logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చొడ మండల కేంద్రంలో రూ. 21 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Ichoda, Adilabad•
1 hr ago
592892e6-3ad7-44d1-871e-de48e2bcb1e1
6813d5e8-a5e5-4947-9270-a588b185c27d
0c302ee4-d643-49eb-86df-611359d894c8

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చొడ మండల కేంద్రంలో రూ. 21 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. క్వింటాల్‌కు ₹500 నష్టపోవడంతో పాటు, 12.5 కిలోల తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు మోర్తాడ్‌లో భారీ నిరసనకు ఆయన పిలుపునిచ్చారు.
    1
    తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. క్వింటాల్‌కు ₹500 నష్టపోవడంతో పాటు, 12.5 కిలోల తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు మోర్తాడ్‌లో భారీ నిరసనకు ఆయన పిలుపునిచ్చారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
    1
    మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    22 hrs ago
  • బాసర రైల్వేస్టేషన్ వద్ద కారు బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. బాసర శివాజీ చౌక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు - బైక్ సోమవారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సు లో భైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
    1
    బాసర రైల్వేస్టేషన్ వద్ద కారు బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. 
బాసర శివాజీ చౌక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు - బైక్ సోమవారం మధ్యాహ్నం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సు లో భైన్సా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.  బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ₹9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, పరిశ్రమలు, రైల్వేలు, టెక్స్‌టైల్ పార్కులు వంటి కీలక రంగాల్లో ఈ పనులు రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇవ్వనున్నాయి. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర ముఖ్యమని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
    1
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ₹9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, పరిశ్రమలు, రైల్వేలు, టెక్స్‌టైల్ పార్కులు వంటి కీలక రంగాల్లో ఈ పనులు రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇవ్వనున్నాయి. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర ముఖ్యమని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    19 hrs ago
  • తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టౌన్)లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ గెజిట్ ప్రతులను దహనం చేశారు. ఈ చట్టాలు కార్మికుల దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులను బలహీనపరుస్తున్నాయని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు.
    1
    తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టౌన్)లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ గెజిట్ ప్రతులను దహనం చేశారు. ఈ చట్టాలు కార్మికుల దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులను బలహీనపరుస్తున్నాయని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • కొండగట్టు ​అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
    1
    కొండగట్టు ​అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
    user_Srinivas Nerella
    Srinivas Nerella
    Yoga instructor మల్యాల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణలోని పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శుభదినం కావడంతో పాటు, వేసవి సెలవులు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    1
    తెలంగాణలోని పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శుభదినం కావడంతో పాటు, వేసవి సెలవులు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    7 hrs ago
  • ఆదివారం సాయంత్రం ఆసిఫాబాద్‌లోని రాజీవ్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలిగింది, ప్రజల్లో ఆందోళన పెరిగింది. పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్‌ను నియంత్రించగా, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
    1
    ఆదివారం సాయంత్రం ఆసిఫాబాద్‌లోని రాజీవ్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలిగింది, ప్రజల్లో ఆందోళన పెరిగింది. పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్‌ను నియంత్రించగా, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    20 hrs ago
  • సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . దేశం కోసం,, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడంలేదు. నోర్లు మూతపడ్డాయెందుకు ప్రశ్నించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
    2
    సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ 
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . దేశం కోసం,, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడంలేదు. నోర్లు మూతపడ్డాయెందుకు ప్రశ్నించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.  నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే  బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    35 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.