logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కలెక్టరేట్ ముందు CPI(ML) ధర్నా "మోడీ హటావో - దేశ్ కి బచావో" నినాదం. బద్వేలు,ఆగస్టు 11: కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ CPI(ML) లిబరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కడప జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బందెల ఓబయ్య మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రజా, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. SIR పేరుతో తొలగించిన ఓట్ల పునరుద్ధరణ, కనీస వేతనం అమలు, నిత్యావసర ధరల తగ్గింపు, జెన్ జీ ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణను డిమాండ్ చేశారు. 2029లో బిజెపిని గద్దె దించేందుకు అన్ని వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ ధర్నాలో ఎస్. చంద్రశేఖర్, కే. జకరయ్య, చంద్రమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
1 hr ago

కలెక్టరేట్ ముందు CPI(ML) ధర్నా "మోడీ హటావో - దేశ్ కి బచావో" నినాదం. బద్వేలు,ఆగస్టు 11: కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ CPI(ML) లిబరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కడప జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బందెల ఓబయ్య మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రజా, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. SIR పేరుతో తొలగించిన ఓట్ల పునరుద్ధరణ, కనీస వేతనం అమలు, నిత్యావసర ధరల తగ్గింపు, జెన్ జీ ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణను డిమాండ్ చేశారు. 2029లో బిజెపిని గద్దె దించేందుకు అన్ని వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ ధర్నాలో ఎస్. చంద్రశేఖర్, కే. జకరయ్య, చంద్రమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మార్తోమా నగర్ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి..పిడుగు మస్తాన్ ఏరియా కార్యదర్శి. బద్వేలు, ఆగస్టు 11:మార్తోమ నగర్ ఏర్పాటై 22 సంవత్సరాలు అయినప్పటికీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం పట్టణ సమితి ఆధ్వర్యంలో మార్తామనగర్ స్మశాన వాటికను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ. బద్వేల్ పట్టణం11వ వార్డు మార్తామ నగర్ స్మశానం కు 2008లో రెండు ఎకరాలు అధికారులు కేటాయించారని, అయితే ఈ స్మశాన వాటికకు దారి సరిగా లేదని, అలాగే స్మశానం కంపచెట్లతో నిండి ఉన్నదని, ఆయన తెలిపారు చాలాసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం ఇంటింటికి వచ్చి దండాలు పెట్టి ఓట్లు వేయించుకునే పాలక ప్రభుత్వాలు వీరి స్మశాన వాటికకు మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఈ స్మశాన వాటికకు సీసీ రోడ్డు, చుట్టూ ప్రహరీ గోడ, చేతిపంపు ఏర్పాటు చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి, నాగ దాసరి ఇమ్మానుయేలు, ఏరియా పట్టణ కార్య వర్గ సభ్యులు పడగ వెంకటరమణ, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు
    3
    మార్తోమా నగర్ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి..పిడుగు మస్తాన్ ఏరియా కార్యదర్శి.
బద్వేలు, ఆగస్టు 11:మార్తోమ నగర్ ఏర్పాటై 22 సంవత్సరాలు అయినప్పటికీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం పట్టణ సమితి ఆధ్వర్యంలో మార్తామనగర్ స్మశాన వాటికను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ. బద్వేల్ పట్టణం11వ వార్డు మార్తామ నగర్ స్మశానం కు 2008లో రెండు ఎకరాలు అధికారులు కేటాయించారని, అయితే ఈ స్మశాన వాటికకు దారి సరిగా లేదని, అలాగే స్మశానం కంపచెట్లతో నిండి ఉన్నదని, ఆయన తెలిపారు చాలాసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం ఇంటింటికి వచ్చి దండాలు పెట్టి ఓట్లు వేయించుకునే పాలక ప్రభుత్వాలు వీరి స్మశాన వాటికకు మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఈ స్మశాన వాటికకు సీసీ రోడ్డు, చుట్టూ ప్రహరీ గోడ, చేతిపంపు ఏర్పాటు చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి, నాగ దాసరి ఇమ్మానుయేలు, ఏరియా పట్టణ కార్య వర్గ సభ్యులు పడగ వెంకటరమణ, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    49 min ago
  • ఎర్రగుంట్లలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఘన స్వాగతం.... ఎర్రగుంట్ల: ఈరోజు కడప జిల్లాకు చేరుకున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి తిరుగు ప్రయాణంలో ఎర్రగుంట్లలో ఘన స్వాగతం లభించింది. కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ముప్పె వెంకట్ నాయుడు గారు, అభిమానులు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భానసంచారాలతో సందడి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథికి ఘనంగా సత్కారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఎర్రగుంట్లలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
    4
    ఎర్రగుంట్లలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఘన స్వాగతం....
