Shuru
Apke Nagar Ki App…
* *పత్రిక ప్రకటన* *17-03-2026* * " *శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం* *అరసవల్లి* *." *ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి *ఈ రోజు కృష్ణాంగారక చతుర్ధశి ఉదయం అనివెట్టి మండపలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన. శ్రీకాకుళం మండలం అరసవిల్లి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం కృష్ణాంగారక చతుర్ధశి సందర్భంగా అనివెట్టి మండపలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణధికారి K.N.V.D.V ప్రసాద్ పాల్గొన్నారు.
BHEEMARAO BYPALLI
* *పత్రిక ప్రకటన* *17-03-2026* * " *శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం* *అరసవల్లి* *." *ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి *ఈ రోజు కృష్ణాంగారక చతుర్ధశి ఉదయం అనివెట్టి మండపలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన. శ్రీకాకుళం మండలం అరసవిల్లి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం కృష్ణాంగారక చతుర్ధశి సందర్భంగా అనివెట్టి మండపలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణధికారి K.N.V.D.V ప్రసాద్ పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లా మార్చి 16, గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో తాగునీరు లేక ప్రధానంగా మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నమని సరిగా కులం జిల్లా కొందులవానిపేట గ్రామాల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్న తాగునీటి సమస్యను ఏ ప్రభుత్వం కూడా తీర్చడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ లో తమ గ్రామానికి తాగునీరు అందించాలని వెంటనే ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు అలాగే గ్రామాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదు కోవాలని ర్యాలీ నిర్వహించారు.1
- శ్రీకాకుళం, మార్చి 16: జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను ఒకే చోట అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న మాల్ ఖానాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు కలసి సందర్శించారు. నగరంలోని వంశధార పాత క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక ప్రత్యేక కేంద్రాన్ని శనివారం వారిద్దరూ స్వయంగా భవనం లోపల, బయట కలియతిరిగి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా తలుపుల పటిష్టత, సీసీ కెమెరాల నిఘా తీరును తనిఖీ చేశారు. భవనం సంరక్షణ కోసం కేటాయించిన సిబ్బంది వివరాలను ఏఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అజాగ్రత్తకు తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బిల్డింగ్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న ఎస్.ఐ పి.నరసింహమూర్తికి భద్రత విషయంలో పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను నిల్వ చేసిన పద్ధతిపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి.ఇ మురళీమోహన్, ఆర్ అండ్ బి అధికారులైన డి.ఇ ధనంజయ్, ఈ.ఈ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. భవనంలో అవసరమైన మరిన్ని మౌలిక సదుపాయాలను, ఫినిషింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.2
- పాము1
- ప్రజాప్రాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ SPF యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్,డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, SPF అడిషనల్ కమాండెంట్, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ 41 వ డివిజన్ లోని రాతి చెరువు సమీప ప్రాంతాలలో నెలకొన్న చెత్తాచెదారం తో పాటు పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ... పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని తెలిపారు. అనంతరం శానిటేషన్, వాటర్ సప్లై, మురికి కాలువల నిర్మాణం,రోడ్ల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.4
- దమ్మపేట మండల పరిధిలోని గొర్రె గుట్ట గ్రామములో ఈరోజు ఉదయం జరిగిన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల యుగంధర్ తో పాటు దొడ్డ ప్రసాద్ కాసాని నాగప్రసాద్ మంగేశ్వర తో పాటు దమ్మపేట మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు1
- మచిలీపట్నం సుకర్లాబాద్లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- శ్రీకాకుళం, మార్చి 16: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని భాష్యం పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు కల్పించిన వసతులను స్వయంగా పర్యవేక్షించారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గదుల్లో తగినంత వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా తాగునీటి లభ్యతపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల హాజరు శాతం, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిఘా ఉంచాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- అమలాపురం మానేపల్లి వారి వీధి లో గోధుమ త్రాచు కలకలం... వేసవి కాలం వస్తున్న కారణం గా....తరచూ గా విషాదర్పాలు జన సంచారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది....కావున ప్రజలు అప్రమత్తంగా వుండవలసిందిగా కోరుచున్నాం.... ఇట్లు, మీ వర్మ (9949956232)1
- అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాద విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నట్రాజ్ సెంటర్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ల దాడులు ప్రపంచ శాంతికి విఘాతమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం విమర్శించారు. ట్రంప్ను ఒక యుద్ధోన్మాదిగా ఆయన అభివర్ణించారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగి కేంద్రం మౌనం వహించడం దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని, ఇరాన్ నౌక కూల్చివేతను ఖండించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తోందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.1