logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: ఘనంగా UTF ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

1 hr ago
user_Vidya Sagar Tumu
Vidya Sagar Tumu
అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
48f63109-37d8-44d3-95d0-7279351e2b51

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: ఘనంగా UTF ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
    2
    UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    1
    ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా  కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.  అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు.  ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    2 hrs ago
  • దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. ఒక పౌరుడికి ఒకటే ఓటు కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    1
    దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. 
కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 
అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. 
ఒక పౌరుడికి ఒకటే ఓటు  కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది 
ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    user_P. Ashok
    P. Ashok
    Media company అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • డుంబ్రిగూడ మండలంలోని కించుమండలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణం యజమాని సాకేరి అర్జున్ ఇంటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాడేరు నుంచి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని కించుమండలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ దుకాణంలో మంటలు చెలరేగాయి.
దుకాణం యజమాని సాకేరి అర్జున్ ఇంటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
పాడేరు నుంచి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    23 min ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    1
    ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.