ఉపాధి హామీ పనులలో పెండింగ్ లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలి : దండెంపల్లి సరోజ ఉపాధి హామీ పనులలో పెండింగ్ లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23 న నల్గొండ ఎంపీడీవో కార్యాలయం ముందు జరుగు ధర్నా జయప్రదం చేయాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ మండలం దండెంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ.. వాపక్షం పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పనిలేని కాలంలో పేదలకు ఉపాధి కల్పించే విధంగా వందరోజుల పనిని కల్పించడం జరిగిందని అన్నారు. నేడు బిజెపి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబిజీ రాంజీ అనే పథకాన్ని తీసుకువచ్చి కేంద్రం 60 శాతం రాష్ట్రం 40% నిధులు ఇవ్వాలని నిబంధనతో పథకం రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 90 శాతం కేంద్రం ,రాష్ట్రాలు 10% మాత్రమే నిధులు కేటాయించిదని ఇప్పుడు రాష్ట్రాల వాటా పెంచడంతో నిధుల లేమితో రాష్ట్రాలు పథకాన్ని నిర్వహించలేని పరిస్థితి దాపురించిందని జనవరి నుండి పనులు చేస్తున్న బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని ఈనెల 23 గురువారం రోజు నల్గొండ ఎంపీడీవో కార్యాలయం ముందు జరుగుతున్న ధర్నాలో మండలంలోని అన్ని గ్రామాల ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గోలి నరసింహ, చింత లింగయ్య, మేడ గోపాల్ , మేక మల్లమ్మ ఎల్లమ్మ, పిట్టల వెంకటమ్మ పల్లెబోయిన జయమ్మ , మంగమ్మ ,గండమల్ల రాములు చింత ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులలో పెండింగ్ లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలి : దండెంపల్లి సరోజ ఉపాధి హామీ పనులలో పెండింగ్ లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23 న నల్గొండ ఎంపీడీవో కార్యాలయం ముందు జరుగు ధర్నా జయప్రదం చేయాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ మండలం దండెంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ.. వాపక్షం పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పనిలేని కాలంలో పేదలకు ఉపాధి కల్పించే విధంగా వందరోజుల పనిని కల్పించడం జరిగిందని అన్నారు. నేడు బిజెపి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబిజీ రాంజీ అనే పథకాన్ని తీసుకువచ్చి కేంద్రం 60 శాతం రాష్ట్రం 40% నిధులు ఇవ్వాలని నిబంధనతో పథకం రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 90 శాతం కేంద్రం ,రాష్ట్రాలు 10% మాత్రమే నిధులు కేటాయించిదని ఇప్పుడు రాష్ట్రాల వాటా పెంచడంతో నిధుల లేమితో రాష్ట్రాలు పథకాన్ని నిర్వహించలేని పరిస్థితి దాపురించిందని జనవరి నుండి పనులు చేస్తున్న బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని ఈనెల 23 గురువారం రోజు నల్గొండ ఎంపీడీవో కార్యాలయం ముందు జరుగుతున్న ధర్నాలో మండలంలోని అన్ని గ్రామాల ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గోలి నరసింహ, చింత లింగయ్య, మేడ గోపాల్ , మేక మల్లమ్మ ఎల్లమ్మ, పిట్టల వెంకటమ్మ పల్లెబోయిన జయమ్మ , మంగమ్మ ,గండమల్ల రాములు చింత ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
- దేవరకొండ లో లక్కీ భాస్కర్ సినిమా రేంజ్లో ఎస్బీఐలో రూ.2.65 కోట్ల స్కామ్ బట్టబయలు.!_ బ్యాంక్లో పనిచేస్తూనే ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన లెండల చక్రపాణి మాస్టర్ ప్లాన్... సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి స్కెచ్... కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కేటుగాళ్ల సహకారంతో కోట్ల రూపాయల మోసం... నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ మార్చి ఖాతాలు ఖాళీ చేసిన ముఠా... యోనో యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి నగదుగా మార్చిన కేటుగాళ్లు... దేవరకొండ పోలీసుల దర్యాప్తుతో నలుగురు అరెస్ట్.. లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు, కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కటకటాల వెనుకకు... రూ.2.42 కోట్ల నగదు, 6 మొబైళ్లు, ల్యాప్టాప్ స్వాధీనం... ఖాతాదారుడికి ఈమెయిల్ అలర్ట్తో బయటపడిన భారీ స్కామ్! ఎస్పీ *శరద్ చంద్ర పవార్* ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం... దేవరకొండ DSP *ఎం.వి. శ్రీనివాసరావు* పర్యవేక్షణలో ఆపరేషన్ సక్సెస్... ఇన్స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో కేసు ను చొక్కా చౌక్యంగా వ్యవహరించి చేదించిన ఎస్ఐ బి. రాజు, పీసీలు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా కీలక పాత్ర... హెచ్జీలు సింహాద్రి, సోమ్లా సహకారంతో ముఠా పట్టివేత... కేసు చేతన చేసిన సిబ్బందిని అభినందించిన *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..* ఎస్పీ హెచ్చరిక: ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ కూడా లింకు చేసి ఉంచండి...1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.1
- ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్1
- जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations51911
- మెడికల్ డివైసెస్ ఉత్పాదనకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో తనను కలిసిన నెదర్లాండ్స్ మెడిటెక్ పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీల పరిశోధకులతో ఆయన మాట్లాడారు. వెద్య సంబంధ పరిశోధనలు, కృత్రిమ మేథ అభివృద్ధి, పరికరాల ఉత్పత్తికి తెలంగాణా అత్యంత అనుకూలమని ఆయన వివరించారు. ఔషధాల ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీలో తమ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఇక్కడి బయోటెక్ కంపెనీలు 120 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఆధునిక వైద్య పరికరాల ఉత్పత్తిలో తెలంగాణాను కేంద్ర స్థానం (హబ్)గా తీర్చిదిద్దేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు. విద్యుత్తు, నీరు, భూమి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్య రంగంలో కృత్రిమ మేథ వినియోగించే విషయంలో చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. ఇమేజింగ్ టెక్నాలజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొరత లేదని, ప్రపంచంలోని అతి పెద్ద ఔషద, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ఇక్కడి యూనివర్సిటీలతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నెదర్లాండ్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిలర్ జాన్ రెయింట్ స్మిట్ (Jan Reint Smit) ఆధ్వర్యంలో వివిధ రంగాల నిపుణుల బృందం సమావేశంలో పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటి సలహాదారు ఐ.సాయికృష్ణ టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ రఘురామ శర్మ, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.1
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మన్ననూరు పీహెచ్సీని సందర్శించిన ఆయన లేబర్ రూమ్, ల్యాబ్, మెడికల్ స్టోర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీ సంఖ్యను పెంచి, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.1
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1