NPRD INDIA నారాయణ ఖేడ్ నియోజకవర్గం అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్ నియామకం పత్రికా ప్రకటన తేదీ: ఆగస్టు 23, 2026 హైదరాబాద్ NPRD INDIA నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్ నియామకం ✊🏻✊🏻♿️♿️✊🏻✊🏻 వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు. *దివ్యాంగుల హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తా: బుక్క ఇస్మాయిల్* 🙏🏼🙏🏼♿️♿️🙏🏼🙏🏼 తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు నూతన అధ్యక్షుడు బుక్క ఇస్మాయిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ— "నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, వారి న్యాయమైన హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తాను. సంస్థ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను" అని స్పష్టం చేశారు.
NPRD INDIA నారాయణ ఖేడ్ నియోజకవర్గం అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్ నియామకం పత్రికా ప్రకటన తేదీ: ఆగస్టు 23, 2026 హైదరాబాద్ NPRD INDIA నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్ నియామకం ✊🏻✊🏻♿️♿️✊🏻✊🏻 వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు. *దివ్యాంగుల హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తా: బుక్క ఇస్మాయిల్* 🙏🏼🙏🏼♿️♿️🙏🏼🙏🏼 తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు నూతన అధ్యక్షుడు బుక్క ఇస్మాయిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ— "నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, వారి న్యాయమైన హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తాను. సంస్థ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను" అని స్పష్టం చేశారు.
- బిక్కనూరులో భారీ వర్షం... రైతుల హర్షం......... ( వీడియో) బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతున్న దశలో వర్షాలు కురవడం పంటలకు ఊతమిచ్చింది.1
- శేర్లింగంపల్లి బోనాల వేడుకల్లో పాల్గొన్న నందమూరి దీపిక జానకిరామ్ లింగంపల్లిలో గ్రామస్తులు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నందమూరి దీపిక జానకిరామ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.3
- నిమ్స్ పేరిట భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు: రైతులు రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూ అధికారాల బదలాయింపు 500 ఎకరాల భూములకు పరిహారం కోర్టులో జమ.. మరో 400 ఎకరాలపై కదలికలు సారవంతమైన భూముల జోలికి వస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం పంచాయతీ అధికారాల బదలాయింపుపై హద్నూర్ గ్రామస్తుల ఆగ్రహం “పరిశ్రమలు వద్దు.. మా భూములే మాకు ముద్దు” జల్–జంగల్–జమీన్ కోసం పోరాటం తప్పదు: రైతులు1
- ప్రజావాణిలో అరుదైన స్పందన: అరగంటలో ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు నమోదు జనగామ జిల్లా ప్రజావాణిలో ఓ నిరుపేద కుటుంబానికి సత్వర ఊరట లభించింది. కంటి సమస్యతో బాధపడుతున్న ఏడాది చిన్నారి ఆరోగ్యశ్రీ కార్డులో పేరు లేకపోవడంతో వైద్యానికి ఇబ్బంది పడుతున్నట్లు తండ్రి మహమ్మద్ రఫత్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్, కేవలం అరగంటలోనే పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకుని, ఉచిత వైద్యానికి మార్గం సుగమం చేశారు.2
- తార్నాకలో ఏబీఆర్ఎస్ఎం కార్యాలయం ప్రారంభం..సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వైస్ ఛాన్సలర్ శ్రీ బట్టు సత్యనారాయణ, తార్నాకలో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) నూతన కార్యాలయాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వైస్ ఛాన్సలర్ శ్రీ బట్టు సత్యనారాయణ, ఏబీఆర్ఎస్ఎం ఆలిండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మహేంద్ర కపూర్ తదితరులు పాల్గొన్నారు. ఏబీఆర్ఎస్ఎం ఆలిండియా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గుంత లక్ష్మణ్, ప్రొఫెసర్ మురళీ మనోహర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏబీఆర్ఎస్ఎం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్. కిషన్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఏలూరు యాదయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భారతీయ విద్యా రంగంలో పరిశోధన, ఉన్నతికి మరింతగా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏబీఆర్ఎస్ఎం కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏబీవీపీ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన డాక్టర్ జగన్, డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ సుజాత, డాక్టర్ స్వప్న, భాస్కర్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సోమేశ్, కవిత, వివేక్, సుమన్, తిరుపతిరెడ్డి, డాక్టర్ ఉపేంద్ర, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కవిత, డాక్టర్ చిత్తరంజన్, సంపత్, లోకేష్ తదితరులు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.4
- Hyderabad city police Ko mili badi Kamyabi 2 logo ko Police n1
- గ్రామాల్లో సర్పంచులు చాటింపు వేయించి ప్రజలకు ఆర్ఓబీ పనుల వివరాలను తెలియజేయాలి చేగుంట మండల కేంద్రంలో మెదక్–చౌదరి రహదారిపై ఆర్ఓబీ నిర్మాణ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట సీఐ సైదా నాయక్ సూచించారు. పనుల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలని కోరారు. చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లో సర్పంచులు చాటింపు వేయించి ప్రజలకు ఆర్ఓబీ పనుల వివరాలను తెలియజేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రహదారి మళ్లింపు మార్గాలను కూడా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సీఐ పేర్కొన్నారు.1
- రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ క్యాబిన్లో యువకుల అరాచకాలు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్ను కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, తరచూ యువకులు క్యాబిన్ వద్ద గుమికూడి గంజాయి సేవించడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.1
- బ్రిడ్జి సేఫ్టీ వాల్ను ఢీకొని లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.1