
ఇప్పటికే నాలుగు మడలు సిద్ధం చేసుకుని నీరు కోసం ఎదురుచూస్తున్న సదర్ మార్ట్ రైతంగం రైతంగం
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మేడమ్ పెళ్లి సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు వానకాలం ప్రారంభమై నెలకు పై కావడంతో వరి సాగు పంటకు ఆలస్యం అవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ఆయకట్టు కు నిరంతంచాలని కోరుతున్నారు ఆయకట్టుకు సుమారు 15 వేల ఎకరాలు ఉండటంతో ఇప్పటికే నారుమండలం సైతం సిద్ధం చేసుకున్నారు నీటిని విడుదల చేస్తే పంట సాగు చేసుకుంటామని రైతన్నలు వేడుకుంటున్నారు
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
  • బోధన్‌లో కౌన్సిలర్ సమీర్‌కు చెందిన మేకల ఫారం ఘటనపై బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎంఐఎం నిరసన బోధన్‌లో కౌన్సిలర్ సమీర్‌కు చెందిన మేకల ఫారంపై జరిగినట్లు ఆరోపిస్తున్న విధ్వంసం, మేకల చోరీ ఘటనపై ఎంఐఎం నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అదృశ్యమైన కొన్ని మేకలు కాంగ్రెస్‌కు చెందిన ఓ కో-ఆప్షన్ సభ్యుడి నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద లభించాయని కౌన్సిలర్ సమీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
    1
    బోధన్‌లో కౌన్సిలర్ సమీర్‌కు చెందిన మేకల ఫారం ఘటనపై బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎంఐఎం నిరసన
బోధన్‌లో కౌన్సిలర్ సమీర్‌కు చెందిన మేకల ఫారంపై జరిగినట్లు ఆరోపిస్తున్న విధ్వంసం, మేకల చోరీ ఘటనపై ఎంఐఎం నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అదృశ్యమైన కొన్ని మేకలు కాంగ్రెస్‌కు చెందిన ఓ కో-ఆప్షన్ సభ్యుడి నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద లభించాయని కౌన్సిలర్ సమీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    47 min ago
  • ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ సర్వీస్ రావాలి: ఎమ్మెల్యే సూచన ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగే అటవీశాఖ అధికారులలో ఫ్రెండ్లీ సర్వీస్ రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో అటవీశాఖ పనితీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలుప్ చేశారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో అడవులలో ఉండే ఆదివాసులతో పాటు ప్రజలతో మంచిగా వ్యవహరించే తీరును నేర్చుకోవాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్పంచులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తుంటారని, వారికి మర్యాదనిస్తూ అధికారులు సమాధానం చెప్పాలని సూచించారు. అటవీశాఖ శాఖ అధికారుల పనితీరుతో పాటు వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చి ప్రజల మద్దతు పొందాలని ఆయన కోరారు.
    1
    ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ సర్వీస్ రావాలి: ఎమ్మెల్యే సూచన
ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగే అటవీశాఖ అధికారులలో ఫ్రెండ్లీ సర్వీస్ రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో అటవీశాఖ పనితీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలుప్ చేశారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో అడవులలో ఉండే ఆదివాసులతో పాటు ప్రజలతో మంచిగా వ్యవహరించే తీరును నేర్చుకోవాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్పంచులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తుంటారని, వారికి మర్యాదనిస్తూ అధికారులు సమాధానం చెప్పాలని సూచించారు. అటవీశాఖ శాఖ అధికారుల పనితీరుతో పాటు వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చి ప్రజల మద్దతు పొందాలని ఆయన కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • నిర్మల్‌లో రహదారి ప్రమాదాల నివారణకు మున్సిపల్ చర్యలు.... నిర్మల్ పట్టణంలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారులపై సంచరిస్తున్న పశువులను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. రహదారులపై పశువులు వదలకుండా ఉండాలని పశువుల యజమానులకు గతంలోనే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పశువులను రోడ్లపైకి వదులుతున్న యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు. రహదారిపై పశువులను వదిలిన ప్రతి యజమానికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. ఇకపై పశువులు రహదారులపైకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తామని యజమానులను హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
    1
    నిర్మల్‌లో రహదారి ప్రమాదాల నివారణకు మున్సిపల్ చర్యలు....
నిర్మల్ పట్టణంలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారులపై సంచరిస్తున్న పశువులను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. రహదారులపై పశువులు వదలకుండా ఉండాలని పశువుల యజమానులకు గతంలోనే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పశువులను రోడ్లపైకి వదులుతున్న యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు. రహదారిపై పశువులను వదిలిన ప్రతి యజమానికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. ఇకపై పశువులు రహదారులపైకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తామని యజమానులను హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
  • విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనుపరావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భాజపా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీసి అనంతరం ఆర్డిఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అనుప్ రావు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులతో చలగాటమాడుతుందని వెంటనే విడుదల చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    1
    విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనుపరావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భాజపా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీసి అనంతరం ఆర్డిఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అనుప్ రావు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులతో చలగాటమాడుతుందని వెంటనే విడుదల చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_Vsk
    Vsk
    Metpalli, Jagitial•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.