మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ వి బి జి రాంజీ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.రాయదుర్గం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున,విద్యార్థి సంఘం నేతలు కొట్రేస్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ వి బి జి రాంజీ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.రాయదుర్గం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున,విద్యార్థి సంఘం నేతలు కొట్రేస్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
- కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.1
- బద్వేలు , ఏప్రిల్ 04: బద్వేలు పట్టణంలో పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI), డయాసిస్ ఆఫ్ నంద్యాల - బద్వేల్ టౌన్ చర్చి నుండి ఈ ర్యాలీ ఉత్సాహంగా ప్రారంభమైంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని, ఆయన ప్రేమను చాటిచెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగుతూ, నాలుగు రోడ్ల కూడలి మీదుగా RCM చర్చి వరకు చేరుకుంది. అక్కడ నుండి తిరిగి ర్యాలీగా బయలుదేరి ప్రారంభ స్థానమైన CSI చర్చికి చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు మరియు క్రైస్తవ పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఈ కార్యక్రమాన్ని ముగించారు. పట్టణంలోని వివిధ సంఘాల క్రైస్తవులు, యువకులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీస్తు సందేశాన్ని చాటారు.3
- సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం..! భవనంపై నుండి దూకిన బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థిని బి. మైను (21)..! బాధిత విద్యార్థిని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన యువతిగా గుర్తింపు..! ఫోన్ మాట్లాడుకుంటూ భవనం పైనుండి దూకేసిన విద్యార్థిని..! తీవ్ర గాయాలైన మైనును హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన కళాశాల యాజమాన్యం..! ఆస్పత్రిలో విద్యార్థిని పరిస్థితి విషమం..! ఘటనకు గల కారణాలపై ఆరాతీస్తున్న పోలీసులు..!1
- పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- Post by Bondhu Suresh1
- Post by K AMPAIAH ACHARI1
- బద్వేలు, ఏప్రిల్ 04:వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. బద్వేలు సమీపంలో గల చెన్నంపల్లి గ్రామంలో శ్రీ ఆది చెన్నకేశవ స్వామి తిరుణాల ఉత్సవాలు భక్తి, శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన రథోత్సవం విజయవంతంగా పూర్తై, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం వివిధ పోటీ కార్యక్రమాలు ఘనంగాప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ , యువనేత రితీష్ కుమార్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ మంగా చెన్న కృష్ణ రెడ్డి , గోడి భాస్కర్ రెడ్డి , సనపరెడ్డి మనోహర్ రెడ్డి , ఎల్ఎస్పీ చైర్మన్ రమణారెడ్డి , ఏపీఆర్డీసీ డైరెక్టర్ రంతు , యనమల సుధాకర్ , బిజీవేముల రామచంద్ర రెడ్డి , వెంగల్ రెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.3
- *ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా సాగుతున్న కూటమి* *మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యం* *ఇంటికో మహిళా పారాశ్రామిక వేత్తను చేయడమే ప్రభుత్వ లక్ష్యం* ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం సాగుతున్నదని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల బయప్పగారి పల్లి సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో నూతన ఫర్టిలైజర్ షాపును ప్రారంభించి రైతులకు యూరియా బస్తాలను ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పంపిణి చేశారు. అనంతరం పలమనేరు ఎంపీడివో కార్యాలయం వద్దనున్న వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు 80 మందికి ఈ - సైకిళ్లను ఆయన పంపిణి చేపట్టి, స్వచ్ఛ రథన్ని ప్రారంభించారు. అదేవిధంగా 499 స్వయం సహాయక సంఘాలకు రూ. 35 కోట్ల 39 లక్షల 59 వేల బ్యాంకు లింకేజీ మరియు శ్రీ నిధి రుణాలను ఆయన పంపిణి చేశారు.. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంగించారు. ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో (ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్) వారికి అవకాశాలు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా పునాది వేశారన్నారు. రాబోయే 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో (అసెంబ్లీ మరియు పార్లమెంట్) మహిళలకు కూడా తగిన స్థానం లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, పాఠశాలలు మరియు సురక్షితమైన తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సూచించారు .గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మరియు అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. సుమారు ₹2,700 కోట్లతో చిత్తూరు జిల్లాలోని పడమటి నియోజకవర్గాలకు (కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లె) గండికోట రిజర్వాయర్ నుండి పైపుల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తారన్నారు . ఇక రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించామని మహిళల ఆరోగ్యం కోసం గతంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన 'దీపం' పథకాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు . ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ప్రతి బిడ్డకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రూపాయల రుణాలను (తాకట్టు లేకుండా) అందిస్తున్నారన్నారు. ఈ-సైకిల్స్ (E-Bicycles): మహిళల కోసం రాయితీపై (సుమారు ₹10,000 సబ్సిడీ) ఈ-సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ఇంట్లోని పిల్లలు లేదా పెద్దలు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు . కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆరోగ్యం మరియు గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్లు పెద్దబ్బ, వెంకట ముని రెడ్డి, టిడిపి నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, జగదీష్ నాయుడు, సెల్వరాజ్,రామూర్తి నాయుడు, గిరి, కవీంద్ర నాయుడు, అనిల్ మరియు పలమనేరు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ , ఎంపీడీవో కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.1