Shuru
Apke Nagar Ki App…
కేశంపేట:కొత్తపేట జెడ్పీహెచ్ఎస్లో సమ్మర్ క్యాంపు ప్రారంభం మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 25 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహణ చేయడం జరుగుతుందని మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే సమ్మర్ క్యాంపును 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఎంపీ కొత్తపేట జెడ్పీహెచ్ఎస్ను సంప్రదించాలని సూచించారు.
S M S R R
కేశంపేట:కొత్తపేట జెడ్పీహెచ్ఎస్లో సమ్మర్ క్యాంపు ప్రారంభం మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 25 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహణ చేయడం జరుగుతుందని మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే సమ్మర్ క్యాంపును 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఎంపీ కొత్తపేట జెడ్పీహెచ్ఎస్ను సంప్రదించాలని సూచించారు.
More news from Hyderabad and nearby areas
- కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.1
- మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన దీంతో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు, బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు1
- ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం ఆదివారం చోటుచేసుకుంది. హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. అంతకుముందు, ప్రధానికి రేవంత్ రెడ్డి వెండి నంది జ్ఞాపికను బహూకరించి, శాలువాతో సత్కరించారు. విభేదాలు పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు ఇలా ఆత్మీయంగా కలవడం విశేషంగా మారింది.1
- తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా నెలికొండ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో పెట్టుబడులు కూడా దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే నష్టాన్ని అంచనా వేసి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- పటాన్చెరు బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించినా, యాజమాన్యం సకాలంలో స్పందించి అందరినీ సురక్షితంగా బయటకు పంపింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయగా, యజమానికి స్వల్ప గాయాలయ్యాయి.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కీలక ఆఫర్ ఇచ్చారు. తనతో కలిస్తే రేవంత్ కోరుకున్న ఉన్నత స్థానానికి తీసుకెళ్తానని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.1