logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పేదల ఇండ్ల స్థలాలు పేదలకే ఇవ్వాలి - పేదల ఇళ్ల స్థలాలపై ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేయాలి - జిల్లా కలెక్టర్‌కు వంగా గీత వినతి ​పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో పేద ప్రజలకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాల భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తూ (అన్యాక్రాంతం) జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పిఠాపురం ఇన్‌ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్ జె.యు.ఎన్. హరెంధిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. పిఠాపురం రూరల్, పట్టణం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో సుమారు 400 ఎకరాల భూమిని సేకరించి, 50 లేఅవుట్లలో 10,000 మంది నిరుపేదలకు గతంలో పట్టాలు పంపిణీ చేశారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయి, కొందరు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టారన్నారు. ​ప్రస్తుత ప్రభుత్వం ఈ లేఅవుట్లలోని భూములను ఇతర ప్రభుత్వ కట్టడాలకు కేటాయించడంపై వంగా గీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ​పిఠాపురం పట్టణంలోని "మసీదు మాన్యం" లేఅవుట్‌లో 250 మంది లబ్ధిదారులకు చెందిన 5 ఎకరాల భూమిని కాలేజీ నిర్మాణం కోసం మళ్లించడం, ​నరసింగపురం లేఅవుట్‌లో 1000 మంది లబ్ధిదారులకు చెందిన 20 ఎకరాల భూమిని పాఠశాల నిర్మాణం కోసం కేటాయించడం వంటి చర్యలు పేదలను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని లేఅవుట్లలో రోడ్లు, నీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, ఎన్నికల తర్వాత కొత్త ఇళ్ల మంజూరు నిలిచిపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ​పేద వర్గాల పట్ల దయతో వ్యవహరించి,వారికి కేటాయించిన భూములను అన్యాక్రాంతం చేయకుండా చూడాలని కోరారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించి, పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణాలను మంజూరు చేయాలని ఆమె విన్నవించారు.

5 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Local News Reporter Pithapuram, Kakinada•
5 hrs ago
942a4a7e-5b9f-43de-8c76-27e8b465c5b4

పేదల ఇండ్ల స్థలాలు పేదలకే ఇవ్వాలి - పేదల ఇళ్ల స్థలాలపై ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేయాలి - జిల్లా కలెక్టర్‌కు వంగా గీత వినతి ​పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో పేద ప్రజలకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాల భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తూ (అన్యాక్రాంతం) జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పిఠాపురం ఇన్‌ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్ జె.యు.ఎన్. హరెంధిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. పిఠాపురం రూరల్, పట్టణం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో సుమారు 400 ఎకరాల భూమిని సేకరించి, 50 లేఅవుట్లలో 10,000 మంది నిరుపేదలకు గతంలో పట్టాలు పంపిణీ చేశారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయి, కొందరు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టారన్నారు. ​ప్రస్తుత ప్రభుత్వం ఈ లేఅవుట్లలోని భూములను ఇతర ప్రభుత్వ కట్టడాలకు కేటాయించడంపై వంగా గీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ​పిఠాపురం పట్టణంలోని "మసీదు మాన్యం" లేఅవుట్‌లో 250 మంది లబ్ధిదారులకు చెందిన 5 ఎకరాల భూమిని కాలేజీ నిర్మాణం కోసం మళ్లించడం, ​నరసింగపురం లేఅవుట్‌లో 1000 మంది లబ్ధిదారులకు చెందిన 20 ఎకరాల భూమిని పాఠశాల నిర్మాణం కోసం కేటాయించడం వంటి చర్యలు పేదలను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని లేఅవుట్లలో రోడ్లు, నీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, ఎన్నికల తర్వాత కొత్త ఇళ్ల మంజూరు నిలిచిపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ​పేద వర్గాల పట్ల దయతో వ్యవహరించి,వారికి కేటాయించిన భూములను అన్యాక్రాంతం చేయకుండా చూడాలని కోరారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించి, పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణాలను మంజూరు చేయాలని ఆమె విన్నవించారు.

