రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి బి. టోనీ వర్ధన్ ఒకరు. బద్వేలు:జాతీయస్థాయి ప్రేరణ పోటీలు వేదికగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంవికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జాతీయస్థాయి ప్రేరణ పోటీల కోసం ఫిబ్రవరి నెలలో 20 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపికైన విద్యార్థులు 05-04-2026 నుండి 11-04-2026 వరకు అహ్మదాబాద్ నగరంలో నిర్వహించబడే జాతీయస్థాయి ప్రేరణ పోటీలలో పాల్గొననున్నారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. వారిలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బద్వేల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి బి. టోనీ వర్ధన్ ఒకరు కావడం మనందరికీ గర్వకారణం. అహ్మదాబాద్లో నిర్వహించబడే ఈ జాతీయస్థాయి ప్రేరణ పోటీలలో పాల్గొనబోయే మా విద్యార్థి విజయం సాధించి జాతీయస్థాయి విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వెంకటసుబ్బారెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి బి. టోనీ వర్ధన్ ఒకరు. బద్వేలు:జాతీయస్థాయి ప్రేరణ పోటీలు వేదికగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంవికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జాతీయస్థాయి ప్రేరణ పోటీల కోసం ఫిబ్రవరి నెలలో 20 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపికైన విద్యార్థులు 05-04-2026 నుండి 11-04-2026 వరకు అహ్మదాబాద్ నగరంలో నిర్వహించబడే జాతీయస్థాయి
ప్రేరణ పోటీలలో పాల్గొననున్నారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. వారిలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బద్వేల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి బి. టోనీ వర్ధన్ ఒకరు కావడం మనందరికీ గర్వకారణం. అహ్మదాబాద్లో నిర్వహించబడే ఈ జాతీయస్థాయి ప్రేరణ పోటీలలో పాల్గొనబోయే మా విద్యార్థి విజయం సాధించి జాతీయస్థాయి విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వెంకటసుబ్బారెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
- గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.1
- *🔰ఏపీలో నేటితో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం* రేపటి నుంచి ప్రత్యేక అధికారుల నియామకానికి ఉత్తర్వులు తహశీల్దార్, MPDO స్థాయి అధికారులు, కొత్త పాలకమండలి వచ్చే వరకు బాధ్యతలు జీవో జారీ చేసిన ప్రభుత్వం1
- ఎమ్మిగనూరు నుండి ముఖ్య వార్త… అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టంగా మారడంతో ఎమ్మిగనూరులో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రైతుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలు ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్లో బాణసంచా పేల్చి, సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మోరేపల్లి మల్లికార్జున, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.1
- దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- బద్వేలు :స్వచ్ఛ సర్వేక్షన్ 2026 లక్ష్యంగా మన బద్వేలు పురపాలక సంఘం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు వార్డు స్థాయిలో జరిగిన చెత్త వర్గీకరణ (Waste Segregation) కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమీషనర్ స్వయంగా పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమ ముఖ్యాంశాలు: నేరుగా క్షేత్రస్థాయిలో: కమిషనర్ గారు స్వయంగా తడి, పొడి మరియు హానికర వ్యర్థాలను ఎలా వేరు చేయాలో (ఆకుపచ్చ, నీలం, ఎరుపు బుట్టల వినియోగం) ప్రజలకు వివరించారు. కార్మికులకు దిశానిర్దేశం: పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి, వ్యర్థాల సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలను పర్యవేక్షించారు. పౌరుల బాధ్యత: "మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన వీధిని, మన పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత" అని కమీషనర్ గారు పిలుపునిచ్చారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న వేళ, మన వంతుగా చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి సహకరిద్దాం. స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో మన బద్వేలు ను నంబర్ 1 గా నిలుపుదాం!1
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన ఆశ్రమ ప్రారంభోత్సవం, జయంతి ఉత్సవాల కరపత్రం ఘనంగా విడుదలైంది. జిల్లా అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య, ఉపాధ్యక్షులు బైరుపోగు జయరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్, డాక్టర్ కామాళే గణేష్తో పాటు పలువురు నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… విద్యా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పుకు ఆశ్రమం కీలకమని తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే ఆశ్రమ ప్రారంభోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్సిపి నాయకులు ఎం జక్కయ్య గారు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతలను ఘనంగా సన్మానించగా… కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబు గుంపల గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు కుళాయిల వద్ద బిందెలను క్యూ లైన్లో పెట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్ అధికారులకు తాగునీటి సమస్యను గ్రామస్థులు తెలియజేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1