Shuru
Apke Nagar Ki App…
to day ambthkar festival .in arakeri banergatta road bangalore.karnataka.560076.
Rajinikanth
to day ambthkar festival .in arakeri banergatta road bangalore.karnataka.560076.
- User9115Mahabubabad, Telangana💣11 hrs ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Rajinikanth1
- ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రతృత్వం కోసం జీవితాంతం కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.1
- *ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు* *అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్* భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు..1
- Post by Nageshwari Nageshwari4
- వై.ఎస్.ఆర్ కడప జిల్లా.. వై.ఎస్.ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసుల మెరుపు దాడి ...15 కిలోల గంజాయి స్వాధీనం.. 👉 18 మంది నిందితుల అరెస్ట్.. 👉 110 లీటర్ల నాటు సారాయి పట్టివేత.. 👉 కదిరి రింగ్ రోడ్ వద్ద గంజాయి రవాణా అడ్డగింత.. 👉 గంజాయి కేసులో 10 మంది అరెస్ట్... 👉 నాటు సారా కేసులో 8 మంది అదుపులోకి.. 👉 ప్రధాన నిందితుడు గొర్ల భారత్ యాదవ్కు పాత కేసుల లింక్... 👉 వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి వ్యాపారం .. గంజాయి కొనుగోలుకు రూ.30 వేల పెట్టుబడి... పులివెందుల అర్బన్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్.. ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలపై దాడులు.. SDPO మురళి ఆధ్వర్యంలో చర్యలు పట్టుబడ్డ వారిని రిమాండ్కు తరలింపు... డ్రగ్స్, నాటు సారాయిపై కఠిన చర్యలు కొనసాగుతాయి.. కడప జిల్లాలోని పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి మరియు నాటు సారాయి అక్రమ రవాణాపై దాడులు చేసి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, పులివెందుల SDPO బి.మురళి ఆధ్వర్యంలో పులివెందుల అర్బన్ పోలీసులు ఈ ప్రత్యేక దాడులు చేపట్టారు. ఉదయం కదిరి రింగ్ రోడ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో పులివెందుల పట్టణంలో నాటు సారాయి అమ్ముతున్న మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు మంగళవారం మీడియా కు తెలిపారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ గారు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు కేసు వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు గొర్ల భరత్ యాదవ్కు పాత కేసులు ఉన్నట్లు, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఈ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, నాటు సారాయి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కఠినంగా హెచ్చరించారు. ➡️ వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గా పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ప్రణాళిక ప్రకారం నేరం చేసి సంపాదించిన వారు, నేరంలో పాల్గొన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సీరియస్ గా పరిగణించి కఠిన శిక్ష విధించేలా చట్టంలో పొందు పరిచారన్నారు.1
- Post by Rajinikanth1