More news from Kakinada and nearby areas
  • పిఠాపురం: పిఠాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి, పారిశుధ్య పనుల పురోగతిని పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ సుందరీకరణతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. పట్టణంలోని ప్రధాన రహదారులు,కాలనీల్లో పారిశుధ్య పరిస్థితులను పీడీ స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీ వ్యవస్థలు,నిత్యం జరిగే చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించి ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాధవపురం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన పీడీ వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టిడ్కో నివాస సముదాయాలను సందర్శించి,అక్కడ లబ్ధిదారులకు అందుతున్న తాగునీరు,విద్యుత్ వంటి ప్రాథమిక వసతులపై సమీక్ష నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా తక్షణమే మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు,మరియు శానిటేషన్ సిబ్బంది ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
    3
    పిఠాపురం: పిఠాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి, పారిశుధ్య పనుల పురోగతిని పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ సుందరీకరణతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. పట్టణంలోని ప్రధాన రహదారులు,కాలనీల్లో పారిశుధ్య పరిస్థితులను పీడీ స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీ వ్యవస్థలు,నిత్యం జరిగే చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించి ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాధవపురం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన పీడీ వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టిడ్కో నివాస సముదాయాలను సందర్శించి,అక్కడ లబ్ధిదారులకు అందుతున్న తాగునీరు,విద్యుత్ వంటి ప్రాథమిక వసతులపై సమీక్ష నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా తక్షణమే మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు,మరియు శానిటేషన్ సిబ్బంది ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    4 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *"స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర"* కార్యక్రమంలో భాగంగా ఈరోజు (శనివారం) కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ ల నందు ఆయా స్టేషన్ సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.  జిల్లా పోలీసు ప్రధాన కేంద్రమైన కాకినాడలో జిల్లా ఎంఎం*ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్, ఐపీఎస్* ఏ ఆర్ క్వార్టర్స్ ప్రాంతంలో   స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర  కార్యక్రమంలో పాల్గొని, మొక్కను నాటి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సిబ్బంది మరియు అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి,  పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి శ్రమ దానం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ S. శ్రీనివాసరావు, ఎస్బి డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, డిఎస్పీ (ఏ ఆర్) శ్రీ వి జి శ్రీహరి రావు, MT రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె వెంకటరావు, కంపెనీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్ నరసింహ మూర్తి,  కాకినాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం అప్పలనాయుడు,  పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీ పి సునీల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. @జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *"స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర"* కార్యక్రమంలో భాగంగా ఈరోజు (శనివారం) కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ ల నందు ఆయా స్టేషన్ సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.  జిల్లా పోలీసు ప్రధాన కేంద్రమైన కాకినాడలో జిల్లా ఎంఎం*ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్, ఐపీఎస్*  ఏ ఆర్ క్వార్టర్స్ ప్రాంతంలో   స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర  కార్యక్రమంలో పాల్గొని, మొక్కను నాటి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 
అనంతరం జిల్లా ఎస్పీ  సిబ్బంది మరియు అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి,  పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి శ్రమ దానం లో పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ S. శ్రీనివాసరావు, ఎస్బి డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, డిఎస్పీ (ఏ ఆర్) శ్రీ వి జి శ్రీహరి రావు, MT రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె వెంకటరావు, కంపెనీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్ నరసింహ మూర్తి,  కాకినాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం అప్పలనాయుడు,  పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీ పి సునీల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 
@జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ.
    user_P. Ashok
    P. Ashok
    Media company అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఇట్స్ మై ఎడిటింగ్ వీడియో
    1
    పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఇట్స్ మై ఎడిటింగ్ వీడియో
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
    2
    UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ ఒక నినాదంగానే ఉంది. ఇంతకాలానికి చట్టరూపం దాల్చుతోంది. ఇది దేశచరిత్రలో గొప్ప రోజు. మహిళాబిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మహిళల అభ్యున్నతి దిశగా అడుగులు వేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా మహిళలనే ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు మా జగనన్నే. మహిళల మీద దా*డులు, అత్యా*చారాలు, ఆత్మహ*త్యలు ఇవే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త #WomenReservationBill #YSRCPForWomen
    1
    చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ ఒక నినాదంగానే ఉంది. ఇంతకాలానికి చట్టరూపం దాల్చుతోంది. ఇది దేశచరిత్రలో గొప్ప రోజు. మహిళాబిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మహిళల అభ్యున్నతి దిశగా అడుగులు వేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా మహిళలనే ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు మా జగనన్నే. మహిళల మీద దా*డులు, అత్యా*చారాలు, ఆత్మహ*త్యలు ఇవే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత.
