తిరుపతి పద్మావతి ఉద్యానవనం ప్రారంభం – ఉచిత వైద్య శిబిరం, జిమ్ ప్రారంభంతో ఆరోగ్యంపై అవగాహన తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి ఉద్యానవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి, టాటా సేవా సమితి తిరుపతి మరియు వాకర్స్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు హాజరై ఉద్యానవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఏ ఆర్ రెడ్డి ఉచిత వైద్య శిబిరం మరియు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు జిమ్ను ప్రారంభించి ప్రసంగించారు.ఆరోగ్యంగా ఉండటానికి నడక ఎంతో అవసరమని, దానికి తోడు జిమ్ వినియోగం, యోగ, ధ్యానం వంటి అలవాట్లు కూడా అలవరుచుకోవాలని సూచించారు. వైద్య శిబిరాలు, చలివేంద్రాల సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యానవనాలను సంరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డప్ప, వాకర్స్ సభ్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తిరుపతి పద్మావతి ఉద్యానవనం ప్రారంభం – ఉచిత వైద్య శిబిరం, జిమ్ ప్రారంభంతో ఆరోగ్యంపై అవగాహన తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి ఉద్యానవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి, టాటా సేవా సమితి తిరుపతి మరియు వాకర్స్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు హాజరై ఉద్యానవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఏ ఆర్ రెడ్డి ఉచిత వైద్య శిబిరం మరియు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు జిమ్ను ప్రారంభించి ప్రసంగించారు.ఆరోగ్యంగా ఉండటానికి నడక ఎంతో అవసరమని, దానికి తోడు జిమ్ వినియోగం, యోగ, ధ్యానం వంటి అలవాట్లు కూడా అలవరుచుకోవాలని సూచించారు. వైద్య శిబిరాలు, చలివేంద్రాల సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉద్యానవనాలను సంరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డప్ప, వాకర్స్ సభ్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
- Breking కడప జిల్లా.. వేంపల్లి.. వేంపల్లి మండలం లోని వీరన్నగట్టుపల్లి వద్ద లెవెన్ కె.వి విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం... కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం.. విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడంతో ఆర్టీసీ బస్సు లో చెలరేగిన మంటలు.. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సును ఆపివేసిన డ్రైవర్ ... దీంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. క్రమేపి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.. ఫైర్ అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ అధికారులు.. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బస్సులో ఉన్న ప్రయాణికులు.3
- అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల పినకోటకు వెళ్లే ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుంచి బల్ల గురువు మీదుగా వాజంగి గ్రామానికి వెళ్లే రోడ్డును మరమ్మత్తులు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.15ఏళ్ళ క్రితం గ్రామాలకు రోడ్డు పనులు చేపట్టరన్నారు.అటుగా భారీ వాహనాలు వెళ్లడంతో 10కిలోమీటర్ల తారు రోడ్డు పూర్తిగాపాడైపోయి గోతులు ఏర్పడ్డాయి.తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- Post by Syyed taher1
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ వి బి జి రాంజీ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.రాయదుర్గం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున,విద్యార్థి సంఘం నేతలు కొట్రేస్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.1
- భారతదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయం1
- पालनाडु में निर्भया कांड जैसी हैवानियत, रेप के बाद प्राइवेट पार्ट में डाली रॉड आंध्र प्रदेश के पालनाडु जिले के माचेरला में 35 वर्षीय महिला के साथ हुई क्रूर घटना ने देश को निर्भया कांड की याद दिला दी. अज्ञात आरोपी ने महिला को गंभीर रूप से घायल कर दिया. पुलिस ने मामले को गंभीरता से लेते हुए जांच तेज कर दी है और आरोपी की तलाश के लिए विशेष टीमें गठित की हैं आंध्र प्रदेश के पालनाडु जिले के माचेरला कस्बे में एक 35 वर्षीय महिला के साथ हुई दरिंदगी ने पूरे इलाके को झकझोर कर रख दिया है. इस घटना को लेकर लोगों के बीच गहरा गुस्से का माहौल है और कई लोग इसे देश के चर्चित निर्भया कांड जैसी गंभीर घटना के रूप में देख रहे हैं. बताया जा रहा है कि यह घटना गुरुवार शाम महिला के घर पर हुई. एक अज्ञात शख्स ने महिला के साथ दुष्कर्म किया और उसके प्राइवेट पार्ट में लोहे की रॉड से वार कर उसे गंभीर रूप से घायल कर दिया. घटना के बाद पुलिस हरकत में आई और मामले की जांच को प्राथमिकता दी गई. पुलिस ने तुरंत क्लूज टीम को मौके पर भेजा, जहां से अहम साक्ष्य जुटाए जा रहे हैं. टीम द्वारा फिंगरप्रिंट और अन्य फॉरेंसिक साक्ष्य इकट्ठा किए जा रहे हैं ताकि आरोपी तक जल्द पहुंचा जा सके.1
- బద్వేలు , ఏప్రిల్ 04: బద్వేలు పట్టణంలో పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI), డయాసిస్ ఆఫ్ నంద్యాల - బద్వేల్ టౌన్ చర్చి నుండి ఈ ర్యాలీ ఉత్సాహంగా ప్రారంభమైంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని, ఆయన ప్రేమను చాటిచెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగుతూ, నాలుగు రోడ్ల కూడలి మీదుగా RCM చర్చి వరకు చేరుకుంది. అక్కడ నుండి తిరిగి ర్యాలీగా బయలుదేరి ప్రారంభ స్థానమైన CSI చర్చికి చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు మరియు క్రైస్తవ పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఈ కార్యక్రమాన్ని ముగించారు. పట్టణంలోని వివిధ సంఘాల క్రైస్తవులు, యువకులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీస్తు సందేశాన్ని చాటారు.3
- అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గం: గుర్రంకొండ ఎదురెదురుగా రెండు కార్లు డి పలువురికి గాయాలు రెండు కార్లు ఎదురుగా ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి. కడప బెంగళూరు జాతీయ రహదారి లో నైఎన్ఆర్ పెట్రోల్ బంక్ వద్దా కడప నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి మరో కారు అతివేగంగా ఢీకొన్నాయి. కారు అతివేగంగా తగలడం వలన కార్ లో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడం వలన ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు అక్కడికి చేరుకొని గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ని పునరుద్దించి ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- Post by Syyed taher1