కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్కు నీరు ఇస్తారా? ప్రభుత్వం స్పష్టం చేయాలి రాయలసీమ కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్ సీజన్లో సాగునీటిని విడుదల చేస్తారా, లేదా వరి నాట్లకు నీరు అందిస్తారా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.రైతుల సాగు ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏ.వి. రమణ కోరారు. కేసీ కెనాల్ పరిధిలో సాగు చేస్తున్న రైతులు నీటి లభ్యతపై అనిశ్చితితో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.రైతు సేవా సమితి సభ్యులు వెంకట చంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్లో నీటి విడుదలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. నీటి విడుదలపై నిర్ణయం ఆలస్యం అయితే రైతులు పంటల ఎంపిక, వరి నాట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.కేసీ కెనాల్ పరిధిలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఖరీఫ్ సీజన్కు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.
కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్కు నీరు ఇస్తారా? ప్రభుత్వం స్పష్టం చేయాలి రాయలసీమ కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్ సీజన్లో సాగునీటిని విడుదల చేస్తారా, లేదా వరి నాట్లకు నీరు అందిస్తారా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.రైతుల సాగు ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏ.వి. రమణ కోరారు. కేసీ కెనాల్ పరిధిలో సాగు చేస్తున్న రైతులు నీటి లభ్యతపై అనిశ్చితితో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.రైతు సేవా సమితి సభ్యులు వెంకట చంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్లో నీటి విడుదలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. నీటి విడుదలపై నిర్ణయం ఆలస్యం అయితే రైతులు పంటల ఎంపిక, వరి నాట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.కేసీ కెనాల్ పరిధిలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఖరీఫ్ సీజన్కు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.
- కలెక్టరేట్ ముందు CPI(ML) ధర్నా "మోడీ హటావో - దేశ్ కి బచావో" నినాదం. బద్వేలు,ఆగస్టు 11: కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ CPI(ML) లిబరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కడప జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బందెల ఓబయ్య మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రజా, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. SIR పేరుతో తొలగించిన ఓట్ల పునరుద్ధరణ, కనీస వేతనం అమలు, నిత్యావసర ధరల తగ్గింపు, జెన్ జీ ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణను డిమాండ్ చేశారు. 2029లో బిజెపిని గద్దె దించేందుకు అన్ని వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ ధర్నాలో ఎస్. చంద్రశేఖర్, కే. జకరయ్య, చంద్రమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.3
- చేనేత సమస్యలపై ఇంటింటికీ వెళ్లి తెలుసుకుంటాం: కేతిరెడ్డి చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో ధర్మవరంలో ఇంటింటికీ వెళ్లి వారితో మాట్లాడుతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడురు.. చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమి నాయకుల మాటలు విని అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం అందకుండా చేస్తున్న హ్యాండ్లూమ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హులకు పథకం అందకుండా చేసిన అధికారులపై విచారణ జరిపించి, తప్పు చేసినట్లు తేలితే జైలుకు పంపించేలా చర్యలు తీసుకుంటామని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.1
- జడివానకు కూలిన చౌడు మిద్దె.. తృటిలో తప్పిన ప్రమాదం...... మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని 19వ వార్డు, మామిళ్లపల్లె–కొత్తపల్లె గ్రామానికి చెందిన గోశెట్టి పెద్ద రోశయ్య కుటుంబానికి చెందిన చౌడు మిద్దె మంగళవారం తెల్లవారుజామున కూలిపోయింది.గత కొంతకాలంగా కురుస్తున్న జడివానలకు మిద్దె బలహీనపడటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మిద్దె కూలిన సమయంలో వృద్ధ దంపతులు శ్రీరాములు, శ్రీమతి ఓబుళమ్మ ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల కారణంగా ఇలాంటి పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని అధికారులు పరామర్శించి, తగిన సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.2
- బద్వేలు 15వ వార్డ్లో టీడీపీ "డోర్ టు డోర్" కార్యక్రమం ఘనంగా నిర్వహణ. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఇంచార్జ్ తంగా బాలరాజు యాదవ్. బద్వేలు,ఆగస్టు 11: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, 15వ వార్డ్ ఇంచార్జ్ తంగా బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున "డోర్ టు డోర్" కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, ఇంటి పన్ను, పెన్షన్లు తదితర పలు సమస్యలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తంగా బాలరాజు యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ప్రజా సమస్యల పరిష్కారమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్ళలా ముందుకు సాగుతున్నాయి. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడమే మా బాధ్యత" అని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు బాలమురళి యాదవ్ , సుబ్బరాయుడు, గానుగపెంట రమణ, సోప్పదంటూ ఖాసీం,జయ రాములు, గానుగపిట్ట రమణ, తప్పదంట కాసిం, తంగా సుబ్బరాయుడుతదితర టీడీపీ సీనియర్ నాయకులు, వార్డు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను రాబోయే రోజుల్లోనూ ప్రతి వార్డులోనూ కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.1
- ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు అలా నిర్మించావు: రాంగోపాల్ రెడ్డి చెన్నై తాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిర్మించావు చెప్పు జగన్' అంటూ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం విజయవాడ మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.చెన్నైకి మనకు ఏమి సంబంధం.. ఎవడబ్బ సొమ్మని అక్కడ ఖర్చు పెట్టావు జగన్' అని ప్రశ్నించారు. వారి బంధువులు రాజకీయాల్లో ఉన్నారని ఏపీ ప్రజల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టావన్నారు.1