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త 
#WomenReservationBill
#YSRCPForWomen
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • छुट्टियों पर लगा महंगाई का ग्रहण, पश्चिम एशिया संकट से विमानन क्षेत्र को ₹18000 करोड़ का नुकसान क्या आप गर्मियों की छुट्टियां मनाने विदेश जाने की सोच रहे हैं? या हाल ही में आपने हवाई टिकट बुक करते समय अचानक बढ़े हुए किरायों पर गौर किया है? इसकी वजह सिर्फ घरेलू महंगाई नहीं है, बल्कि आपके शहर से हजारों किलोमीटर दूर चल रहा पश्चिम एशिया का तनाव है। इस अंतरराष्ट्रीय भू-राजनीतिक संकट ने न सिर्फ वैश्विक व्यापार को प्रभावित किया है, बल्कि भारतीय विमानन और पर्यटन क्षेत्र को भी सीधे तौर पर लगभग 18,000 करोड़ रुपये का भारी नुकसान पहुंचाया है। पश्चिम एशिया के तनाव से भारतीय एविएशन को कितना और कैसे नुकसान हुआ है? जवाब: पीएचडी चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री (पीएचडीसीसीआई) की एक ताजा रिपोर्ट के मुताबिक, इस संकट से भारत के एविएशन सेक्टर को करीब ₹18,000 करोड़ का नुकसान उठाना पड़ा है। दरअसल, पश्चिम एशिया के प्रमुख हवाई रास्ते (कॉरिडोर) दुनिया के सबसे व्यस्त मार्गों में से एक हैं, लेकिन युद्ध के कारण वहां उड़ान भरना सुरक्षित नहीं रह गया है। इसके चलते एयरलाइंस को उड़ानें रद्द करनी पड़ रही हैं या अपना रास्ता बदलना पड़ रहा है, जिससे उड़ान के समय में 2 से 4 घंटे तक की बढ़ोतरी हुई है।
    1
    छुट्टियों पर लगा महंगाई का ग्रहण, पश्चिम एशिया संकट से विमानन क्षेत्र को ₹18000 करोड़ का नुकसान
क्या आप गर्मियों की छुट्टियां मनाने विदेश जाने की सोच रहे हैं? या हाल ही में आपने हवाई टिकट बुक करते समय अचानक बढ़े हुए किरायों पर गौर किया है? इसकी वजह सिर्फ घरेलू महंगाई नहीं है, बल्कि आपके शहर से हजारों किलोमीटर दूर चल रहा पश्चिम एशिया का तनाव है। इस अंतरराष्ट्रीय भू-राजनीतिक संकट ने न सिर्फ वैश्विक व्यापार को प्रभावित किया है, बल्कि भारतीय विमानन और पर्यटन क्षेत्र को भी सीधे तौर पर लगभग 18,000 करोड़ रुपये का भारी नुकसान पहुंचाया है।
पश्चिम एशिया के तनाव से भारतीय एविएशन को कितना और कैसे नुकसान हुआ है?
जवाब: पीएचडी चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री (पीएचडीसीसीआई) की एक ताजा रिपोर्ट के मुताबिक, इस संकट से भारत के एविएशन सेक्टर को करीब ₹18,000 करोड़ का नुकसान उठाना पड़ा है। दरअसल, पश्चिम एशिया के प्रमुख हवाई रास्ते (कॉरिडोर) दुनिया के सबसे व्यस्त मार्गों में से एक हैं, लेकिन युद्ध के कारण वहां उड़ान भरना सुरक्षित नहीं रह गया है। इसके चलते एयरलाइंस को उड़ानें रद्द करनी पड़ रही हैं या अपना रास्ता बदलना पड़ रहा है, जिससे उड़ान के समय में 2 से 4 घंटे तक की बढ़ोतरी हुई है।
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    1 hr ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా  కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.  అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు.  ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.