Shuru
Apke Nagar Ki App…
ధర్మమే గెలిచింది తొర్రూర్ చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకున్న అనంతరం మీడియాతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.
Mogulagani Mahendar Mogulagani Mahendar
ధర్మమే గెలిచింది తొర్రూర్ చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకున్న అనంతరం మీడియాతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.
More news from Warangal and nearby areas
- వరంగల్ మండలం వర్ధన్నపేటలో రోడ్డు వెడల్పు చేయకుండా డివైడర్ ఏర్పాటు చేయడంతో మరో లారీ ప్రమాదానికి గురైంది. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో అనేక వాహనాలు ప్రమాదాలకు గురై ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేటలో వాల్ పోస్టర్ నర్సంపేట పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వరంగల్ రోడ్ చౌరస్తా కాకతీయ తోరణం వద్ద శుక్రవారం వాల్ పోస్టర్ను శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నంద్యాల వినయ్ రెడ్డి మాట్లాడుతూ— రాబోయే 19-02-2026 గురువారం రోజున మహబూబాబాద్ రోడ్, అరవింద్ రైస్ మిల్ సమీపంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మంది హాజరవుతారని, ఉదయం 9.30 గంటలకు ర్యాలీగా బయలుదేరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శివాజీ మహారాజ్ ధైర్యం, పరాక్రమం, స్వరాజ్య స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ, దేశభక్తి భావనలను ప్రజల్లో మరింత బలంగా నాటేందుకు ఈ విగ్రహ ఆవిష్కరణ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. నర్సంపేటలో కొలువు దీరనున్న శివాజీ విగ్రహం పట్టణానికి గర్వకారణంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే విగ్రహ ఆవిష్కరణ రోజున హిందూ బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పోలిపాక విజయ్, ఊరూగొండ శివ, శ్రీనివాస్, మల్లారెడ్డి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నాయకులు పట్టణ ప్రజలను కలిసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించారు. నర్సంపేటలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠతో ప్రాంతంలో సాంస్కృతిక–జాతీయ చైతన్యం మరింత పెరుగుతుందని, రాబోయే రోజుల్లో ఈ స్థలం ప్రజలకు ప్రేరణ కేంద్రంగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగిరిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. 12 వార్డులకు గాను తాము ఆరు వార్డులు గెలిచామని, కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచిందన్నారు. మరో ఒక వార్డును తాము గెలిచినా తారుమారు చేశారని ఆరోపించారు. నైతిక విజయం తమదేనని పేర్కొంటూ, ప్రస్తుత చైర్మన్ సారంగపాణి తమ వద్ద పని చేసిన పాత కార్యకర్తేనని చమత్కరించారు.1
- పోలీసు దాడిలో బాధితుడికి రెండు కళ్ళపై దాడి - కంటి చూపులకు దెబ్బ కంటి చూపు కనిపించని దారుణ వైనం *పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత కుటుంబ సభ్యుల వెల్లడి* మా వైపు ఏం చూస్తున్నావురా ఎవడ్రా నువ్వు.. నా కొడకా అంటూ ఇద్దరు పెట్రోలింగ్ లో ఉన్న కానిస్టేబుల్స్ అమాయకుడిపై రెచ్చిపోయారు. చెంపలపై నిర్దాక్షిణ్యంగా కొడుతూ అంతటితో ఆగకుండా అతని పోలీసు వాహనంలో బలవంతంగా వేసుకొని ఊరి బయటకు తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి రెండు కళ్ళు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కంటిచూపు కనిపించడం లేదు. పోలీసు శాఖకి మచ్చని తెచ్చే ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిన్న రాత్రి పరిగి రోడ్డులో శక్తి వైన్స్ వద్ద జరిగిన సంఘటన ఇది. పట్టణంలో బోరు మెకానిక్ గా పనిచేసుకుంటున్న కుమ్మరి వెంకటేష్ (ఇప్పలపల్లి) సాయంత్రం వేళ శక్తి వైన్ సోదరులకు వెళ్లి