Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లా : జిల్లాలో అక్రమ గోవదను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్దళ్ నాయకులు పోలీసులకు వినతిపత్రం కామారెడ్డి జిల్లాలో అక్రమ గోవధను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ నాయకులు పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. గోమాతను ఆరాధ్యదైవంగా | పూజిస్తామని, వ్యవసాయం, ఆరోగ్యానికి గోవులు ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. రానున్న పండుగల నేపథ్యంలో అక్రమ రవాణా, గోవధ పెరిగే అవకాశం ఉందని.. అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గోవులను తరలించే వారిపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
Narmala Swapna
కామారెడ్డి జిల్లా : జిల్లాలో అక్రమ గోవదను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్దళ్ నాయకులు పోలీసులకు వినతిపత్రం కామారెడ్డి జిల్లాలో అక్రమ గోవధను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ నాయకులు పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. గోమాతను ఆరాధ్యదైవంగా | పూజిస్తామని, వ్యవసాయం, ఆరోగ్యానికి గోవులు ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. రానున్న పండుగల నేపథ్యంలో అక్రమ రవాణా, గోవధ పెరిగే అవకాశం ఉందని.. అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గోవులను తరలించే వారిపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- నిజాంసాగర్ మండలం : మంగ్లూరు నుంచి మోడీ బహిరంగ సభకు భారీగా తరలిన బిజెపి శ్రేణులు, మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. గ్రామ సర్పంచ్ నర్మల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పయనమయ్యారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ప్రధాని సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలాయి.1
- 17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రచురణార్థం మెదక్ 10 మే,2026 ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్ *కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిని మిల్లులకు తరలించాలి..* 86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు *ధాన్యాన్ని విల్లులకు తలించేందకు ప్రత్యేక చర్యలు* ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ తెలుసుకొని... నిల్వలు లేకుండా వెను వెంటనే విల్లులకు తలించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. వేగవంతంగా రవాణా చేయుటకు దిశనిర్ధేశం చేశారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లారీ ల పైనే ఆధార పడకుండా అవసరమైతే ఇతరాత్ర వాహనాలను ద్వారా మిల్లులకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోజువారిగా కేంద్రాలో గల నిల్వలు, మిల్లులకు తరలించిన వివరాల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు ధాన్యాన్ని మిల్లులకు తరలించుటలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్రమించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తెవాలన్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివరాలు , మిల్లులకు రవాణా చేస్తున్న ధాన్యం వివరాలను సంబంధిత రిజిష్టర్లలో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు1
- చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.1
- మోర్తాడ్లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం... బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు.... ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్కు రూ. 500 నష్ట పోతున్నారు. రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్కు 12.5 కిలోల దోపిడీ... నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు... జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి? వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు. మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి. గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి. తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి. దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.1
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- కామారెడ్డి జిల్లా : జిల్లాలో అక్రమ గోవదను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్దళ్ నాయకులు పోలీసులకు వినతిపత్రం కామారెడ్డి జిల్లాలో అక్రమ గోవధను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ నాయకులు పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. గోమాతను ఆరాధ్యదైవంగా | పూజిస్తామని, వ్యవసాయం, ఆరోగ్యానికి గోవులు ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. రానున్న పండుగల నేపథ్యంలో అక్రమ రవాణా, గోవధ పెరిగే అవకాశం ఉందని.. అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గోవులను తరలించే వారిపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు.1