Shuru
Apke Nagar Ki App…
సనాతన ధర్మ పరిరక్షణకు సమాజమంతా ఏకం కావాలి : BJP కందుల సంధ్యారాణి వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామాలయ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అతిథిగా వచ్చిన బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Telangana reporter
సనాతన ధర్మ పరిరక్షణకు సమాజమంతా ఏకం కావాలి : BJP కందుల సంధ్యారాణి వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామాలయ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అతిథిగా వచ్చిన బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సిరిసిల్ల అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆకస్మిక తనిఖీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్ లో బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర నిలువ పదార్థాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాడు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రణాళిక ప్రకారం చదివితే భవిష్యత్తు లో ఎంతో మేలు చేస్తుందని వివరించారు. విరామ సమయంలో విద్యార్థులు ఆటలు ఆడాలని సూచించారు.1
- కట్ట రాంపూర్ ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపించిన ఆకుల నర్మదా-నర్సన్న కార్పోరేటర్ స్థానిక కట్ట రాంపూర్ లో ని ప్రధాన రహదారి వర్షాల కారణంగా గుంతల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈ విషయం తెలుసుకొని ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుండే 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నర్సన్న గుంతల మయమైన రోడ్డుని సవరించి తగిన మరమ్మతులు చేయించడం జరిగింది ఈ సందర్భంగా నర్మదా నర్సన్న మాట్లాడుతూ డివిజన్ కు సంబంధించిన ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువచ్చినచో తప్పకుండా వాటిని పరిష్కరించే దిశగా పనులు చేస్తామని 11వ డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు1
- నంది మేడారం పంప్ హౌజ్ వద్ద సీఎం మంత్రుల చిత్రపటాలకు కాంగ్రెస్ పాలాభిషేకం. ప్రాజెక్టులపై బిఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొడుతు పెద్దపల్లి జిల్లా నందిమేడారం పంప్ హౌస్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి తోపాటు రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రాజెక్టులపై నీటి ఎత్తిపోతలపై మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు తీవ్రంగా స్పందించిన ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా నంది పంప్ హౌస్ వద్దకు చేరుకొని ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు, గోదావరి జలాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నీళ్ళనే మిడ్ మానేర్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాస్తవాలను విస్మరించి, ఎల్లంపల్లి నీటిని కాళేశ్వరం నీరుగా చూపిస్తూ బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కాళేశ్వరం జలాలుగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తమ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తూ, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.1
- ఎఫ్ఆర్ఓ సస్పెన్షన్కు ఎమ్మెల్యే డిమాండ్.. 24 గంటల్లో చర్యలు లేకపోతే ఉద్యమం హెచ్చరిక జన్నారం మండలం ఇంధన్పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ స్థానికులపై దాడి చేయడం, జక్కు భూమేష్ ఇంటికి 50 మందికిపైగా సిబ్బంది వెళ్లి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే ఎఫ్ఆర్ఓను సస్పెండ్ చేసి, 24 గంటల్లో పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారులను డిమాండ్ చేశారు.1
- నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన రోడ్డు రోడ్డు పనులను తక్షణమే పూర్తిచేయాలని బీఆర్ఎస్ డిమాండ్ బెజ్జంకి మండల ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా బెజ్జంకి – బేగంపేట – గూడెం – చీమలకుంటపల్లి – కొండపూర్ మార్గంలో నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేయడానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు. బెజ్జంకి మండలం నుంచి తల్లారావనిపల్లి, బేగంపేట, వడ్లూరు, గూడెం, చీమలకుంటపల్లి, కొండపూర్ తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సుమారు రూ.8 కోట్ల నిధులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఆర్&బి శాఖ ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ పనుల్లో గుగ్గిల్ల బ్రిడ్జి పూర్తయిందని, అలాగే బెజ్జంకి నుంచి బేగంపేట వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర డాంబర్ రోడ్డు పూర్తయిందని తెలిపారు. సింగిల్ రోడ్డుగా మంజూరైన ఈ పనిని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీ-ఎస్టిమేట్ చేసి డబుల్ రోడ్డుగా మార్చడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. అయినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఎర్త్వర్క్, కంకర పనులు, మధ్యంతర పనులు పూర్తయ్యాయని, చివరి దశలో ఉన్న సుమారు 10 శాతం బీటీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు. 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా ఆ పని ఎక్కడ ఆగిందో అక్కడే ఉందని, ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని మండల అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి, ఆర్&బి శాఖకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, బేగంపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి బెజ్జంకి వరకు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఇటీవల బెజ్జంకి మండలానికి చెందిన ఒక విలేకరి ఈ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారని, అలాగే బేగంపేటకు చెందిన పత్తి వ్యాపారి మహేందర్ రెడ్డి, నారెడ్డి రాజిరెడ్డి తదితరులు కూడా ప్రమాదాల్లో గాయపడ్డారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందువల్ల ఇప్పటికే మంజూరైన నిధులను వెంటనే విడుదల చేసి, కాంట్రాక్టర్కు చెల్లింపులు జరిపి, మిగిలిన రోడ్డు పనులను పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నామని పాకాల మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి పది రోజులలోపు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు మరియు వివిధ ప్రజా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రోడ్డు పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని పాకాల మహిపాల్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లింగాల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మానకొండూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ ఎల శేఖర్ బాబు, రామ్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.1
- సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి : TBGKS నేత మిర్యాల రాజిరెడ్డి సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని లేదంటే సెప్టెంబర్ 9 నుండి కంపెనీలో జరిగే అధికారిక కార్యక్రమాలకు అడ్డుకుంటామని TBGKS నేత మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు.1
- ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లతో నీటి సంరక్షణకు రైతులు ముందుకు రావాలి బెజ్జంకి, ఆగస్టు 3: ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని బెజ్జంకి ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు. వి.బి.జి. రామ్ ఉపాధి హామీ పథకం ద్వారా 20×20 లేదా 12×12 పరిమాణంలో ఫామ్ పాండ్లను తవ్వించుకోవచ్చని తెలిపారు. ఈ ఫామ్ పాండ్ల ద్వారా వర్షపు నీరు నిల్వై భూగర్భ జలాలు పెరుగుతాయని, సాగునీటి సమస్య కొంతవరకు తగ్గుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫామ్ పాండ్లలో చేపల పెంపకం చేపట్టి, చుట్టూ కూరగాయల సాగు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. నీటి వనరుల పరిరక్షణతో పాటు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్ కోరారు.1
- ప్రియ స్నేహితులారా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఆయన నెమ్మది శాంతి సుఖ జీవితము మీ జీవితంలో అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్స్ యు1