పుంగనూరులో చెట్టునుడికొని ఆటో బోల్తా ముగ్గురికి గాయాలు ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు పుంగనూరు: ప్రమాదవశాత్తు ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన నూర్బాషా(42), యాస్మిన్(35), స్థానిక యూబికాంపౌండుకు చెందిన సుమన్తాజ్(32) లు కలసి పుంగనూరుకు ఆటోలో వస్తుండగా మార్గ మధ్యంలో రాంపల్లె వద్ద ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు గమనించి 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుంగనూరులో చెట్టునుడికొని ఆటో బోల్తా ముగ్గురికి గాయాలు ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు పుంగనూరు: ప్రమాదవశాత్తు ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన నూర్బాషా(42), యాస్మిన్(35), స్థానిక యూబికాంపౌండుకు చెందిన సుమన్తాజ్(32) లు కలసి పుంగనూరుకు ఆటోలో వస్తుండగా మార్గ మధ్యంలో రాంపల్లె వద్ద ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు గమనించి 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రాతి పని లేక 20 వేల మంది వడ్డెర కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 120 ఆలయాలకు అవసరమైన రాళ్లను ప్రైవేటు భూముల నుండి సేకరిస్తున్నారని, తమకు పని కల్పించాలని కడపిడికి వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్య సాయి కార్మికుల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.1
- రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు బైఠాయించి నిరసన తెలిపారు.2
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- ఎమ్మెల్యే బీవీ జై నాగేశ్వర్ రెడ్డికి హాలహర్విలో ఘన స్వాగతం హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా1
- కొల్లు రవీంద్రా మీరు వేసుకున్న పచ్చ కళ్లజోడుని తీసేసి చూస్తే.. వైయస్ జగన్ గారు చేసిన మంచి కనిపిస్తుంది అభివృద్ధి పనులు చేయడం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, పేదలకు పథకాలు ఇవ్వడం రాష్ట్రాన్ని నా*శనం చేయడమా కొల్లు రవీంద్రా? -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్సీపీ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి1
- అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలం జీడిపల్లిలో కుక్కల దాడిలో ఒకేసారి 52 గొర్రెపిల్లలు మృతి చెందాయి. ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన ఈ గొర్రెపిల్లల మృతితో రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో ఎర్రిస్వామి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1