తనకోసం మందు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో షాపు యజమాని అక్కడికి వచ్చి ఆగిన పోలీస్ పెట్రోల్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్స్ కు ఒక కవర్ అందజేశారు. అయితే అతను మందు తీసుకొని వెళ్ళేటప్పుడు కుమ్మరి వెంకటేశ్ పోలీసులను చూశాడు. దీంతో కానిస్టేబుల్స్ ఏమనుకున్నారో తెలియదు కానీ మా వైపు ఏం చూస్తున్నావు రా..? ఎవడ్రా నువ్వు నా కొడకా అంటూ తమదైన స్టైల్ లో అమాయకుడి పై రెచ్చిపోయారు. కుమ్మరి వెంకటేష్ చెంపలను అక్కడే ఫటాఫట్ లాడించారు. అంతటితో ఆగకుండా అతడిని పోలీసు వాహనం ఎక్కించుకొని పరిగి రోడ్డులో హాజిపల్లి రోడ్డు వద్దకు నిర్మానుష ప్రాంతాల్లో తీసుకెళ్లి అతని చితకబాదారు. పోలీసు దాడిలో కుమ్మరి వెంకటేష్ కళ్ళపై దాడి జరగడంతో రెండు కళ్ళు ఎర్రటి రక్తం పేరుకొని కంటిచూపు పూర్తిగా మందగించిపోయింది. నిర్దాక్షిణ్యంగా కొట్టిన తర్వాత అతన్ని అక్కడే పరిగి రోడ్డులో వదిలేసి కనీసం మానవత్వం లేకుండా ఒక క్రూరత్వంతో అతన్ని విడిచి వచ్చేశారు. ఏం నేరం చేసింది లేదు.. పోలీసుల వైపు చూసిన పాపానికి కళ్ళు కనిపించకుండా దిగజారి కొట్టిన ఇద్దరు కానిస్టేబుల్స్ వ్యవహారంపై బాధితుడు కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అయితే బాధితుడు కుమ్మరి వెంకటేష్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంటి వైద్యులకు చూపించారు. అమాయకుడి పై దాడికి పాల్పడ్డ ఇద్దరు కానిస్టేబుల్ లపై కేసు నమోదు చేసి వెంటనే శాఖపరమైన చర్య తీసుకోవాలని బాధితుడి కుమారుడు పోలీసు ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు. నిన్న జరిగిన ఈత సంఘం ఆలస్యంగా వెలుగు చూడడంతో సంఘటనను స్థానిక మీడియా దృష్టికి బాధితులు తీసుకొచ్చారు..1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగుల గూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి *కామ్రేడ్ ఎస్కే సాబీర్ పాషా* నాయకత్వంలో పాయకారి యానం బైలు,శాతకొండ రేంజ్ పరిధి వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ) గారిని కలిసి ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని 2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని ఎఫ్డిఓ బాబుని కోరారు.తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.3
- తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.2
- _తొర్రూరు మున్సిపాలిటీ కోల్పోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు_ _తీవ్ర ఉద్రిక్తతల మధ్య దయాకర్రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు లింపు_ _మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన ఎర్రబెల్లి దయాకర్రావు_ _కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలి అంటూ దయాకర్రావు కంటతడి_ _రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారంటూ ఎర్రబెల్లి దయాకర్రావు ఆవేదన_1
- TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టిన రోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో ఆయన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. అభిమాని రూపొందించిన ఈ శిల్పం గులాబీ రంగులో మెరిసిపోతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరించుకుంటూ రూపొందించిన ఈ కళాఖండం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.1
- వరంగల్: వర్ధన్నపేట పట్టణంలో మాదిగలను కించపరిచే విధంగా మాల మహానాడు వేదికగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నాయకులు కూడా తనను సంప్రదించారని తెలిపారు. గతంలో తెలియక మాట్లాడానని చెప్పి బదులిచ్చినట్లు పేర్కొన్న ఆయన, సహనం కోల్పోతూ రోజురోజుకు మాటలు జారుతున్నాయని విమర్శించారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.1