ఎర్రగుంట్ల: ఈరోజు కడప జిల్లాకు చేరుకున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి తిరుగు ప్రయాణంలో ఎర్రగుంట్లలో ఘన స్వాగతం లభించింది. కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ముప్పె వెంకట్ నాయుడు గారు, అభిమానులు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భానసంచారాలతో సందడి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథికి ఘనంగా సత్కారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఎర్రగుంట్లలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నంద్యాల, ఆగస్టు 11: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు. ఆగస్టు 11న బాస్కెట్‌బాల్, యోగా, ఆగస్టు 12న ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, క్యారమ్స్, ఖోఖో, ఆగస్టు 13న బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. క్రీడాకారుల ఎంపికలో భాగంగా KVK స్టేడియం, నంద్యాలలో ఆయా క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సూచించారు.
    1
    నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు
నంద్యాల, ఆగస్టు 11: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు.
ఆగస్టు 11న బాస్కెట్‌బాల్, యోగా, ఆగస్టు 12న ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, క్యారమ్స్, ఖోఖో, ఆగస్టు 13న బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు.
క్రీడాకారుల ఎంపికలో భాగంగా KVK స్టేడియం, నంద్యాలలో ఆయా క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
క్రీడలపై ఆసక్తి ఉన్న యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సూచించారు.
    user_Shaik abdul mazeed
    Shaik abdul mazeed
    Local News Reporter Nandyal, Andhra Pradesh•
    6 hrs ago
  • పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*? అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.
    1
    పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే 
రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే 
పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*?
అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన- మంచూరు సూర్యనారాయణ రెడ్డి. బద్వేలు,ఆగస్టు 11: "2 ఏళ్ల కూటమి ప్రభుత్వం – సంక్షేమం, అభివృద్ధి" కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి అన్నారు.బద్వేలు టీడీపీ కార్యాలయంలోపరిశీలకుడు తుగ్గలి నాగేంద్రతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తోందని, రూ.4000 పెన్షన్, ఉచిత బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి చంద్రబాబు గారు చిత్తశుద్ధి చాటారని, బద్వేలులో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    2
    ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన- మంచూరు సూర్యనారాయణ రెడ్డి.
బద్వేలు,ఆగస్టు 11: "2 ఏళ్ల కూటమి ప్రభుత్వం – సంక్షేమం, అభివృద్ధి" కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి అన్నారు.బద్వేలు టీడీపీ కార్యాలయంలోపరిశీలకుడు తుగ్గలి నాగేంద్రతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తోందని, రూ.4000 పెన్షన్, ఉచిత బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి చంద్రబాబు గారు చిత్తశుద్ధి చాటారని, బద్వేలులో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు: బీటెక్ రవి విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ విద్యా సంస్థలు చెలగాటమాడుతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల పట్టణంలోని స్థానిక ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక ర్యాలీలలో విద్యార్థులు పాల్గొనడం ఆనవాయితీ అని, మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొనడం ఎంతవరకు సమంజసమన్నారు.
    1
    విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు: బీటెక్ రవి
విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ విద్యా సంస్థలు చెలగాటమాడుతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల పట్టణంలోని స్థానిక ప్రైవేట్ విద్యా సంస్థల
యాజమాన్యాలతో ఆయన చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక ర్యాలీలలో
విద్యార్థులు పాల్గొనడం ఆనవాయితీ అని, మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొనడం ఎంతవరకు సమంజసమన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.